Political News

కృష్ణంరాజు వ్యాఖ్య‌ల‌ వెనుక కుట్ర‌: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని దేవ‌త‌ల రాజ‌ధానిగా పేర్కొన్న చ‌రిత్రను విస్మ‌రించి.. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్యాఖ్యానించిన జ‌ర్న‌లిస్టు, వ్యాఖ్యాత కృష్ణంరాజుపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌ధాని మ‌హిళ‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని.. ఇలాంటివారిని ఉపేక్షించేది లేద‌న్నారు. క‌ఠినంగా శిక్షించి తీరుతామ‌ని చెప్పారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్య‌ల‌ను ముక్తకంఠంతో ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల ద్వారా మ‌హిళ‌ల‌ను అవ‌మానించ‌డం దారుణ‌మ‌ని అన్నారు.

“ఇది కేవ‌లం అమ‌రావ‌తినే కాదు.. అక్క‌డి మ‌హిళ‌ల‌ను.. ప్ర‌పంచానికి పాఠాలు నేర్పి.. అజ‌రామ‌రంగా విల సిల్లిన బౌద్ధాన్ని కూడా దారుణంగా అవ‌హేళ‌న చేశారు. ఇది ఒక్క అమ‌రావతికే కాదు.. యావ‌త్ మ‌హిళా లోకానికి కూడా అవ‌మానం.” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. అమ‌రావ‌తిపై కుట్ర జ‌రుగుతోంద‌ని.. ఆ కుట్ర ఇప్పుడు మ‌రో రూపంలో కొన‌సాగుతోంద‌ని వ్యాఖ్యానించారు. అమ‌రావతికి ఎంతో ఘ‌న చ‌రిత్ర ఉంద ని తెలిపారు.

అలాంటి చ‌రిత్ర‌ను విస్మ‌రించి.. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్యాఖ్యానిస్తారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వారిలో.. 32 శాతం ఎస్సీ, ఎస్టీలు, 14శాతం బీసీలు ఉన్నారని చెప్పారు. అలాంటి ప్రాంతంలోని మ‌హిళ‌ల‌పై నోరు చేసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. రాజ‌కీయ‌ విశ్లేషకు డి ముసుగులో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందన్నారు. ఇలాంటి వారిని క‌ఠి నంగా శిక్షించి తీరాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on June 8, 2025 9:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

7 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

14 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

44 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago