Political News

కృష్ణంరాజు వ్యాఖ్య‌ల‌ వెనుక కుట్ర‌: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని దేవ‌త‌ల రాజ‌ధానిగా పేర్కొన్న చ‌రిత్రను విస్మ‌రించి.. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్యాఖ్యానించిన జ‌ర్న‌లిస్టు, వ్యాఖ్యాత కృష్ణంరాజుపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌ధాని మ‌హిళ‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని.. ఇలాంటివారిని ఉపేక్షించేది లేద‌న్నారు. క‌ఠినంగా శిక్షించి తీరుతామ‌ని చెప్పారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్య‌ల‌ను ముక్తకంఠంతో ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల ద్వారా మ‌హిళ‌ల‌ను అవ‌మానించ‌డం దారుణ‌మ‌ని అన్నారు.

“ఇది కేవ‌లం అమ‌రావ‌తినే కాదు.. అక్క‌డి మ‌హిళ‌ల‌ను.. ప్ర‌పంచానికి పాఠాలు నేర్పి.. అజ‌రామ‌రంగా విల సిల్లిన బౌద్ధాన్ని కూడా దారుణంగా అవ‌హేళ‌న చేశారు. ఇది ఒక్క అమ‌రావతికే కాదు.. యావ‌త్ మ‌హిళా లోకానికి కూడా అవ‌మానం.” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. అమ‌రావ‌తిపై కుట్ర జ‌రుగుతోంద‌ని.. ఆ కుట్ర ఇప్పుడు మ‌రో రూపంలో కొన‌సాగుతోంద‌ని వ్యాఖ్యానించారు. అమ‌రావతికి ఎంతో ఘ‌న చ‌రిత్ర ఉంద ని తెలిపారు.

అలాంటి చ‌రిత్ర‌ను విస్మ‌రించి.. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్యాఖ్యానిస్తారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వారిలో.. 32 శాతం ఎస్సీ, ఎస్టీలు, 14శాతం బీసీలు ఉన్నారని చెప్పారు. అలాంటి ప్రాంతంలోని మ‌హిళ‌ల‌పై నోరు చేసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. రాజ‌కీయ‌ విశ్లేషకు డి ముసుగులో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందన్నారు. ఇలాంటి వారిని క‌ఠి నంగా శిక్షించి తీరాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on June 8, 2025 9:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

3 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

8 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

9 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

9 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

9 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

9 hours ago