ఏపీ రాజధాని అమరావతిని దేవతల రాజధానిగా పేర్కొన్న చరిత్రను విస్మరించి.. నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించిన జర్నలిస్టు, వ్యాఖ్యాత కృష్ణంరాజుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని.. ఇలాంటివారిని ఉపేక్షించేది లేదన్నారు. కఠినంగా శిక్షించి తీరుతామని చెప్పారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనల ద్వారా మహిళలను అవమానించడం దారుణమని అన్నారు.
“ఇది కేవలం అమరావతినే కాదు.. అక్కడి మహిళలను.. ప్రపంచానికి పాఠాలు నేర్పి.. అజరామరంగా విల సిల్లిన బౌద్ధాన్ని కూడా దారుణంగా అవహేళన చేశారు. ఇది ఒక్క అమరావతికే కాదు.. యావత్ మహిళా లోకానికి కూడా అవమానం.” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతిపై కుట్ర జరుగుతోందని.. ఆ కుట్ర ఇప్పుడు మరో రూపంలో కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. అమరావతికి ఎంతో ఘన చరిత్ర ఉంద ని తెలిపారు.
అలాంటి చరిత్రను విస్మరించి.. నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వారిలో.. 32 శాతం ఎస్సీ, ఎస్టీలు, 14శాతం బీసీలు ఉన్నారని చెప్పారు. అలాంటి ప్రాంతంలోని మహిళలపై నోరు చేసుకుంటారా? అని ప్రశ్నించారు. రాజకీయ విశ్లేషకు డి ముసుగులో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందన్నారు. ఇలాంటి వారిని కఠి నంగా శిక్షించి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు.
This post was last modified on June 8, 2025 9:43 pm
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…