Political News

బ్రేకింగ్… జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతి

తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించిన బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత గురువారం మధ్యాహ్నం తర్వాత ఇంటిలో గుండెపోటు కారణంగా కింద పడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మూడు రోజులపాటు మృత్యువుతో పోరాటం చేశారు. అయితే ఈ పోరులో ఓడిన గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. 

హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన మాగంటి… జూబ్లీహిల్స్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2014, 2018, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో అయితే దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్థన్ రెడ్డిని ఓడించి మరీ జూబ్లీహిల్స్ మీద తన పట్టు నిలుపుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అత్యంత దగ్గరగా మసలుకున్న గోపీనాథ్…తన కోసం పనిచేసే మంచి కార్యకర్తల గణాన్ని పెంపొందించుకున్నారు. ఇదే ఆయనను వరుసబెట్టి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించిందని చెప్పాలి.

టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీతోనే రాజకీయాల్లోకి గోపీనాథ్ అడుగుపెట్టారు. టీడీపీలో నాటి ఉమ్మడి రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి డైరెక్టర్, హైదరాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తదితర పదవులను ఆయన చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో అందరి మాదిరే టీడీపీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు.

పార్టీ మారినా కూడా గోపీనాథ్ జూబ్లీహిల్స్ పై మాత్రం పట్టు విడవలేదు. టీడీపీ తరఫున తొలిసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి..ఆ తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ తరఫున అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీలో మాదిరిగానే బీఆర్ఎస్ లోనూ మాగంటికి మంచి ప్రాధాన్యమే దక్కింది. కేసీఆర్ ముఖ్య అనుచరుల్లో మాగంటి చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే…హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. అంతటి కీలక పదవుల్లో ఉన్న మాగంటి హాఠాత్తుగా చనిపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ కు గురయ్యారు.

Kumar

Recent Posts

వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరో… ఇప్పుడు 2 కోట్ల కంటే తక్కువేనా?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన హిట్ ఫ్రాంచైజ్ 'వెల్‌కమ్ టు ది జంగిల్' (వెల్‌కమ్ 3) కోసం…

50 minutes ago

పెహల్వాన్ అసలు కుస్తీ ఇప్పుడు మొదలు

పెద్ది మొదటి వారాంతం ఘనంగా పూర్తి చేసుకుంది. రెండు వందల యాభై కోట్లకు కొంచెం అటు ఇటు నెంబర్ నమోదు…

3 hours ago

రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి… హీటెక్కిపోయింది!

తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరోమారు వేడి రాజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్…

4 hours ago

భాగ్యరేఖ మార్చాల్సిన బాధ్యత ‘లెనిన్’దే

అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. కాకపోతే బ్యాడ్ లక్ భుజాన వేసుకుని తిరుగుతోంది. ఆఫర్లకు లోటు…

4 hours ago

పవన్ కన్నెర్ర చేస్తే…

ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేనలో ఇప్పుడు ప్రక్షాళన మొదలైందని చెప్పక తప్పదు. తన మాట నమ్మి…

5 hours ago

మంగ‌ళ‌గిరి ఆద‌ర్శం.. త‌మ్ముళ్లు ఫాలో అవుతారా… ?

స‌హ‌జంగా టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ఒక‌రిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పెద్ద‌గా చెప్ప‌రు. ఆయ‌న ఏదైనా చెప్పారంటే ఖ‌చ్చితంగా దానిలో…

6 hours ago