Political News

గుడ్డి వ్యతిరేకత టీడీపీకి మంచిదేనా ?

రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి తగ్గట్లుగా కసరత్తు చేయమని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఓ ఉన్నతస్ధాయి కమిటిని ప్రభుత్వం నియమించింది. కమిటి దాదాపు మూడు నెలలు జిల్లాల కలెక్టర్లు, రెవిన్యు అధికారులతో కసరత్తు చేసి ఓ నివేదికను అందించింది.

13 జిల్లాల రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా మార్చాలని జగన్ నిర్ణయించారు. విశాఖపట్నం జిల్లాలోని అరకు పార్లమెంటు నియోజకవర్గం చాలా పెద్దదిగా కాబట్టి దీన్ని రెండు జిల్లాలుగా చేయాలనే ప్రతిపాదనలున్నాయి. దాంతో జిల్లాల సంఖ్య 26గా మారబోతోంది. ఇటువంటి సమయంలో శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాల సంఖ్య పెంచటంలో రాజకీయమే కనిపిస్తోందట ఈ ఎంపికి. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జిల్లాల సంఖ్యను పెంచితే తాను కూడా మద్దతిచ్చే వాడినంటు చెప్పటమే విచిత్రంగా ఉంది. 2026లో నియోజకవర్గాల పునర్వవ్యస్ధీకరణ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈలోగా జిల్లాల సంఖ్యను పెంచకూడదని డిమాండ్ చేస్తున్నారు.

ఇక్కడ రామ్మోహన్ వాదనలోని డొల్లతనం బాగా కనబడుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తనకు జరిగే లబ్ది ప్రకారమే ఏ నిర్ణయం అయినా తీసుకుంటుందన్నది అందరికీ తెలిసిందే. ఏ అధికారపార్టీ కూడా ప్రతిపక్షాలకు ఉపయోగంగా ఉండేట్లు నిర్ణయం తీసుకుంటుందా ఎక్కడైనా ? ఇంతచిన్న విషయం కూడా రామ్మోహన్ కు తెలీదా? టీడీపీ అధికారంలో ఉన్నపుడు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ప్రతిపక్షాలతో చెప్పే చేసిందా ? వైసీపీ ఆలోచనల ప్రకారం చేసిన ఒక్క నిర్ణయాన్ని చూపించగలరా ? నిర్ణయాలు తీసుకోవటం అన్నది అధికారపార్టీకి ఉన్న అడ్వాంటేజ్.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడితే ఏమి చేయాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఏమైందో 2019 ఎన్నికల్లో నిరూపణ అయ్యింది. చిన్న జిల్లాల ఏర్పాటు అన్నది పరిపాలనా సౌలభ్యం కోసమే అని ప్రభుత్వం చెబుతోంది. కాదు రాజకీయం కోసమే టీడీపీ వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణాలో కూడా 9 జిల్లాలను కేసీయార్ 31 జిల్లాలను చేసినపుడు టీడీపీ ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు ?

చిన్న జిల్లాల ఏర్పాటులో మరో శాస్త్రీయకోణం కూడా ఉంది. అదేమిటంటే ఉత్తరాధి రాష్ట్రాల్లో చిన్న జిల్లాలే ఉండటం వల్ల కేంద్రం ఎక్కువ నిధులిస్తోంది. అంటే కేంద్రం మంజూరు చేసే నిధుల్లో ఎక్కువగా జిల్లాలను యూనిట్ గానే తీసుకుంటోంది. కాబట్టే కేంద్ర నిధుల్లో ఎక్కువగా ఉత్తరాధి రాష్ట్రాల్లోని జిల్లాలకే అందుతోంది. రేపు ఏపిలో కూడా ఎక్కువ జిల్లాలుంటే నిధులు ఎక్కువగా అందుకనే అవకాశాలున్నాయి.

ఒకవేళ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని తేలితే, సమస్యలు పెరిగిపోతే ఏమి చేయాలో జనాలకు బాగా తెలుసు. కాబట్టి జిల్లాల ఏర్పాటయ్యేంత వరకు టీడీపీ ఓపికపట్టాలి. దాని తర్వాత ఫీడ్ బ్యాక్ తీసుకుని వ్యూహాలు రచిస్తే బాగుంటుంది కాని ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ గుడ్డిగా వ్యతిరేకించటం మంచిది కాదు.

This post was last modified on November 9, 2020 6:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

3 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

5 hours ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

6 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

6 hours ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

7 hours ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

7 hours ago