Political News

పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలే: జనసేన

ఏపీలో అధికార కూటమిలో కీలక బాగస్వామి అయిన జనసేన తన శ్రేణులకు ఓ హెచ్చరికతో కూడిన సూచనను చేసింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ లైన్ ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కూడా ఆ పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎంకు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేరిట శుక్రవారం ఓ ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనలో తరచూ జరుగుతున్న పొరపాట్లను పార్టీ ఎత్తి చూపుతూ సలహాలు, సూచనలు చేసింది.

జనసేనకు సంబంధించిన పాలసీపైనా.. జాతీయ, రాష్ట్ర అంశాలపై పార్టీ అనుసరిస్తున్న విధానాలు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి…పార్టీ వ్యూహాల గురించి పార్టీ అధినేత హోదాలో పవన్ కల్యాణ్ పలు సభలు, సమావేశాల్లో  ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉన్నారని ఈ సందర్బంగా హరిప్రసాద్ గుర్తు చేశారు. పార్టీ అధ్యక్షుడే స్వయంగా ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై పార్టీ లైన్ ఇదంటూ చెబుతున్నా… ఇప్పటికీ అక్కడక్కడ కొందరు పార్టీ నేతలు పార్టీ లైన్ ను విస్మరించి మరీ మాట్లాడుతున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ తరహా వ్యాఖ్యలు ఇటు ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ అయోమయానికి కారణంగా నిలుస్తున్నాయని తెలిపారు. 

పార్టీ లైన్ దాటి మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీప్పవని జనసేన సదరు ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. నిజమే మరి… పార్టీ ఆవిర్బవించి పదేళ్లు దాటినా… ప్రజా క్షేత్రంలోకి దిగింది మాత్రం ఆరేళ్ల క్రితమే కదా. ఈ లెక్కన ఆరేళ్ల వయసు కలిగిన పార్టీకి చెందిన శ్రేణుల్లో అంతగా పరిణతి ఉండదనే చెప్పాలి. ఈ భావనతోనే పవన్ కల్యాణ్ ఎప్పికటికప్పుడు పార్టీ విధి విధానాలపై పార్టీ శ్రేణులకు తెలియజేస్తూనే ఉంటారు. ఏ విషయంపై ఎలా వెళితే ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందన్న విషయంపైనా ఆయన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ ఉంటారు. అదే విషయాన్ని ఇప్పుడు నేరుగా మరోమారు ప్రకటన రూపంలో జనసేన తన శ్రేణులకు హెచ్చరికల రూపంలో జారీ చేసింది.

This post was last modified on June 6, 2025 7:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

8 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago