Political News

బెంగుళూరు విషాదం.. డిప్యూటీ సీఎం కన్నీళ్లు!

ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వెలుపల ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ విషాదంగా మారిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన వేళ, గేటు నెం.7 వద్ద తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని విషాదంలోకి నెట్టింది.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “ఆ చిన్నారుల గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది.  15 ఏళ్ల వయసు పిల్లలు 10 మంది చనిపోవడం నా కళ్లారా చూశాను. ఆ కుటుంబాలు ఈ నష్టాన్ని ఎలా భరిస్తాయో అర్థం కావడం లేదు” అంటూ మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలు చూశానని, తన గుండె ఒడిదుడుకులకు లోనైందని చెప్పారు.

అలాగే, పోలీసులు ఇచ్చిన సూచనపై స్పందిస్తూ… “కార్యక్రమాన్ని పది నిమిషాల్లో ముగించమని పోలీస్ కమిషనర్ నాతో చెప్పారు. అప్పటికే ఒకరిద్దరు చనిపోయారని చెప్పారు. అందుకే వేడుకను తక్షణమే ముగించాం. పరిస్థితి ఎంత వేగంగా చేయిదాటి పోయిందో అర్థం కాలేదు” అని డీకే వివరించారు. ప్రభుత్వంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు

ఇక ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా ఊపందుకున్నాయి. కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, డీకే శివకుమార్‌కు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం సిద్ధరామయ్య మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తూ, 15 రోజుల్లో నివేదిక కోరారు. హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది.

ఈ ఘటనలో భద్రతా ఏర్పాట్లు తీవ్రంగా విఫలమయ్యాయన్నది స్పష్టం. ఏకకాలంలో రెండు లక్షల మందికి పైగా గుమిగూడటాన్ని ముందుగానే అంచనా వేయకుండా, సరైన మార్గదర్శకాలు అమలు చేయకపోవడమే ఈ విషాదానికి దారితీసినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. 

This post was last modified on June 5, 2025 5:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

33 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

36 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

1 hour ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago