తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ పెట్టినప్పటి నుండి యాక్టివ్ గా పనిచేస్తున్న తాళ్ళపాక రమేష్ రెడ్డి దంపతులు రాజీనామా చేయటం పార్టీలో సంచలనంగా మారింది. సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని కొత్తగా వచ్చిన వారిని కూడా చంద్రబాబునాయుడు అందలం ఎక్కిస్తున్నాడన్న కోపంతోనే తాము రాజీనామా చేసినట్లు తాళ్ళపాక రమేష్ రెడ్డి చెప్పటం గమనార్హం. గతంలో ఎన్టీయార్ ను బూతులు తిట్టిన వారిని, ఎన్టీయార్ దిష్టిబొమ్మలను దహనం చేసిన వారికి కూడా చంద్రబాబు పార్టీలో పదవులిచ్చి తమను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కకు నెట్టేసినట్లు తాళ్ళపాక దంపతులు మండిపోతున్నారు.
నెల్లూరు సిటీకి చెందిన తాళ్ళపాక ఎన్టీయార్ కు వీరాభిమాని. సినిమాల్లో ఉన్నపుడు అఖిల భారత ఎన్టీయార్ అభిమానుల సంఘానికి జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ అభిమానంతోనే ఎన్టీయార్ తో పాటు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నెల్లూరు ఎంఎల్ఏగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 1994లో ఎన్టీయార్ కు వెన్నుపోటు ఘటన తర్వాత కొంతకాలం రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. ఎన్టీయార్ మరణంతో మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. అయితే రమేష్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో ఎంత చురుగ్గా ఉన్నా చంద్రబాబు దగ్గర మాత్రం ఆదరణ లభించలేదు.
అందుకనే పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జిల్లా పార్టీ కార్యక్రమాలకే పరిమితమైపోయారు. పదవులు రాకపోయినా సరే పార్టీని మాత్రం వదిలిపోలేదు. జిల్లాలో ఇపుడు చాలా సీనియర్లని ప్రచారంలో ఉన్న చాలామంది నేతలకన్నా ముందే రమేష్ రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నారు. మరి చంద్రబాబు, రమేష్ మధ్య ఏమైందో ఏమో మొన్నటి రాష్ట్రకమిటి ప్రకటన తర్వాత తాళ్ళపాక దంపతుల్లో ఒక్కసారిగా అసంతృప్తి పెరిగిపోయింది. తమ మద్దతుదారులతో సమావేశమైన వీరు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు.
వీరి బాటలోనే పార్టీలో అసంతృప్తితో ఉన్న ఆనం జయకుమార్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ ఛైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు కూడా తాళ్ళపాక దంపతుల దారిలోనే వెళ్ళే అవకాశాలున్నట్లు ప్రచారంలో ఉంది. మొత్తానికి పార్టీ కమిటిల ప్రకటన టీడీపీలో బాగా రచ్చ జరుగుతున్నట్లే ఉంది. మరి ఈ సమస్యను చంద్రబాబునాయుడు ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.
This post was last modified on November 9, 2020 2:20 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…