Political News

తాళ్ళపాక దంపతుల రాజీనామా ..టీడీపీలో కలకలం

తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ పెట్టినప్పటి నుండి యాక్టివ్ గా పనిచేస్తున్న తాళ్ళపాక రమేష్ రెడ్డి దంపతులు రాజీనామా చేయటం పార్టీలో సంచలనంగా మారింది. సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని కొత్తగా వచ్చిన వారిని కూడా చంద్రబాబునాయుడు అందలం ఎక్కిస్తున్నాడన్న కోపంతోనే తాము రాజీనామా చేసినట్లు తాళ్ళపాక రమేష్ రెడ్డి చెప్పటం గమనార్హం. గతంలో ఎన్టీయార్ ను బూతులు తిట్టిన వారిని, ఎన్టీయార్ దిష్టిబొమ్మలను దహనం చేసిన వారికి కూడా చంద్రబాబు పార్టీలో పదవులిచ్చి తమను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కకు నెట్టేసినట్లు తాళ్ళపాక దంపతులు మండిపోతున్నారు.

నెల్లూరు సిటీకి చెందిన తాళ్ళపాక ఎన్టీయార్ కు వీరాభిమాని. సినిమాల్లో ఉన్నపుడు అఖిల భారత ఎన్టీయార్ అభిమానుల సంఘానికి జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ అభిమానంతోనే ఎన్టీయార్ తో పాటు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నెల్లూరు ఎంఎల్ఏగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 1994లో ఎన్టీయార్ కు వెన్నుపోటు ఘటన తర్వాత కొంతకాలం రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. ఎన్టీయార్ మరణంతో మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. అయితే రమేష్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో ఎంత చురుగ్గా ఉన్నా చంద్రబాబు దగ్గర మాత్రం ఆదరణ లభించలేదు.

అందుకనే పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జిల్లా పార్టీ కార్యక్రమాలకే పరిమితమైపోయారు. పదవులు రాకపోయినా సరే పార్టీని మాత్రం వదిలిపోలేదు. జిల్లాలో ఇపుడు చాలా సీనియర్లని ప్రచారంలో ఉన్న చాలామంది నేతలకన్నా ముందే రమేష్ రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నారు. మరి చంద్రబాబు, రమేష్ మధ్య ఏమైందో ఏమో మొన్నటి రాష్ట్రకమిటి ప్రకటన తర్వాత తాళ్ళపాక దంపతుల్లో ఒక్కసారిగా అసంతృప్తి పెరిగిపోయింది. తమ మద్దతుదారులతో సమావేశమైన వీరు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు.

వీరి బాటలోనే పార్టీలో అసంతృప్తితో ఉన్న ఆనం జయకుమార్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ ఛైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు కూడా తాళ్ళపాక దంపతుల దారిలోనే వెళ్ళే అవకాశాలున్నట్లు ప్రచారంలో ఉంది. మొత్తానికి పార్టీ కమిటిల ప్రకటన టీడీపీలో బాగా రచ్చ జరుగుతున్నట్లే ఉంది. మరి ఈ సమస్యను చంద్రబాబునాయుడు ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.

This post was last modified on November 9, 2020 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

59 minutes ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

2 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

3 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

5 hours ago