Political News

మాజీ ఐపీఎస్‌.. న్యాయ శాస్త్ర ప‌రీక్ష‌ – జగన్ కోసమేనా?

ఏపీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, గ‌త 2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన‌.. ఆలూరి బాల వెంక‌టేశ్వ‌ర‌రావు(ఏబీవీ) తాజాగా న్యాయ‌శాస్త్ర ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. ఏపీలో లాసెట్ ఎంట్ర‌న్స్ టెస్టు గురువారం ప్రారంభ‌మైంది. ఈ ప‌రీక్ష‌కు ఆయ‌న రావ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్ ఎంట్ర‌న్స్‌ను గురువారం నిర్వ‌హించారు. లా చ‌దివేందుకు వ‌యో ప‌రిమితి నిబంధన‌లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలోనే ఏబీవీ ఈ ప‌రీక్ష‌కు హాజ‌రయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇనిస్టిట్యూట్ కేంద్రంలో నిర్వ‌హించిన ప్ర‌వేశ‌ప‌రీక్ష‌కు ఆయ‌న హాజరై సాధార‌ణ విద్యార్థుల‌తో స‌మానంగా త‌న సీటులోకి వెళ్లి కూర్చున్నారు. ఈ ప‌రీక్ష రెండు విడ‌త‌లుగా జ‌ర‌గ‌నుంది. ఉద‌యం, మ‌ధ్యాహ్నం రెండు సెష‌న్ల‌లోనూ ప్ర‌వేశ ప‌రీక్ష జ‌రుగుతుంది. అయితే..ఏబీవీ ఇప్ప‌టికే ఐపీఎస్‌గా అనేక జిల్లాల్లో ప‌నిచేయ‌డం.. కీల‌క‌మైన ఇంటెలిజెన్స్‌లో చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం తెలిసిందే.

అయినా.. ఆయ‌న న్యాయ శాస్త్రం ఎందుకు చ‌దువుతున్న‌ట్టు? అనేది ఆశ్చ‌ర్యంగా అనిపించ‌డం ఖాయం. అయితే.. ఏబీవీ ఐపీఎస్‌గా రిటైరైన త‌ర్వాత‌.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్‌పై పోరాటం చేస్తాన‌ని.. ఆయ‌న అక్ర‌మాల‌ను వెలుగులోకి తీసుకువ‌స్తాన‌ని తూర్పుగోదావ‌రి జిల్లాలో గ‌త నెల‌లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో శ‌ప‌థం చేశారు. అయితే.. ఇలా జ‌గ‌న్‌పై పోరాటం చేసేందుకు.. ఆయ‌న‌కు న్యాయ‌ప‌ర‌మైన స‌బ్జెక్టులో మ‌రింత ద‌న్ను కావాల్సిన అవ‌స‌రం ఉంది.

ఈ నేప‌థ్యంలోనే ఏబీవీ నేరుగా న్యాయ శాస్త్రాన్ని అభ్య‌సించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఏబీవీ.. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. అదికూడా రాజ‌కీయాల్లోకి జ‌గ‌న్ కోస‌మే వ‌స్తున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు కానీ, రాజ‌కీయంగా కంటే కూడా.. జ‌గ‌న్‌ను ఎదిరించేందుకు న్యాయశాస్త్రం అభ్య‌సించ‌డ‌మే క‌రెక్ట్ అనే భావ‌నకు వ‌చ్చి ఉంటారు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం ఎంట్ర‌న్స్‌లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకుని కోర్సు ప్రారంభిస్తే.. 2028 నాటికి మూడేళ్ల లా కోర్సును పూర్తి చేయొచ్చు. ఆ త‌ర్వాత‌.. పీజీ కోర్సు కూడా పూర్తి చేసే అవ‌కాశం ఉంటుంది. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏబీవీ లాయ‌ర్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

This post was last modified on June 5, 2025 2:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

10 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

18 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago