“ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ ఒక్కసారిగా ఎగబాకింది. తారా జువ్వలా దూసుకుపోయింది. మనం ఎవరూ ఊహించని రీతిలో ఆయన గ్రాఫ్ పుంజుకుంది.” -తాజాగా కేంద్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఇది నిజమేనని జాతీయ మీడియా కూడా పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మోడీ హవా మరింత పెరిగినట్టు కథనాలు రాసుకొచ్చింది. సాధారణంగా.. విశ్వగురుగా పేరొందిన మోడీ.. ఇప్పుడు మరింత పుంజుకున్నారనేది ఈ కథనాల సారాంశం.
వాస్తవానికి ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. ఒక నిస్తేజం అలుముకుంది. కానీ.. అంతలోనే తేరుకున్నారు. ఆ వెంటనే ఊహించనివిధంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టారు. ఇది పాకిస్థాన్ను టార్గెట్ చేసుకుని చేసింది కాకపోవడమే.. మోడీని ప్రపంచ స్థాయిలో హీరోగా నిలబెట్టిందని మీడియా పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంపై ఎవరికీ సానుభూతి లేదు. అలాంటి ఉగ్రవాద స్థావరాలనే మోడీ టార్గెట్ చేసుకున్నారు.
పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని.. ఆపరేషన్ సిందూర్ను చేపట్టారు. తద్వారా ప్రపంచానికి భారత్.. ఉగ్రవాద ఏరివేతలో ఏమాత్రం రాజీపడని దేశంగా .. ప్రధాని మోడీని ధీరో దాత్తుడిగా నిలబెట్టిందన్నది అంతర్జాతీయ మీడియా కూడా పేర్కొంది. ఇదొక యాస్పెక్ట్ అయితే.. ఇక, మరొకటి.. తాజాగా ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్.. 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకడం. ఇది మరింత కీలకంగా మారింది. తరచుగా మోడీ.. భారత్ వృద్ధి చెందుతోందని.. త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటుందని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జపాన్ను పక్కకు నెట్టి.. 4వ స్థానానికి చేరింది. ఇదికూడా.. మోడీ తీసుకున్న నిర్ణయాలు.. పాలనా దక్షతకు నిదర్శనమని.. జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా(కొన్ని) కొనియాడింది. ఇక, ఎప్పటికప్పుడు పాలకుల గ్రాఫ్లను అంచనావేసే.. ఇండియా టుడే.. తాజాగా మోడీ గ్రాఫ్ అంతర్జాతీయంగా పుంజుకుందని.. పేర్కొంది. ప్రపంచం యావత్తు.. ఇప్పుడు భారత్వైపే చూస్తోందని తెలిపింది.
This post was last modified on May 26, 2025 3:38 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…