“ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ ఒక్కసారిగా ఎగబాకింది. తారా జువ్వలా దూసుకుపోయింది. మనం ఎవరూ ఊహించని రీతిలో ఆయన గ్రాఫ్ పుంజుకుంది.” -తాజాగా కేంద్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఇది నిజమేనని జాతీయ మీడియా కూడా పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మోడీ హవా మరింత పెరిగినట్టు కథనాలు రాసుకొచ్చింది. సాధారణంగా.. విశ్వగురుగా పేరొందిన మోడీ.. ఇప్పుడు మరింత పుంజుకున్నారనేది ఈ కథనాల సారాంశం.
వాస్తవానికి ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. ఒక నిస్తేజం అలుముకుంది. కానీ.. అంతలోనే తేరుకున్నారు. ఆ వెంటనే ఊహించనివిధంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టారు. ఇది పాకిస్థాన్ను టార్గెట్ చేసుకుని చేసింది కాకపోవడమే.. మోడీని ప్రపంచ స్థాయిలో హీరోగా నిలబెట్టిందని మీడియా పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంపై ఎవరికీ సానుభూతి లేదు. అలాంటి ఉగ్రవాద స్థావరాలనే మోడీ టార్గెట్ చేసుకున్నారు.
పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని.. ఆపరేషన్ సిందూర్ను చేపట్టారు. తద్వారా ప్రపంచానికి భారత్.. ఉగ్రవాద ఏరివేతలో ఏమాత్రం రాజీపడని దేశంగా .. ప్రధాని మోడీని ధీరో దాత్తుడిగా నిలబెట్టిందన్నది అంతర్జాతీయ మీడియా కూడా పేర్కొంది. ఇదొక యాస్పెక్ట్ అయితే.. ఇక, మరొకటి.. తాజాగా ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్.. 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకడం. ఇది మరింత కీలకంగా మారింది. తరచుగా మోడీ.. భారత్ వృద్ధి చెందుతోందని.. త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటుందని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జపాన్ను పక్కకు నెట్టి.. 4వ స్థానానికి చేరింది. ఇదికూడా.. మోడీ తీసుకున్న నిర్ణయాలు.. పాలనా దక్షతకు నిదర్శనమని.. జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా(కొన్ని) కొనియాడింది. ఇక, ఎప్పటికప్పుడు పాలకుల గ్రాఫ్లను అంచనావేసే.. ఇండియా టుడే.. తాజాగా మోడీ గ్రాఫ్ అంతర్జాతీయంగా పుంజుకుందని.. పేర్కొంది. ప్రపంచం యావత్తు.. ఇప్పుడు భారత్వైపే చూస్తోందని తెలిపింది.
This post was last modified on May 26, 2025 3:38 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…