వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఆదివారం సాయంత్రం కాకాణిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఎక్కడ అరెస్టు చేశారనే విషయంపై పోలీసులు రెండు రకాలుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. తొలుత ఆయనను కేరళలో పట్టుకున్నామన్నారు.
కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఆయన వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంటే అదుపులోకి తీసుకున్నామని మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియా దీనినే ప్రచారం చేసింది. అయితే.. ఆ తర్వాత.. కాకాణిని బెంగళూరు సమీపంలోని ఓ గ్రామంలో అరెస్టు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే.. కోర్టుకు సమర్పించిన పత్రాలలో మాత్రం బెంగళూరుకు సమీపంలోని ఓ విలేజ్ రిసార్ట్లో అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.
ఈరోజు తెల్లవారు జామునే నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు.. ఆయనను స్థానిక జిల్లా పోలీసు ట్రైనింగ్ కేంద్రంలో ఉంచారు. అనంతరం.. భారీ భద్రత నడుమ వెంకటగిరి కోర్టుకు హాజరు పరిచారు. గతంలో ఈ కోర్టులోనే దొంగతనం జరగడం.. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వర్సెస్ కాకాణికి మధ్య ఉన్న పరువు నష్టం కేసులో పత్రాలు చోరీ కావడం తెలిసిందే. పోలీసులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన జడ్జి కాకాణికి 14 రోజుల రిమాండ్ విధించారు.
కాకాణిపై కేసులు ఇవీ..
1) గనుల అక్రమ తవ్వకాలు
2) 2 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్(సున్నపురాయి) అక్రమ రవాణా
3) భారీ సౌండ్ వచ్చే పేలుడు పదార్థాల వినియోగం.
4) గనుల తవ్వకాలు అడ్డుకున్న ఎస్టీలపై దౌర్జన్యం.
5) ఎస్టీల ఇళ్లు కూల్చి వేత, దూషణలు.(ఇది ఎస్సీ ఎస్టీ కేసు)
6) పోలీసుల విచారణను తప్పుదారి పట్టించడం.
7) విధుల్లో ఉన్న పోలీసులను ఇబ్బందులకు గురి చేయడం.
This post was last modified on May 26, 2025 1:04 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…