వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ స్కాం జరిగిందని.. దాదాపు 3200 కోట్లరూపాయలకు పైగానే ప్రజా ధనాన్ని దోచుకున్నారని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ బృందం వేగంగా పనిచేస్తోంది. అనేక మందిని అరెస్టు కూడా చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తనను సాక్షిగా పిలిస్తే.. మరిన్ని కీలక విషయాలు..తనకు తెలిసిన అంశాలను సోదాహరణంగా వివరించేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం రమేష్ వెల్లడించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఇంకా కీలక విషయాలపై దృష్టి పెట్టినట్టుగా లేరని అన్నారు. నెల నెల రూ.5 కోట్ల వరకు జగన్ మనుషులు నొక్కేశారని.. వైన్ దుకాణాల్లో పనిచేసిన ఉద్యోగుల జీతాల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారని రమేష్ వ్యాఖ్యానించారు.
ఆయా వివరాలన్నీ.. తన వద్ద ఉన్నాయని చెప్పిన ఆయన.. వాటిని అధికారులకు ఇచ్చేందుకు.. మరింత లోతుగా విషయాలను వెల్లడించేందుకు సాక్ష్యాలతో సహా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనను సిట్ పిలిస్తే.. అవన్నీ వారికి వివరిస్తానని వెల్లడించారు. ఉద్యోగులే కాకుండా.. సెక్యూరిటీ సిబ్బంది నుంచి కూడా వేతనాలపై కమీషన్లు తీసుకున్నారని.. ఇది కూడా నెలకు రూ.3 కోట్ల వరకు ఉంటుందని చెప్పు కొచ్చారు. దీనిపై నా తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.
జగన్కు సవాల్
ఇక, తన విద్యుత్ కంపెనీల విషయంలో లాలూచీ పడ్డానన్న జగన్ విమర్శలపైనా ఎంపీ రమేష్ స్పందించారు. తాను అక్రమాలకు ఒడిగట్టినట్టు నిరూపిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. లేకపోతే.. జగన్ తన పార్టీని మూసేస్తారా? అని సవాల్ రువ్వారు. ప్రస్తుతం రమేష్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఆయనను సిట్ అధికారులు పిలుస్తారా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on May 25, 2025 2:48 pm
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…