Political News

వైసీపీ లిక్క‌ర్ స్కాం.. బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

వైసీపీ హ‌యాంలో ఏపీలో లిక్క‌ర్ స్కాం జ‌రిగింద‌ని.. దాదాపు 3200 కోట్ల‌రూపాయ‌ల‌కు పైగానే ప్ర‌జా ధ‌నాన్ని దోచుకున్నార‌ని కూట‌మి ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర‌బాబు నేతృత్వంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్ర‌స్తుతం ఈ బృందం వేగంగా ప‌నిచేస్తోంది. అనేక మందిని అరెస్టు కూడా చేసింది. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై బీజేపీ ఎంపీ, అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స‌భ్యుడు సీఎం ర‌మేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు త‌న‌ను సాక్షిగా పిలిస్తే.. మ‌రిన్ని కీల‌క విష‌యాలు..త‌న‌కు తెలిసిన అంశాల‌ను సోదాహ‌ర‌ణంగా వివ‌రించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని సీఎం ర‌మేష్ వెల్ల‌డించారు. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. ఇంకా కీల‌క విష‌యాల‌పై దృష్టి పెట్టిన‌ట్టుగా లేర‌ని అన్నారు. నెల నెల రూ.5 కోట్ల వ‌ర‌కు జ‌గ‌న్ మ‌నుషులు నొక్కేశార‌ని.. వైన్ దుకాణాల్లో ప‌నిచేసిన ఉద్యోగుల జీతాల్లోనూ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌ని రమేష్ వ్యాఖ్యానించారు.

ఆయా వివ‌రాల‌న్నీ.. త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్పిన ఆయ‌న‌.. వాటిని అధికారుల‌కు ఇచ్చేందుకు.. మ‌రింత లోతుగా విష‌యాల‌ను వెల్ల‌డించేందుకు సాక్ష్యాల‌తో స‌హా తాను సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. త‌న‌ను సిట్ పిలిస్తే.. అవ‌న్నీ వారికి వివ‌రిస్తాన‌ని వెల్ల‌డించారు. ఉద్యోగులే కాకుండా.. సెక్యూరిటీ సిబ్బంది నుంచి కూడా వేత‌నాల‌పై క‌మీష‌న్లు తీసుకున్నార‌ని.. ఇది కూడా నెల‌కు రూ.3 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్పు కొచ్చారు. దీనిపై నా త‌న ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయ‌న్నారు.

జ‌గ‌న్‌కు స‌వాల్‌

ఇక‌, త‌న విద్యుత్ కంపెనీల విష‌యంలో లాలూచీ ప‌డ్డాన‌న్న జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌పైనా ఎంపీ ర‌మేష్ స్పందించారు. తాను అక్ర‌మాల‌కు ఒడిగ‌ట్టిన‌ట్టు నిరూపిస్తే.. తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని చెప్పారు. లేక‌పోతే.. జ‌గ‌న్ త‌న పార్టీని మూసేస్తారా? అని స‌వాల్ రువ్వారు. ప్ర‌స్తుతం ర‌మేష్ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. మ‌రి ఆయ‌న‌ను సిట్ అధికారులు పిలుస్తారా? లేదా? అనేది చూడాలి.

This post was last modified on May 25, 2025 2:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

32 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

1 hour ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago