ఒక సినిమాలో ఎప్పుడు పాట ఉండాలి.. అది ఎలా ఉండాలి అన్నది నిర్ణయించేది దర్శకుడు. పాటకు తగ్గ సందర్భాన్ని అతను సృష్టించి సంగీత దర్శకుడికి చెబితే.. అతను అందుకు అనుగుణంగా పాట కంపోజ్ చేస్తాడు. ఐతే ‘పుష్ప-2’ సినిమా ఆల్బంలో ఆఖర్లో వచ్చి యాడ్ అయిన ‘పీలింగ్స్’ పాట విషయంలో మాత్రం క్రెడిట్ అంతా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్దేనట. సినిమాలో ఆ పాట పెట్టే అవకాశం ఎంతమాత్రం లేకపోయినా.. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్లను ఒప్పించి తానే ఆ సాంగ్ పెట్టించినట్లు దేవిశ్రీ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘పుష్ప’ పెద్ద హిట్టవడంతో ‘పుష్ప-2’కు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని క్రేజ్ వచ్చిందని.. ఏ భాష వాళ్లు ఆ భాషలో పుష్ప-2ను సొంత సినిమాగా భావించారని దేవిశ్రీ అభిప్రాయపడ్డాడు. అల్లు అర్జున్ అంటే డ్యాన్సులకు ప్రసిద్ధి అని.. అలాంటి హీరోను మరింత సెలబ్రేట్ చేయడానికి తగ్గ ‘కుత్తు’ సాంగ్ (తమిళంలో మంచి ఊపున్న పాటను ఇలా పిలుస్తారు) ‘పుష్ప-2’లో ఉండాలని తాను, బన్నీ చర్చించుకున్నట్లు దేవి తెలిపాడు.
తర్వాత తనే ఐడియా ఇచ్చి ‘పీలింగ్స్’ పాటను కంపోజ్ చేస్తే సుకుమార్కు అది విపరీతంగా నచ్చేసిందని.. ఆయన ఆ ఉత్సాహంలో సూపర్ స్టెప్ కూడా వేశారని.. ఆ వీడియో కూడా తన దగ్గర ఉందని.. అదే స్టెప్ను సినిమాలో కూడా పెట్టాలని తాను సూచించానని దేవి తెలిపాడు. ఐతే ‘పుష్ప-2’ నిడివి బాగా ఎక్కువైపోయిందని.. ఎంత ఎడిట్ చేసినా 3 గంటల 20 నిమిషాల రన్ టైం వచ్చిందని.. అంత రన్ టైంలో పాట ఎలా పెట్టగలం అని సుకుమార్ వద్దు అనుకున్నా.. తర్వాత ఆ పాటను అన్ని భాషల వాళ్లూ సెలబ్రేట్ చేస్తారనే ఉద్దేశంతో ఒప్పించి సినిమాలో పెట్టించానని దేవి తెలిపాడు. అనుకున్నట్లే ఈ పాటకు మాంచి రీచ్ వచ్చిందని దేవి తెలిపాడు.
This post was last modified on May 25, 2025 5:21 pm
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…
ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య టాలీవుడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడడం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.…
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత…