ఒక సినిమాలో ఎప్పుడు పాట ఉండాలి.. అది ఎలా ఉండాలి అన్నది నిర్ణయించేది దర్శకుడు. పాటకు తగ్గ సందర్భాన్ని అతను సృష్టించి సంగీత దర్శకుడికి చెబితే.. అతను అందుకు అనుగుణంగా పాట కంపోజ్ చేస్తాడు. ఐతే ‘పుష్ప-2’ సినిమా ఆల్బంలో ఆఖర్లో వచ్చి యాడ్ అయిన ‘పీలింగ్స్’ పాట విషయంలో మాత్రం క్రెడిట్ అంతా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్దేనట. సినిమాలో ఆ పాట పెట్టే అవకాశం ఎంతమాత్రం లేకపోయినా.. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్లను ఒప్పించి తానే ఆ సాంగ్ పెట్టించినట్లు దేవిశ్రీ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘పుష్ప’ పెద్ద హిట్టవడంతో ‘పుష్ప-2’కు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని క్రేజ్ వచ్చిందని.. ఏ భాష వాళ్లు ఆ భాషలో పుష్ప-2ను సొంత సినిమాగా భావించారని దేవిశ్రీ అభిప్రాయపడ్డాడు. అల్లు అర్జున్ అంటే డ్యాన్సులకు ప్రసిద్ధి అని.. అలాంటి హీరోను మరింత సెలబ్రేట్ చేయడానికి తగ్గ ‘కుత్తు’ సాంగ్ (తమిళంలో మంచి ఊపున్న పాటను ఇలా పిలుస్తారు) ‘పుష్ప-2’లో ఉండాలని తాను, బన్నీ చర్చించుకున్నట్లు దేవి తెలిపాడు.
తర్వాత తనే ఐడియా ఇచ్చి ‘పీలింగ్స్’ పాటను కంపోజ్ చేస్తే సుకుమార్కు అది విపరీతంగా నచ్చేసిందని.. ఆయన ఆ ఉత్సాహంలో సూపర్ స్టెప్ కూడా వేశారని.. ఆ వీడియో కూడా తన దగ్గర ఉందని.. అదే స్టెప్ను సినిమాలో కూడా పెట్టాలని తాను సూచించానని దేవి తెలిపాడు. ఐతే ‘పుష్ప-2’ నిడివి బాగా ఎక్కువైపోయిందని.. ఎంత ఎడిట్ చేసినా 3 గంటల 20 నిమిషాల రన్ టైం వచ్చిందని.. అంత రన్ టైంలో పాట ఎలా పెట్టగలం అని సుకుమార్ వద్దు అనుకున్నా.. తర్వాత ఆ పాటను అన్ని భాషల వాళ్లూ సెలబ్రేట్ చేస్తారనే ఉద్దేశంతో ఒప్పించి సినిమాలో పెట్టించానని దేవి తెలిపాడు. అనుకున్నట్లే ఈ పాటకు మాంచి రీచ్ వచ్చిందని దేవి తెలిపాడు.
This post was last modified on May 25, 2025 5:21 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…