Political News

కాళేశ్వ‌రంపై కీల‌క నిర్ణ‌యం.. బీఆర్ఎస్‌లో వ‌ణుకు?

బీఆర్ఎస్ హ‌యాంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్రాణ‌ప్ర‌దంగా భావిస్తున్న‌ట్టు అప్ప‌టి సీఎం కేసీఆర్ చెప్పా రు. అయితే.. ఈ కాళేశ్వ‌ర‌మే.. కాసులు కురిపించింద‌ని.. కోట్ల‌కు కోట్ల సొమ్మును వెనుకేసుకునేలా చేసింద‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే రేవంత్‌రెడ్డి సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టాక అవ‌కాశం కోసం ఎదురు చూశారు. ఇంత‌లోనే కాళేశ్వ‌రానికి అనుసంధానంగా నిర్మించిన మేడిగ‌డ్డ ప్రాజెక్టు కూలింది. దీంతో కాళేశ్వ‌రంపై దుమ్ముదులిపే చ‌ర్య‌ల‌కు రంగం రెడీ చేసుకున్నారు.

ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో క‌మిష‌న్ వేశారు. ప్ర‌స్తుతం దీనికి మ‌రో ఏడాది స‌మ‌యం కూడా పెంచారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే నెల 5న మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు రావాల‌ని రెండు రోజుల కింద‌ట క‌మిష‌న్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మేడిగ‌డ్డ‌ను కాంగ్రెస్ నాయ‌కులే బాంబులు పెట్టి పేల్చార‌ని.. దీనిని త‌మ‌పై రుద్దుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

వాస్త‌వానికి గ‌తంలోనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు ఆయ‌న‌పై కేసు పెట్టారు. ఈ కేసు ప్ర‌స్తుతం విచార‌ణ ప‌రిధిలో ఉంది. ఇంత‌లోనే మ‌రోసారి కాంగ్రెస్‌పై కేటీఆర్ సేమ్ టు సేమ్ వ్యాఖ్య‌లు చేశారు. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న రేవంత్ రెడ్డి స‌ర్కారు… తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. ప్ర‌భుత్వ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు అక్ర‌మాల‌ను ప్ర‌స్తుతం విచారిస్తున్న పీసీ ఘోష్ క‌మిష‌న్‌కు స‌మాంత‌రంగా మ‌రో విచార‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు.

అదే.. సీబీఐ. కాళేశ్వ‌రం ప్రాజెక్టును ‘కూలేశ్వ‌రం’ ప్రాజెక్టుగా గ‌తంలో అభివ‌ర్ణించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా ముదురుతున్న మాటల యుద్ధంతో ఏకంగా దీనిని సీబీఐకి అప్ప‌గించే విష‌యంపై శుక్ర‌వారం రాత్రి మంత్రివ‌ర్గంలో చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. దీనికి మంత్రులు కూడా ఓకే చెప్పార‌ని స‌మాచారం. అంటే..నేడో రేపో.. దీనిపై నిర్ణ‌యం తీసుకుని.. కేంద్రానికి రిఫ‌ర్ చేయ‌నున్నారు. బీజేపీ కూడా.. దీనిపై సీరియ‌స్‌గానే ఉన్న‌ద‌రిమిలా.. సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే.. బీఆర్ఎస్‌కు మ‌రింత ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 24, 2025 3:13 pm

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

44 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

4 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

4 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

5 hours ago