Political News

ప‌వ‌న్ జ‌న‌సేన‌ సినిమా.. స‌క్సెస్సేనా ..!

‘వెండితెర వేదిక‌గా’ క్యాప్ష‌న్‌తో ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రారంభించిన మ‌న వూరు.. మాటా మంతి కార్య‌క్ర‌మం స‌క్సెస్ అయింది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా రెండు ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చు కోవాల‌న్న‌ది ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన ఉద్దేశం. 1) గ్రామీణుల స‌మ‌స్య‌ల‌ను వినేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్న సంకేతాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి పంపించ‌డం. 2) గ్రామీణుల‌కు చేరువ‌కావ‌డం ద్వారా.. త‌న ఉనికిని ప‌దిలం చేసుకోవ‌డం.

ప్ర‌స్తుతం గ్రామీణుల ఓటు బ్యాంకు.. బ‌లంగా ఉంది. ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇలాంటి స‌మయంలో ఆ ఓటు బ్యాంకును బ‌దాబ‌ద‌లు చేసి.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌న్న‌ది జ‌న‌సేన ఉద్దేశం. ఈ క్ర‌మంలోనే త‌ర‌చుగా గ్రామీణ స‌మ‌స్య‌ల‌పైనా.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైనా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోక‌స్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే వారితో నేరు మాట్లాడి.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని.. త‌ద్వారా.. వారిని త‌న‌వైపు తిప్పుకోవాల‌న్న‌ది కీల‌క ప్ర‌య‌త్నం.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు గ్రామీణ స్థాయిలో సుమారు 42 శాతం వ‌ర‌కు ఓటు బ్యాంకు ఉంది. ఇది నిర్దిష్టంగా ప‌డే ఓటు బ్యాంకు. న‌గ‌రాల‌తో పోల్చుకుంటే.. గ్రామీణ స్థాయిలో ఓటుబ్యాంకు ప‌దిలంగా ఉం టుంది. ఖ‌చ్చితంగా ఓటు వేసేవారే. అయితే.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాం నుంచి కూడా.. గ్రామీణులు.. ఆ కుటుంబానికి అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌కు ఆ ఓటు బ్యాంకు అనుకూలంగా మారింద‌నే వాద‌న ఉంది.

గ‌త ఏడాది కూట‌మి ప్ర‌భంజనంలోనూ.. వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంకు ద‌క్క‌డం వెనుక గ్రామీణులు కీల‌క పాత్ర పోషించారు. ఇప్పుడు దీనిని త‌మ‌వైపు తిప్పుకోవ‌డం ద్వారా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వైసీపీ ఓటు బ్యాంకును చిన్నాభిన్నం చేయాల‌న్న‌ది అంత‌ర్గ‌త రాజ‌కీయ ల‌క్ష్యం. ఈ క్ర‌మంలోనే మాటా మంతీపేరుతో గ్రామీణుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఇది తాజాగా స‌క్సెస్ కావ‌డంతో భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. మ‌రి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.

Satya

Recent Posts

యంగ్ హీరోకు త‌మిళ డిస్ట్రిబ్యూట‌ర్ ఇచ్చిన షాక్

దేశంలో తెలుగు ప్రేక్ష‌కులంత పెద్ద మ‌న‌సు ఇంకెవ‌రికీ ఉండ‌దంటూ ఇత‌ర భాష‌ల ఫిలిం మేక‌ర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా త‌మిళ…

2 hours ago

వైసీపీకీ ఓ ‘సూపర్ యాప్’ వచ్చేసింది!

ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…

4 hours ago

కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు

విష‌యం చిన్న‌దే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా చేయ‌లేనిది.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…

5 hours ago

ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…

5 hours ago

చెన్నై ల‌వ్ స్టోరీ ఎందుకు చేతులు మారింది?

బేబీ సినిమాతో పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు ద‌ర్శ‌క నిర్మాత సాయిరాజేష్‌. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణ‌వి చైత‌న్య‌, ఆనంద్…

7 hours ago

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

8 hours ago