‘వెండితెర వేదికగా’ క్యాప్షన్తో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించిన మన వూరు.. మాటా మంతి కార్యక్రమం సక్సెస్ అయింది. ఈ కార్యక్రమం ద్వారా రెండు లక్ష్యాలను నెరవేర్చు కోవాలన్నది పవన్ కల్యాణ్ ప్రధాన ఉద్దేశం. 1) గ్రామీణుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలను బలంగా ప్రజల్లోకి పంపించడం. 2) గ్రామీణులకు చేరువకావడం ద్వారా.. తన ఉనికిని పదిలం చేసుకోవడం.
ప్రస్తుతం గ్రామీణుల ఓటు బ్యాంకు.. బలంగా ఉంది. ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆ ఓటు బ్యాంకును బదాబదలు చేసి.. తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది జనసేన ఉద్దేశం. ఈ క్రమంలోనే తరచుగా గ్రామీణ సమస్యలపైనా.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైనా పవన్ కల్యాణ్ ఫోకస్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే వారితో నేరు మాట్లాడి.. వారి సమస్యలు తెలుసుకుని.. తద్వారా.. వారిని తనవైపు తిప్పుకోవాలన్నది కీలక ప్రయత్నం.
ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు గ్రామీణ స్థాయిలో సుమారు 42 శాతం వరకు ఓటు బ్యాంకు ఉంది. ఇది నిర్దిష్టంగా పడే ఓటు బ్యాంకు. నగరాలతో పోల్చుకుంటే.. గ్రామీణ స్థాయిలో ఓటుబ్యాంకు పదిలంగా ఉం టుంది. ఖచ్చితంగా ఓటు వేసేవారే. అయితే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి కూడా.. గ్రామీణులు.. ఆ కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్కు ఆ ఓటు బ్యాంకు అనుకూలంగా మారిందనే వాదన ఉంది.
గత ఏడాది కూటమి ప్రభంజనంలోనూ.. వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంకు దక్కడం వెనుక గ్రామీణులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు దీనిని తమవైపు తిప్పుకోవడం ద్వారా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ఓటు బ్యాంకును చిన్నాభిన్నం చేయాలన్నది అంతర్గత రాజకీయ లక్ష్యం. ఈ క్రమంలోనే మాటా మంతీపేరుతో గ్రామీణులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇది తాజాగా సక్సెస్ కావడంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. మరి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on May 23, 2025 5:37 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…