Political News

జగన్ జైలుకెళ్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు

మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారం ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసులో విచారణ వేగవంతం చేయాలని టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పలుమార్లు కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక, జగన్ బెయిల్ రద్దు చేయాలని కూడా ఆయన కోర్టు మెట్లెక్కారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జైలుకు వెళితేనే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తాయని ప్రత్తిపాటి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.‌

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, రాష్ట్రం బాగుపడాలని కోరుకునే వారంతా జగన్ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నారని అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిలకలూరిపేటలో కూటమి పార్టీల శ్రేణులపై ఈగ వాలకుండా చూస్తున్నానని చెప్పారు. కూటమి పార్టీలోని ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచేలా పనిచేస్తానని, అదే తన లక్ష్యమని అన్నారు.

కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు విభేదాలు పక్కనపెట్టి పనిచేయాలని హితవు పలికారు. ఇతర పార్టీల నుంచి నాయకులు చేరుతానంటే వారిని చేర్చుకోవాలని సూచించారు. ఓడిపోతానని తెలిసే విడదల రజనీ చిలకలూరిపేటలో పోటీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ రజనీ పోటీ చేసి ఉంటే టీడీపీకి లక్షల్లో మెజారిటీ వచ్చేదని అన్నారు.

This post was last modified on May 21, 2025 4:07 pm

Share
Show comments
Published by
Satya
Tags: Andhra

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago