జనావాసాలపై ఎనుగుల దాడుల నుంచి ఏపీకి ఏళ్ల తరబడి ఊరటే లభించలేదు. అయితే ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఏడాది తిరక్కుండానే ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఏనుగులను జనావాసాల నుంచి తరిమికొట్టే కుంకీ ఏనుగులను ఆయన ఏపీకి తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా కర్ణాకట రాజధాని బెంగళూరులోని విధాన సౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఏడాది క్రితమే పవన్ కుంకీ ఏనుగుల కోసం కర్ణాటకకు వినతి పంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వినతికి అనుగుణంగా కర్ణాటక 5 కుంకీ ఏనుగులను ఏపీకి అప్పగించింది.
కుంకీ ఏనుగులను స్వీకరించేందుకు స్వయంగా పవన్ కల్యాణ్ బుధవారం బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు పవన్ కు గ్రాండ్ వెల్ కమ్ పలికింది. కర్ణాటక అటవీ శాఖ మంత్రి పవన్ కాన్వాయ్ వద్దకు వచ్చి మరీ స్వాగతం పలికారు. ఇక వేదిక మీద పవన్ ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు తమ మధ్య కూర్చోబెట్టుకుని, ఆ తర్వాత పవన్ కు ఇరువైపులా వారు నిలుచుని పవన్ ను ట్రీట్ చేసిన తీరు నిజంగానే ఆశ్చర్యానికి గురి చేసింది. పొరుగు రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కర్ణాటక సీఎం సహా డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు రిసీవ్ చేసుకున్న తీరు నిజంగానే అద్భుతమని చెప్పాలి.
ఈ సందర్భంగా ఏడాది క్రితమే ఏపీకి కుంకీ ఏనుగులను అప్పగించేందుకు అంగీకరించిన ఒప్పంద పత్రాలు, కుంకీ ఏనుగులను అప్పగింతకు సంబంధించిన పత్రాలను ఓ బ్రీఫ్ కేసులో పెట్టి… సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు పవన్ చేతిలో పెట్టిన దృశ్యాలు కూడా అమితంగా ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ వేడుక కన్నుల పండువగా జరిగిందని చెప్పక తప్పదు. ఈ కుంకీ ఏనుగుల కోసం ఇప్పటికే పలమనేరు పరిధిలోని అటవీ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాటిని ఇప్పుడు బెంగళూరు నుంచి నేరుగా అక్కడికే తరలించనున్నారు.
This post was last modified on May 21, 2025 5:04 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…