Political News

సోనియా గాంధీ 142 కోట్లు నొక్కేశారు: ఈడీ సంచ‌ల‌న కామెంట్స్‌

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియాగాంధీపై ఎన్ ఫోర్స్‌మెంటు డైరె క్ట‌రేట్‌(ఈడీ) సంచ‌ల‌న అభియోగాలు న‌మోదు చేసింది. వీటినే.. తాజాగా కోర్టుకు వెల్ల‌డించింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కుంభ‌కోణంలో సోనియాగాంధీ ఒక్క‌రే రెండు విడ‌త‌లుగా 142 కోట్ల రూపాయ‌ల‌ను వెనుకేసుకున్నా ర‌ని ఈడీ ఆరోపించింది. దీనిలో 92 కోట్ల రూపాయ‌ల‌ను రాహుల్‌గాంధీ పేరిట నొక్కేశార‌ని(ఇలానే.. కిక్ ది మ‌నీ) వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఎవ‌రి ప‌ట్లా జాలి చూపించాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

నేషనల్ హెరాల్డ్‌ కేసును విచారిస్తున్న ఈడీ.. ఇటీవ‌ల చార్జిషీట్‌ను దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిలో తొలిసారి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల పేర్ల‌ను పేర్కొంది. ఇలా గాంధీల కుటుంబానికి చెందిన ఇద్ద‌రు అగ్ర నేత‌ల పేర్లు చార్జిషీట్‌లో కి ఎక్క‌డం ఇదే తొలిసారి. అది కూడా అవినీతి ఆరోప‌ణ‌ల‌తో కావ‌డం మ‌రింత సంచ‌ల‌నం. ఈ చార్జిషీట్‌పై ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు.

ఇవీ ఈడీ వాద‌న‌లు..

— రాహుల్‌, సోనియాగాంధీలు నేరపూరిత ఆస్తుల ద్వారా దాదాపు 142 కోట్లు పోగేసుకున్నారు.
— సోనియా, రాహుల్‌, శామ్‌పిట్రోడా(కాంగ్రెస్ నేత‌, విదేశాల్లో ఉన్నారు.) సుమన్‌ దూబే విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు.
— అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా, యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు సంపాదించింది.
— నేర పూరిత కుట్ర ద్వారా పోగేసుకున్న ఆదాయాన్ని రాజ‌కీయాల‌కు వినియోగించారు.
— నేష‌న‌ల్ హెరాల్డ్ స్థిరాస్థుల ద్వారా వచ్చిన రూ.142 కోట్ల ఆదాయాన్ని వాడుకున్నారు.
— ఈ సొమ్మును 14 శాతం వ‌డ్డీతో స‌హా వసూలు చేయాల్సి ఉంది.
— ఈ సొమ్ము లావాదేవీల‌ను మనీలాండరింగ్‌గా పరిగణించాలి.

This post was last modified on May 21, 2025 3:56 pm

Share

Recent Posts

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

37 minutes ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

1 hour ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

1 hour ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

2 hours ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

4 hours ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

4 hours ago