Political News

బాబు మార్కు… చేతికే 3 గ్యాస్ బండల డబ్బు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు సంక్షేమంలో తనదైన మార్కు నిర్ణయాన్ని ప్రకటించారు. బుధవారం సాయంత్రం మంగళగిరి పరిధిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహానాడుతో పాటు కూటమి సర్కారు అమలు చేస్తున్న, అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయాలను ప్రకటించారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సూపర్ సిక్స్ పేరిట కూటమి పార్టీలు రాష్ట్ర ప్రజలకు పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించిన కూటమి సర్కారు… దానిని ఇప్పటికే అమలులో పెట్టేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకాన్ని లబ్ధిదారులకు మరింత సౌకర్యంవంతంగా మారుస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి మూడు సిలిండర్ల డబ్బును ముందుగానే ఆయా లబ్ధిదారుల చేతికే అందించనున్నారు. ఆ సొమ్ముతో ఉచిత సిలిండర్లు తీసుకుంటారా? లేదంటే.. ఆ డబ్బును ఇతరత్రా అవసరాలకు వాడుకుని.. సిలిండర్లను డబ్బు పెట్టి కొంటారా? అన్నది లబ్ధిదారుల ఇష్టానికే వదిలేయాలని తేల్చింది.

ఇక వచ్చే నెలలో పాఠశాలలు తెరిచే లోగానే తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ములను లబ్ధిదారులకు అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ నిధులను పిల్లల తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. ఇక మరో కీలక పథకం అయిన అన్నదాతా సుఖీభవ పథకాన్ని కూడా వచ్చే నెలలోనే ప్రారంభించాలని బాబు తీర్మానించారు. కేంద్రం విడుదల చేసే నిధులతో కలిపి రాష్ట్ర వాటాలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు.

ఇక ఏటా నిర్వహించే పార్టీ పండుగ మహానాడుపై సుదీర్ఘ చర్చ జరిగింది. కడప నగర సమీపంలో సీకే దిన్నెలో ఈ ఏడాది మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 3 రోజుల పాటు వేడుకగా జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో చర్చించింది. అంతేకాకుండా ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా చేపట్టిన భారత సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఆపరేషన్ సిందూర్ దిగ్విజయమైన తీరుపై ఈ నెల 15,16,17 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించింది. ఇక టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇటీవలే పద్మ భూషణ్ అవార్డు రాగా… ఆయనను పొలిట్ బ్యూరో ప్రత్యేకంగా అభినందించింది.

This post was last modified on May 15, 2025 11:06 am

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago