సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్లు ఊపందుకున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇంటర్వ్యూలు వైరల్ కావడం మొదలయ్యాయి. ఇంకా సరైన టీజర్ రాకుండా కేవలం ప్రోమో వీడియోలతోనే హైప్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర మల్టీ స్టారర్ క్యామియోలు అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఇందులో రజని పాత్ర పేరు దేవా. పోర్టులో మాఫియా సామ్రాజ్యం నడిపే ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఆయనని చూపించే విధానం మాములుగా ఉండదట. ఎలివేషన్లు, యాక్షన్ బ్లాకులు ఓ రేంజ్ లో వచ్చాయని టాక్.
కాకతాళీయంగా కూలికి రెండు నెలల ముందు జూన్ 20 రిలీజవుతున్న కుబేరలో ధనుష్ పేరు కూడా దేవానే. బిచ్చం అడుక్కునే స్థాయి నుంచి ఆర్థిక వ్యవస్థని శాశించే కోటీశ్వరుడిగా హీరో పాత్రని దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా ఇంటెన్స్ గా డిజైన్ చేశారట. అంటే పేరులోనే కాదు క్యారెక్టరైజేషన్ పరంగానూ కూలి, కుబేరలకు దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లోనూ నాగార్జున ఉండటం. రజని కూతురితో ధనుష్ విడిపోయినప్పటికీ ఫ్యాన్స్ దృష్టిలో మాత్రం ఇద్దరూ మామ అల్లుడే. అందుకే ఇంత దగ్గరి సారూప్యతలు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కంటెంట్, బిజినెస్ పరంగా కూలి, కుబేరలు హయ్యెస్ట్ ఫిగర్స్ నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డబ్బింగ్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. మన నిర్మాతల పోటీని చూసి ధరను వేలం పాట రేంజ్ లో పెంచుతున్నారని డిస్ట్రిబ్యూటర్ వర్గాల టాక్. అయినా దేవా అనేది కొన్ని వందల సినిమాల్లో హీరోలు వాడుకునే పేరు. దానికో మాస్ వైబ్ ఉంటుంది. అందుకే లోకేష్ కనగరాజ్, శేఖర్ కమ్ముల తమ హీరోలకు అదే నేమ్ వాడుకున్నారు. కూలికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా కుబేరకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆడియో పరంగానూ ఈ ఆల్బమ్స్ మీద పెద్ద హైప్ నెలకొంది.
This post was last modified on May 15, 2025 11:06 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…