Political News

అంబ‌టి గారూ.. మూడు ముక్క‌లాట మ‌రిచారా?!

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు .. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిపై మ‌రోసారి అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. అదేస‌మ‌యంలో రాజ‌ధాని విష‌యంలో మూడు ముక్క‌లాట మ‌రిచి పోయిన‌ట్టు ఆయ‌న కామెంట్లు చేశారు. “జ‌గ‌నే అమ‌రావ‌తిని అభివృద్ధి చేయాల‌ని అనుకున్నాడు. కానీ, చంద్ర‌బాబు కోర్టుల‌కు వెళ్లి అడ్డుకున్నారు” అని తాజాగా అంబ‌టి మీడియా ముందు కామెంట్లు చేశారు.

దీనిపై నెటిజ‌న్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఎక్క‌డైనా.. ఎవ‌రైనా.. రాజ‌ధానిని బాగు చేస్తాన‌ని అంటే.. అడ్డుకుంటారా? అస‌లు రాజ‌ధానిని బాగు చేయ‌మ‌నే క‌దా.. నాడు అసెంబ్లీలో చేతులు జోడించి చంద్రబాబు వేడుకుంది! కానీ, మీరు చేసిందేంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. మూడు రాజ‌ధానుల పేరుతో అమ‌రావ‌తి రైతుల‌ను అస‌హ్యించుకున్నారు. వారి త్యాగాల‌ను.. నాట‌కాలుగా.. కులం పేరు అంట‌గ‌ట్టి చీద‌రించుకుని లాఠీల‌తో కుమ్మించారు.. అని గ‌తాన్ని గుర్తు చేస్తున్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన అంబ‌టి.. శుక్ర‌వారం జ‌రిగిన రాజ‌ధాని పనుల పునః ప్రారంభంపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. ఈ స‌భా వేదిక‌గా.. సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ అబ‌ద్ధాలు చెప్పార‌ని అన్నారు. అమ‌రావ‌తి నిర్మాణంలో చంద్ర‌బాబు అట్ట‌ర్ ప్లాప్ అయ్యార‌ని విమ‌ర్శించారు. కానీ.. వాస్త‌వానికి అమ‌రావ‌తి నిర్మాణం చేప‌ట్టి.. ప్రారంభించి.. ప‌నులు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే క‌దా.. ఎన్నిక‌లు వ‌చ్చి 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని.. మ‌రి ఆ ప‌నుల‌ను మీరెందుకు కొన‌సాగించ‌లేదు? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

“అమరావతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వంలో 41 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా టెండర్లు పిలిచారు. 5500 కోట్లు ఖర్చు చేశారు. గత ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో అమరావతి భ్రమరావతి అయింది.” అని అంబ‌టి నోరుపారేసుకున్నారు. ఆ నిర్మాణాలే క‌దా.. ఇప్పుడున్న స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టు.. వంటివి. మీరు పాలించిన ఐదేళ్లు కూడా అక్క‌డ నుంచే పాల‌న సాగించారు క‌దా? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌.

రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జ‌లు అమ‌రావ‌తిని అంగీక‌రించి.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాకే.. 2024లో మార్పు వ‌చ్చింద‌ని.. 11 స్థానాల‌కేమిమ్మ‌ల్ని ప‌రిమితం చేశార‌ని అంటున్నారు. ఈ నిజాన్ని వైసీపీ నాయ‌కులు గుర్తించ‌లేక‌పోతే.. ఇంకా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే.. వైసీపీ పేరు కూడా క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశం కొద్ది దూరంలోనే ఉంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

30 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

7 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago