Political News

అంబ‌టి గారూ.. మూడు ముక్క‌లాట మ‌రిచారా?!

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు .. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిపై మ‌రోసారి అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. అదేస‌మ‌యంలో రాజ‌ధాని విష‌యంలో మూడు ముక్క‌లాట మ‌రిచి పోయిన‌ట్టు ఆయ‌న కామెంట్లు చేశారు. “జ‌గ‌నే అమ‌రావ‌తిని అభివృద్ధి చేయాల‌ని అనుకున్నాడు. కానీ, చంద్ర‌బాబు కోర్టుల‌కు వెళ్లి అడ్డుకున్నారు” అని తాజాగా అంబ‌టి మీడియా ముందు కామెంట్లు చేశారు.

దీనిపై నెటిజ‌న్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఎక్క‌డైనా.. ఎవ‌రైనా.. రాజ‌ధానిని బాగు చేస్తాన‌ని అంటే.. అడ్డుకుంటారా? అస‌లు రాజ‌ధానిని బాగు చేయ‌మ‌నే క‌దా.. నాడు అసెంబ్లీలో చేతులు జోడించి చంద్రబాబు వేడుకుంది! కానీ, మీరు చేసిందేంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. మూడు రాజ‌ధానుల పేరుతో అమ‌రావ‌తి రైతుల‌ను అస‌హ్యించుకున్నారు. వారి త్యాగాల‌ను.. నాట‌కాలుగా.. కులం పేరు అంట‌గ‌ట్టి చీద‌రించుకుని లాఠీల‌తో కుమ్మించారు.. అని గ‌తాన్ని గుర్తు చేస్తున్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన అంబ‌టి.. శుక్ర‌వారం జ‌రిగిన రాజ‌ధాని పనుల పునః ప్రారంభంపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. ఈ స‌భా వేదిక‌గా.. సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ అబ‌ద్ధాలు చెప్పార‌ని అన్నారు. అమ‌రావ‌తి నిర్మాణంలో చంద్ర‌బాబు అట్ట‌ర్ ప్లాప్ అయ్యార‌ని విమ‌ర్శించారు. కానీ.. వాస్త‌వానికి అమ‌రావ‌తి నిర్మాణం చేప‌ట్టి.. ప్రారంభించి.. ప‌నులు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే క‌దా.. ఎన్నిక‌లు వ‌చ్చి 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని.. మ‌రి ఆ ప‌నుల‌ను మీరెందుకు కొన‌సాగించ‌లేదు? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

“అమరావతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వంలో 41 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా టెండర్లు పిలిచారు. 5500 కోట్లు ఖర్చు చేశారు. గత ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో అమరావతి భ్రమరావతి అయింది.” అని అంబ‌టి నోరుపారేసుకున్నారు. ఆ నిర్మాణాలే క‌దా.. ఇప్పుడున్న స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టు.. వంటివి. మీరు పాలించిన ఐదేళ్లు కూడా అక్క‌డ నుంచే పాల‌న సాగించారు క‌దా? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌.

రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జ‌లు అమ‌రావ‌తిని అంగీక‌రించి.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాకే.. 2024లో మార్పు వ‌చ్చింద‌ని.. 11 స్థానాల‌కేమిమ్మ‌ల్ని ప‌రిమితం చేశార‌ని అంటున్నారు. ఈ నిజాన్ని వైసీపీ నాయ‌కులు గుర్తించ‌లేక‌పోతే.. ఇంకా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే.. వైసీపీ పేరు కూడా క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశం కొద్ది దూరంలోనే ఉంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

This post was last modified on May 3, 2025 3:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

28 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 hour ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

2 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago