జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు ముగిసిన వీసాలపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనగర్కు చెందిన ఆరుగురు సభ్యుల అహ్మద్ తారిక్ భట్ కుటుంబానికి శుక్రవారం సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. వీసా గడువు ముగిసినా వారు ఇంకా భారత్లో ఉన్నారని కేంద్రం తెలిపిన నేపథ్యంలో, ఈ కుటుంబం అరెస్ట్కు గురికావాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఈ కేసులో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది నంద కిషోర్ మాట్లాడుతూ, ‘‘కుటుంబంలోని ఒకరు పాకిస్థాన్లో పుట్టినా, ఆ పాస్పోర్టును సరెండర్ చేసి, భారత పౌరసత్వాన్ని కోరుతూ అన్ని గుర్తింపు కార్డులను తీసుకున్నారు. ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలన్నీ వారి వద్ద ఉన్నాయి’’ అని కోర్టుకు తెలిపారు.
దీంతో స్పందించిన ధర్మాసనం, ఈ కేసు వినూత్నత దృష్ట్యా ఆలోచించాల్సిన అంశాలున్నాయని పేర్కొంది. ‘‘ఈ పిటిషన్లో కొన్ని సాంకేతిక లోపాలున్నాయి. కానీ వాటి మీద అభిప్రాయం వ్యక్తం చేయకుండా, మేము దీనిని కొట్టేస్తున్నాం. అయినప్పటికీ అధికారులకు స్పష్టమైన సూచన ఇస్తున్నాం. వారు చూపుతున్న పత్రాలను, వారు వినిపించే అంశాలను పరిశీలించాకే ఏ నిర్ణయమైనా తీసుకోండి’’ అని స్పష్టం చేసింది.
అంతేకాదు, ఈ కేసులో ఏదైనా చర్యలు తీసుకునే ముందు దర్యాప్తును సమగ్రంగా చేసి, నిజాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం అధికారులను కోరింది. అంతేకాదు, ప్రభుత్వం నిర్ణయించిన చర్యలపై సంతృప్తి లేకుంటే, పిటిషనర్లు జమ్మూ కశ్మీర్ హైకోర్టును ఆశ్రయించవచ్చని కూడా సూచించింది. ఇక కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, ‘‘ఈ తరహా కేసుల్లో సంబంధిత అధికార యంత్రాంగం ముందు వెళ్లడం సరికొత్త మార్గం కాదు. వారు సరైన స్థాయిలో ప్రాతినిధ్యం వహించి నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ఈ కేసు ప్రస్తుతం అధికారుల విచారణకు చిక్కగా, ఫైనల్ నిర్ణయం హైకోర్టు ఆధీనంలో ఉండనుంది.
This post was last modified on May 2, 2025 9:54 pm
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…