Trends

రూ.2000 నోట్లు.. RBI మరో సూచన!

నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023 మే 19న ప్రారంభించింది. అప్పటికి దేశవ్యాప్తంగా రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇప్పటి వరకు వాటిలో 98.24 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి చేరగా, మిగిలిన రూ.6,266 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్దే ఉండటం గమనార్హం.

ఈ నోట్లను డిపాజిట్ చేసేందుకు పౌరులకు గత ఏడాది అక్టోబర్ 7 వరకు అవకాశం ఇచ్చిన RBI, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న తన 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనే ఈ సేవలను కొనసాగిస్తోంది. అయితే ఇప్పటికీ కొన్ని కోట్ల విలువైన నోట్లు తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో RBI మరోసారి స్పష్టమైన ప్రకటన చేసింది. ఇప్పటికీ చెలామణీలో ఉన్న రూ.2000 నోట్లు “లీగల్ టెండర్”గానే కొనసాగుతాయని పేర్కొంది. అంటే, అవి చెల్లుబాటు అయ్యే నోట్లుగానే ఉండటంతో ప్రజలు వాటిని ఉపయోగించడానికి వెనకాడటం లేదు.

ఇదే సమయంలో RBI, ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లు తిరిగి జమ చేయాలని కోరుతోంది. దీనికోసం RBI ప్రాంతీయ కార్యాలయాలను నేరుగా సంప్రదించకపోయినా, పోస్టాఫీస్ ద్వారా ఆ నోట్లను పంపించేందుకు వీలుగా సూచనలు చేసింది. పోస్టు ద్వారా పంపిన నోట్ల విలువను సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.

వాస్తవానికి రూ.2000 నోట్లు 2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం తాత్కాలికంగా పెద్ద విలువ కలిగిన కరెన్సీ అవసరాన్ని తీర్చేందుకు తీసుకొచ్చారు. వాటి ముద్రణను 2018 తర్వాత నిలిపివేశారు. వీటిని చిన్న మొత్తాల కరెన్సీలతో స్థానంలోకి తేవడమే లక్ష్యంగా RBI ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా చూసుకుంటే.. రూ.2000 నోట్లు చలామణిలో తగ్గినప్పటికీ, ఇంకా వేల కోట్ల రూపాయలు విలువైన నోట్లు ప్రజల చేతుల్లో ఉండటం భారత ఆర్థిక వ్యవస్థలో నగదు ఆధారిత లావాదేవీల ప్రాధాన్యతను రుజువు చేస్తోంది.

This post was last modified on May 2, 2025 7:42 pm

Share
Show comments
Published by
Kumar
Tags: 2000 notes

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago