Trends

రూ.2000 నోట్లు.. RBI మరో సూచన!

నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023 మే 19న ప్రారంభించింది. అప్పటికి దేశవ్యాప్తంగా రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇప్పటి వరకు వాటిలో 98.24 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి చేరగా, మిగిలిన రూ.6,266 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్దే ఉండటం గమనార్హం.

ఈ నోట్లను డిపాజిట్ చేసేందుకు పౌరులకు గత ఏడాది అక్టోబర్ 7 వరకు అవకాశం ఇచ్చిన RBI, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న తన 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనే ఈ సేవలను కొనసాగిస్తోంది. అయితే ఇప్పటికీ కొన్ని కోట్ల విలువైన నోట్లు తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో RBI మరోసారి స్పష్టమైన ప్రకటన చేసింది. ఇప్పటికీ చెలామణీలో ఉన్న రూ.2000 నోట్లు “లీగల్ టెండర్”గానే కొనసాగుతాయని పేర్కొంది. అంటే, అవి చెల్లుబాటు అయ్యే నోట్లుగానే ఉండటంతో ప్రజలు వాటిని ఉపయోగించడానికి వెనకాడటం లేదు.

ఇదే సమయంలో RBI, ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లు తిరిగి జమ చేయాలని కోరుతోంది. దీనికోసం RBI ప్రాంతీయ కార్యాలయాలను నేరుగా సంప్రదించకపోయినా, పోస్టాఫీస్ ద్వారా ఆ నోట్లను పంపించేందుకు వీలుగా సూచనలు చేసింది. పోస్టు ద్వారా పంపిన నోట్ల విలువను సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.

వాస్తవానికి రూ.2000 నోట్లు 2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం తాత్కాలికంగా పెద్ద విలువ కలిగిన కరెన్సీ అవసరాన్ని తీర్చేందుకు తీసుకొచ్చారు. వాటి ముద్రణను 2018 తర్వాత నిలిపివేశారు. వీటిని చిన్న మొత్తాల కరెన్సీలతో స్థానంలోకి తేవడమే లక్ష్యంగా RBI ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా చూసుకుంటే.. రూ.2000 నోట్లు చలామణిలో తగ్గినప్పటికీ, ఇంకా వేల కోట్ల రూపాయలు విలువైన నోట్లు ప్రజల చేతుల్లో ఉండటం భారత ఆర్థిక వ్యవస్థలో నగదు ఆధారిత లావాదేవీల ప్రాధాన్యతను రుజువు చేస్తోంది.

This post was last modified on May 2, 2025 7:42 pm

Share
Show comments
Published by
Kumar
Tags: 2000 notes

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago