వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దాదాపు 3500 కోట్ల రూపాయల మేరకు మేసేశారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. విచారణ చేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం.. విచారణ సాగిస్తుండడం తెలిసిందే. ఇక, తాజాగా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతి పీఏ బాలాజీ గోవిందప్పలు.. ఉలిక్కి పడ్డారు.
వారిని కూడా ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతో వారు హుటాహుటి న హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కాగా.. వీరు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లకు సంబంధించి ప్రభుత్వ వాదనను హైకోర్టు కోరింది. దీనిపై ప్రాసిక్యూషన్.. తమకు కొంత సమయం కావాలని కోరింది. దీనికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ క్రమంలో అప్పటి వరకు తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని.. పిటిషనర్లు.. కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు హైకోర్టును కోరారు. కానీ.. ప్రాసిక్యూషన్ సమయం కోరినంత మాత్రాన అప్పటి వరకు పిటిషనర్లకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది. అసలు ప్రభుత్వ వాదన వినకుండా నిర్ణయాలు తీసుకోలేమని కూడా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే.. వారి పేర్లు కేసులో ఉన్నా.. విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం వీరిని ఇంకా విచారణకు పిలవలేదు. అయినప్పటికీ.. అరెస్టు భయం వెంటాడుతుండడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. కానీ.. వారికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…