Political News

వైసీపీ లిక్క‌ర్ స్కాం.. వారికి బెయిల్ ఇవ్వ‌లేం: హైకోర్టు

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో దాదాపు 3500 కోట్ల రూపాయ‌ల మేర‌కు మేసేశార‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. విచార‌ణ చేయిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రాజ్ క‌సిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయ‌డం.. విచార‌ణ సాగిస్తుండ‌డం తెలిసిందే. ఇక‌, తాజాగా.. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి పీఏ బాలాజీ గోవిందప్పలు.. ఉలిక్కి ప‌డ్డారు.

వారిని కూడా ఏ క్ష‌ణంలో అయినా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. దీంతో వారు హుటాహుటి న హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. వీటిని విచారించిన హైకోర్టు.. ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేసింది. కాగా.. వీరు వేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ల‌కు సంబంధించి ప్ర‌భుత్వ వాద‌న‌ను హైకోర్టు కోరింది. దీనిపై ప్రాసిక్యూష‌న్‌.. త‌మ‌కు కొంత స‌మ‌యం కావాల‌ని కోరింది. దీనికి హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది.

ఈ క్ర‌మంలో అప్ప‌టి వ‌ర‌కు త‌మ‌ను అరెస్టు చేయ‌కుండా ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని.. పిటిష‌న‌ర్లు.. కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు హైకోర్టును కోరారు. కానీ.. ప్రాసిక్యూష‌న్ స‌మ‌యం కోరినంత మాత్రాన అప్ప‌టి వ‌ర‌కు పిటిష‌నర్ల‌కు బెయిల్ ఇవ్వ‌లేమ‌ని కోర్టు తెలిపింది. అస‌లు ప్ర‌భుత్వ వాద‌న విన‌కుండా నిర్ణ‌యాలు తీసుకోలేమ‌ని కూడా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే.. వారి పేర్లు కేసులో ఉన్నా.. విచార‌ణ జ‌రుపుతున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం వీరిని ఇంకా విచార‌ణ‌కు పిల‌వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. అరెస్టు భ‌యం వెంటాడుతుండ‌డంతో వారు హైకోర్టును ఆశ్ర‌యించారు. కానీ.. వారికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాక‌రించింది.

This post was last modified on May 2, 2025 9:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

3 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago