Political News

విడదల రజినీకి షాక్.. విచారణకు సహకరించాలన్న కోర్టు

మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీకి శుక్రవారం హైకోర్టులో షాక్ తగిలింది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్డపాడులో ఓ స్టోన్ క్రషింగ్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించి… రూ.2.2 కోట్లను వసూలు చేశారంటూ రజినీ సహా ఆమె మరిది గోపీ, ఆమె పీఏ రామకృష్ణతో పాటు నాడు విజిలెన్స్ ప్రాంతీయ అధికారిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి జాషువాపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేలా బెయిల్ మంజూరు చేయాలంటూ రజినీతో పాటు ఆమె మరిది గోపీ కూడా ఇదివరకే హైకోర్టులో బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు రజినీకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఏసీబీ విచారణకు సహకరించాల్సిందేనని కోర్టు రజినీని ఆదేశించింది.

రజినీ, ఆమె మరిది గోపీల బెయిల్ పిటిషన్లను కోర్టులో విచారణ దశలో ఉండగానే… గురువారమే హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు గోపీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గోపీని విజయవాడ తరలించిన ఏసీబీ… ఆయనను విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా… గోపీని రిమాండ్ కు తరలిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం జరిగిన తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్లపై విచారణ జరగగా… గోపీని ఇప్పటికే అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని, ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించిందని ఏసీబీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో గోపీ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత రజినీ బెయిల్ పిటిషన్ పై మాత్రమే విచారణ చేపట్టింది. బెయిల్ ఇవ్వడం కుదరదన్న హైకోర్టు… ఏసీబీ విచారణకు సహకరించాలని రజినీకి సూచించింది.

అయితే రజినీకి ఒకింత ఊరట కలిగేలా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రజినీకి 41ఏ నోటీసులు జారీ చేసి విచారణ చేయాలని కోర్టు ఏసీబీ అధికారులకు సూచించింది. బెయిల్ రాకపోయినా… 41ఏ నోటీసుల ప్రకారం విచారణ చేయాలన్న హైకోర్టు ఆదేశాలు రజినీకి నిజంగానే ఊరట కలిగించేవేనని చెప్పక తప్పదు. రజినీతో పాటు ఆమె పీఏ రామకృష్ణకు కూడా 41 ఏ నోటీసుల ఆధారంగానే విచారించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే… గురువారమే గోపీని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టు ఏమాత్రం ఆలస్యం అయినా… రజినీ మాదిరిగానే గోపీని కూడా 41ఏ నోటీసుల ఆధారంగానే విచారించాలని హైకోర్టు ఆదేశించి ఉండేదేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగి ఉండే.. కొంతకాలమైనా గోపీ అరెస్టు నుంచి ఉపశమనం పొంది ఉండేవారేమోనన్న వాాదన లేకపోలేదు.

This post was last modified on April 26, 2025 11:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

15 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago