తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఈ వసూళ్లు ఇప్పటికిప్పుడు జరిగినవి కాదని.. ఎప్పటి నుంచో జరుగుతున్నవేనని తెలిసింది. మంత్రి పొంగులేటి వ్యక్తిగత కార్యదర్శులమని చెబుతూ.. వ్యాపారులు, వాణిజ్య వేత్తలను కలుసుకుని.. వారి నుంచి భారీ మొత్తంలోనే సొమ్మును రాబట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. చిత్రం ఏంటంటే.. మంత్రి పొంగులేటి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడు. కానీ, ఆయన పేరు చెప్పి దందాలు జరుగుతోంది మాత్రం వరంగల్లో!.
ఈ వ్యవహారంలో ఆది నుంచి మోసపోతున్న వ్యాపారులు.. తాజాగా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంత్రి పీఏల మంటూ.. చెప్పుకొని వసూళ్లకు పాల్పడుతున్న బుస్సా వెంకటరెడ్డి, మచ్చా సురేష్లను రెడ్ హ్యాండెడ్గా వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. వారి బ్యాంకు వివరాలు.. పాసుపుస్తకాలు.. మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో చిత్రమైన విషయం.. వారి వద్ద ఐడీ కార్డులు కూడా ఉండడం. దీనిపై పొంగులేటి చేసిన సంతకాలను కూడా ఫోర్జరీ చేసి.. వినియోగించారని పోలీసులు గుర్తించారు.
‘మోస పోకండి’
కాగా.. తన పేరు చెప్పి.. దోచుకుంటున్న పీఏల వ్యవహారంపై మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందించారు. తన పీఏలు తనవద్దే ఉంటారని.. ఎవరి వద్దా.. లంచాలు తీసుకోరని చెప్పారు. ఎవరైనా తన పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే.. పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. అంతేకాదు.. తన పీఏలంటూ.. ఎవరైనా వస్తే.. ముందుగా తనకు ఫోన్ చేసి.. చెప్పాలని.. ఆ తర్వాతే వారితో సంభాషించాలని.. సొమ్ములు ఎవరూ ఇవ్వొద్దని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో తన కార్యాలయానికి చెందిన రెండు ఫోన్ నెంబర్లను మంత్రి ప్రజలకు ఇచ్చారు.
This post was last modified on April 25, 2025 9:07 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…