Political News

పొంగులేటి పేరుతో.. పైసా వ‌సూల్‌!

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు చెప్పి వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఈ వ‌సూళ్లు ఇప్ప‌టికిప్పుడు జ‌రిగిన‌వి కాద‌ని.. ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న‌వేన‌ని తెలిసింది. మంత్రి పొంగులేటి వ్య‌క్తిగ‌త కార్యద‌ర్శుల‌మ‌ని చెబుతూ.. వ్యాపారులు, వాణిజ్య వేత్త‌ల‌ను క‌లుసుకుని.. వారి నుంచి భారీ మొత్తంలోనే సొమ్మును రాబ‌ట్టిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. చిత్రం ఏంటంటే.. మంత్రి పొంగులేటి.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన నాయ‌కుడు. కానీ, ఆయ‌న పేరు చెప్పి దందాలు జ‌రుగుతోంది మాత్రం వ‌రంగ‌ల్‌లో!.

ఈ వ్య‌వ‌హారంలో ఆది నుంచి మోస‌పోతున్న వ్యాపారులు.. తాజాగా పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో మంత్రి పీఏల మంటూ.. చెప్పుకొని వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న బుస్సా వెంక‌ట‌రెడ్డి, మ‌చ్చా సురేష్‌ల‌ను రెడ్ హ్యాండెడ్‌గా వ‌రంగ‌ల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. వారి బ్యాంకు వివ‌రాలు.. పాసుపుస్త‌కాలు.. మొబైల్ ఫోన్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మ‌రో చిత్ర‌మైన విష‌యం.. వారి వ‌ద్ద ఐడీ కార్డులు కూడా ఉండ‌డం. దీనిపై పొంగులేటి చేసిన సంత‌కాల‌ను కూడా ఫోర్జ‌రీ చేసి.. వినియోగించార‌ని పోలీసులు గుర్తించారు.

‘మోస పోకండి’
కాగా.. త‌న పేరు చెప్పి.. దోచుకుంటున్న పీఏల వ్య‌వ‌హారంపై మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందించారు. త‌న పీఏలు త‌న‌వ‌ద్దే ఉంటార‌ని.. ఎవ‌రి వ‌ద్దా.. లంచాలు తీసుకోర‌ని చెప్పారు. ఎవ‌రైనా త‌న పేరు చెప్పి వసూళ్ల‌కు పాల్ప‌డితే.. పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని మంత్రి సూచించారు. అంతేకాదు.. త‌న పీఏలంటూ.. ఎవ‌రైనా వ‌స్తే.. ముందుగా త‌న‌కు ఫోన్ చేసి.. చెప్పాల‌ని.. ఆ త‌ర్వాతే వారితో సంభాషించాల‌ని.. సొమ్ములు ఎవ‌రూ ఇవ్వొద్ద‌ని మంత్రి తెలిపారు. ఈ క్ర‌మంలో త‌న కార్యాల‌యానికి చెందిన‌ రెండు ఫోన్ నెంబ‌ర్ల‌ను మంత్రి ప్ర‌జ‌ల‌కు ఇచ్చారు.

This post was last modified on April 25, 2025 9:07 pm

Share

Recent Posts

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

1 hour ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

3 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

4 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

4 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

4 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

7 hours ago