Political News

పొంగులేటి పేరుతో.. పైసా వ‌సూల్‌!

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు చెప్పి వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఈ వ‌సూళ్లు ఇప్ప‌టికిప్పుడు జ‌రిగిన‌వి కాద‌ని.. ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న‌వేన‌ని తెలిసింది. మంత్రి పొంగులేటి వ్య‌క్తిగ‌త కార్యద‌ర్శుల‌మ‌ని చెబుతూ.. వ్యాపారులు, వాణిజ్య వేత్త‌ల‌ను క‌లుసుకుని.. వారి నుంచి భారీ మొత్తంలోనే సొమ్మును రాబ‌ట్టిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. చిత్రం ఏంటంటే.. మంత్రి పొంగులేటి.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన నాయ‌కుడు. కానీ, ఆయ‌న పేరు చెప్పి దందాలు జ‌రుగుతోంది మాత్రం వ‌రంగ‌ల్‌లో!.

ఈ వ్య‌వ‌హారంలో ఆది నుంచి మోస‌పోతున్న వ్యాపారులు.. తాజాగా పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో మంత్రి పీఏల మంటూ.. చెప్పుకొని వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న బుస్సా వెంక‌ట‌రెడ్డి, మ‌చ్చా సురేష్‌ల‌ను రెడ్ హ్యాండెడ్‌గా వ‌రంగ‌ల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. వారి బ్యాంకు వివ‌రాలు.. పాసుపుస్త‌కాలు.. మొబైల్ ఫోన్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మ‌రో చిత్ర‌మైన విష‌యం.. వారి వ‌ద్ద ఐడీ కార్డులు కూడా ఉండ‌డం. దీనిపై పొంగులేటి చేసిన సంత‌కాల‌ను కూడా ఫోర్జ‌రీ చేసి.. వినియోగించార‌ని పోలీసులు గుర్తించారు.

‘మోస పోకండి’
కాగా.. త‌న పేరు చెప్పి.. దోచుకుంటున్న పీఏల వ్య‌వ‌హారంపై మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందించారు. త‌న పీఏలు త‌న‌వ‌ద్దే ఉంటార‌ని.. ఎవ‌రి వ‌ద్దా.. లంచాలు తీసుకోర‌ని చెప్పారు. ఎవ‌రైనా త‌న పేరు చెప్పి వసూళ్ల‌కు పాల్ప‌డితే.. పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని మంత్రి సూచించారు. అంతేకాదు.. త‌న పీఏలంటూ.. ఎవ‌రైనా వ‌స్తే.. ముందుగా త‌న‌కు ఫోన్ చేసి.. చెప్పాల‌ని.. ఆ త‌ర్వాతే వారితో సంభాషించాల‌ని.. సొమ్ములు ఎవ‌రూ ఇవ్వొద్ద‌ని మంత్రి తెలిపారు. ఈ క్ర‌మంలో త‌న కార్యాల‌యానికి చెందిన‌ రెండు ఫోన్ నెంబ‌ర్ల‌ను మంత్రి ప్ర‌జ‌ల‌కు ఇచ్చారు.

This post was last modified on April 25, 2025 9:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago