తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఈ వసూళ్లు ఇప్పటికిప్పుడు జరిగినవి కాదని.. ఎప్పటి నుంచో జరుగుతున్నవేనని తెలిసింది. మంత్రి పొంగులేటి వ్యక్తిగత కార్యదర్శులమని చెబుతూ.. వ్యాపారులు, వాణిజ్య వేత్తలను కలుసుకుని.. వారి నుంచి భారీ మొత్తంలోనే సొమ్మును రాబట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. చిత్రం ఏంటంటే.. మంత్రి పొంగులేటి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడు. కానీ, ఆయన పేరు చెప్పి దందాలు జరుగుతోంది మాత్రం వరంగల్లో!.
ఈ వ్యవహారంలో ఆది నుంచి మోసపోతున్న వ్యాపారులు.. తాజాగా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంత్రి పీఏల మంటూ.. చెప్పుకొని వసూళ్లకు పాల్పడుతున్న బుస్సా వెంకటరెడ్డి, మచ్చా సురేష్లను రెడ్ హ్యాండెడ్గా వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. వారి బ్యాంకు వివరాలు.. పాసుపుస్తకాలు.. మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో చిత్రమైన విషయం.. వారి వద్ద ఐడీ కార్డులు కూడా ఉండడం. దీనిపై పొంగులేటి చేసిన సంతకాలను కూడా ఫోర్జరీ చేసి.. వినియోగించారని పోలీసులు గుర్తించారు.
‘మోస పోకండి’
కాగా.. తన పేరు చెప్పి.. దోచుకుంటున్న పీఏల వ్యవహారంపై మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందించారు. తన పీఏలు తనవద్దే ఉంటారని.. ఎవరి వద్దా.. లంచాలు తీసుకోరని చెప్పారు. ఎవరైనా తన పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే.. పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. అంతేకాదు.. తన పీఏలంటూ.. ఎవరైనా వస్తే.. ముందుగా తనకు ఫోన్ చేసి.. చెప్పాలని.. ఆ తర్వాతే వారితో సంభాషించాలని.. సొమ్ములు ఎవరూ ఇవ్వొద్దని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో తన కార్యాలయానికి చెందిన రెండు ఫోన్ నెంబర్లను మంత్రి ప్రజలకు ఇచ్చారు.
This post was last modified on April 25, 2025 9:07 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…