Political News

పొంగులేటి పేరుతో.. పైసా వ‌సూల్‌!

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు చెప్పి వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఈ వ‌సూళ్లు ఇప్ప‌టికిప్పుడు జ‌రిగిన‌వి కాద‌ని.. ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న‌వేన‌ని తెలిసింది. మంత్రి పొంగులేటి వ్య‌క్తిగ‌త కార్యద‌ర్శుల‌మ‌ని చెబుతూ.. వ్యాపారులు, వాణిజ్య వేత్త‌ల‌ను క‌లుసుకుని.. వారి నుంచి భారీ మొత్తంలోనే సొమ్మును రాబ‌ట్టిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. చిత్రం ఏంటంటే.. మంత్రి పొంగులేటి.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన నాయ‌కుడు. కానీ, ఆయ‌న పేరు చెప్పి దందాలు జ‌రుగుతోంది మాత్రం వ‌రంగ‌ల్‌లో!.

ఈ వ్య‌వ‌హారంలో ఆది నుంచి మోస‌పోతున్న వ్యాపారులు.. తాజాగా పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో మంత్రి పీఏల మంటూ.. చెప్పుకొని వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న బుస్సా వెంక‌ట‌రెడ్డి, మ‌చ్చా సురేష్‌ల‌ను రెడ్ హ్యాండెడ్‌గా వ‌రంగ‌ల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. వారి బ్యాంకు వివ‌రాలు.. పాసుపుస్త‌కాలు.. మొబైల్ ఫోన్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మ‌రో చిత్ర‌మైన విష‌యం.. వారి వ‌ద్ద ఐడీ కార్డులు కూడా ఉండ‌డం. దీనిపై పొంగులేటి చేసిన సంత‌కాల‌ను కూడా ఫోర్జ‌రీ చేసి.. వినియోగించార‌ని పోలీసులు గుర్తించారు.

‘మోస పోకండి’
కాగా.. త‌న పేరు చెప్పి.. దోచుకుంటున్న పీఏల వ్య‌వ‌హారంపై మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందించారు. త‌న పీఏలు త‌న‌వ‌ద్దే ఉంటార‌ని.. ఎవ‌రి వ‌ద్దా.. లంచాలు తీసుకోర‌ని చెప్పారు. ఎవ‌రైనా త‌న పేరు చెప్పి వసూళ్ల‌కు పాల్ప‌డితే.. పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని మంత్రి సూచించారు. అంతేకాదు.. త‌న పీఏలంటూ.. ఎవ‌రైనా వ‌స్తే.. ముందుగా త‌న‌కు ఫోన్ చేసి.. చెప్పాల‌ని.. ఆ త‌ర్వాతే వారితో సంభాషించాల‌ని.. సొమ్ములు ఎవ‌రూ ఇవ్వొద్ద‌ని మంత్రి తెలిపారు. ఈ క్ర‌మంలో త‌న కార్యాల‌యానికి చెందిన‌ రెండు ఫోన్ నెంబ‌ర్ల‌ను మంత్రి ప్ర‌జ‌ల‌కు ఇచ్చారు.

This post was last modified on April 25, 2025 9:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago