ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు ప్రాజెక్టులు.. ఇతర కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఆయనకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం నుంచిఫోన్ వచ్చింది. వాస్తవానికి షెడ్యూల్లో ఈ కార్యక్రమం లేదు.
అయినప్పటికీ..చంద్రబాబుకు స్వయంగా షా కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సాదరంగా ఆహ్వానించిన అమిత్ షా.. ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అడగ మన్నారంటూ… ఓ కీలక విషయాన్ని చంద్రబాబు చెవిలో వేశారు. ప్రస్తుతం ఖాళీ అయిన.. త్వరలోనే జరగనున్న రాజ్యసభ సీటును తమకు కేటాయించాలని చంద్రబాబును మోడీ కోరినట్టు షా వెల్లడించారు.
అంతే! ఇంకేముంది.. అసలే ప్రధాని మోడీ అంటే.. ప్రాణం పెట్టేస్తున్న చంద్రబాబు ఏమాత్రం సంకోచిం చకుండానే.. ఓకే చెప్పారు. ప్రస్తుతం ఏపీలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఇది వైసీపీ మాజీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీటు. అయితే… దీనిని ముందుగానే బీజేపీకి కేటాయిస్తున్నట్టు అనుకున్నా.. కమల నాథుల నుంచి చడీచప్పుడు లేదు.
ఈ నేపథ్యంలో టీడీపీ కి చెందిన సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు లేదా.. యనమల రామకృష్ణు డులను పంపించాలని భావించారు. ఇంతలోనే నేరుగా ప్రధానే అడిగినట్టు చంద్రబాబుకు సమాచారం రావడం.. ఈ సమయంలో అమిత్షానే ఆయన చెవిలో వేయడంతో ప్రధాని మోడీకి గిఫ్ట్గా ఇస్తున్నానంటూ … చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అక్కడే ఉన్నారు.
కాగా.. ఈ సీటును తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కోసం మోడీ అడిగినట్టు తెలిసింది. ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని.. తద్వారా వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పక్కా వ్యూహం ప్రకారం ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
This post was last modified on April 22, 2025 8:37 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…