ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ వ్యవహారంపై విచారణ సాగిస్తోంది. ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని వైసీపీ నాయ కులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలక నాయకులకు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తోంది. ఇదిలావుంటే.. ఈ వ్యవహారంలో కర్త-కర్మ-క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖరేనని(రాజ్ కసిరెడ్డి) మరో కీలక నాయకుడు వి. విజయసాయి రెడ్డి చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయన రెండు మూడు సార్లు చెప్పారు. సిట్ విచారణలోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావి స్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రాజ్ కసిరెడ్డి.. ఆడియో విడుదల చేశారు. విజయసాయిరెడ్డి మొత్తం బాగోతాన్ని తాను బయట పెడతానని హెచ్చరించారు. త్వరలోనే తాను బయటకు వస్తానని.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తన న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారని.. వాటిలో న్యాయపరమైన రక్షణ తనకు లభించాక.. బయటకు వస్తానని చెప్పారు. ఈ మేరకు తాజాగా ఓ ఆడియోను మీడియాకు విడుదల చేశారు. అయితే.. ఆయన ఎక్కడ ఉన్నదీ చెప్పలేదు. ఎప్పుడు వచ్చేదీ కూడా వివరించలేదు. కేవలం న్యాయపరమైన రక్షణ తనకు లభించిన తర్వాతే.. బయటకు వస్తానని అన్నారు. అప్పుడు సాయిరెడ్డి బాగోతం బయట పెడతానన్నారు.
మరోవైపు.. ఈ కేసులో ఇప్పటికి మూడు సార్లు సిట్ అధికారులు కసిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని పిలిచారు. అయినప్పటికీ.. ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలోనూ సోదాలు చేపట్టారు. అయినా.. కసిరెడ్డి ఆచూకీ మాత్రం పసిగట్టలేక పోయారు. ఇక, సాయిరెడ్డి విచారణకు వచ్చిన తర్వాత.. తాను ఈ మద్యం కుంభకోణంలో పాత్రధారుడిని కాదన్నారు. అయితే, కసిరెడ్డికి, ఎంపీ మిథున్రెడ్డికి 100 కోట్ల రూపాయల చొప్పున అప్పు మాత్రమే ఇప్పించానని.. అంతా కసిరెడ్డే ఈ కుంభకోణంలో పాత్ర వహించాడని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల క్రమంలో కసిరెడ్డి ఆడియో విడుదల చేయడం గమనార్హం.
This post was last modified on April 19, 2025 8:58 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…