Political News

ఏపీలో 1400 దాటిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఒక్క కర్నూలు జిల్లాలోనే 43 కేసులు నమోదవడం కలవరపెడుతోంది. కర్నూలులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 386కు చేరుకుంది. అయితే,కేసుల సంఖ్యలో కర్నూలుతో పోటీపడుతోన్న గుంటూరు జిల్లాలో కేవలం 4 కేసులే నమోదు కావడం ఊరటనిస్తోంది.

గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 2, గుంటూరులో 4, కడపలో 4, కృష్ణాలో 10, కర్నూలులో 43, నెల్లూరులో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే, ర్యాపిడ్ కిట్ టెస్టులు కాకుండా ఆర్టీ పీసీఆర్ టెస్టులు కూడా ఎక్కువగా చేస్తున్నందుకే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా. కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి అన్నారు.

దీంతో, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య1403కు చేరింది. ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకు 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1051 మంది చికిత్స పొందుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,016కి చేరుకోగా..కరోనా బారిన పడి 25 మంది మరణించారు. బుధవారం నాడు 13 మంది చిన్నారుల సహా 35 మంది డిశ్చార్జ్ కాగా…మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 409కి పెరిగింది. గత నాలుగు రోజులుగా నమోదైన కేసుల గణాంకాలు (11, 2, 6, 7) తెలంగాణ ప్రజలకు ఊరటనిస్తున్నాయి.

ఇక, దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,718 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 33,050కు చేరుకుంది. . గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి 67 మంది ప్రాణాలు కోల్పోగా…మొత్తం మరణించిన వారి సంఖ్య 1074కు చేరుకుంది.

ఇప్పటి వరకు కరోనా బారినపడి 8,324 మంది కోలుకోగా…ఆసుపత్రుల్లో 23,651 మంది చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.

This post was last modified on April 30, 2020 12:30 pm

Share

Recent Posts

రీల్స్ కోసం రెండు చేతులు పోగొట్టుకుంది

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్‌లో రీల్ తీసుకునేందుకు…

1 hour ago

లోకేష్ కనకరాజ్‌కు ఇది తగునా?

మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా…

2 hours ago

ఇరుముడి సినిమానే కావాలని గ్రామస్థుల ధర్నా

సినిమా నచ్చితే మరోసారి చూడటం, టికెట్లు దొరకకపోతే మరో షోకు వెళ్లడం చూస్తుంటాం. కానీ తమకు కావాల్సిన సినిమాను థియేటర్…

3 hours ago

సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఆరేళ్ల బీహార్ బుడతడు

బిహార్‌ యువత హక్కుల కోసం గొంతెత్తిన ఆరేళ్ల బాలుడు ఆదిత్య ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు. విద్యార్థుల ఉద్యోగాలు,…

3 hours ago

క్రేజీగా మారుతున్న టాలీవుడ్ డిసెంబర్

అందరూ సంక్రాంతి గురించి మాట్లాడుకుంటున్నారు కానీ రాబోయే డిసెంబర్ కూడా క్రేజీ సినిమాలతో పీక్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేలా ఉంది.…

3 hours ago

సెంచరీ దాటేసినా ఇరుముడి తగ్గట్లేదు

టాక్సిక్ విడుదల వల్ల చాలా చోట్ల ఇరుముడి థియేటర్లు ఉన్నట్టుండి తగ్గిపోయాయి. ఇది ముందస్తుగా జరిగిన ఒప్పందంలో భాగమే అయినా…

4 hours ago