Political News

ఏపీలో 1400 దాటిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఒక్క కర్నూలు జిల్లాలోనే 43 కేసులు నమోదవడం కలవరపెడుతోంది. కర్నూలులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 386కు చేరుకుంది. అయితే,కేసుల సంఖ్యలో కర్నూలుతో పోటీపడుతోన్న గుంటూరు జిల్లాలో కేవలం 4 కేసులే నమోదు కావడం ఊరటనిస్తోంది.

గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 2, గుంటూరులో 4, కడపలో 4, కృష్ణాలో 10, కర్నూలులో 43, నెల్లూరులో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే, ర్యాపిడ్ కిట్ టెస్టులు కాకుండా ఆర్టీ పీసీఆర్ టెస్టులు కూడా ఎక్కువగా చేస్తున్నందుకే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా. కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి అన్నారు.

దీంతో, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య1403కు చేరింది. ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకు 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1051 మంది చికిత్స పొందుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,016కి చేరుకోగా..కరోనా బారిన పడి 25 మంది మరణించారు. బుధవారం నాడు 13 మంది చిన్నారుల సహా 35 మంది డిశ్చార్జ్ కాగా…మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 409కి పెరిగింది. గత నాలుగు రోజులుగా నమోదైన కేసుల గణాంకాలు (11, 2, 6, 7) తెలంగాణ ప్రజలకు ఊరటనిస్తున్నాయి.

ఇక, దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,718 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 33,050కు చేరుకుంది. . గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి 67 మంది ప్రాణాలు కోల్పోగా…మొత్తం మరణించిన వారి సంఖ్య 1074కు చేరుకుంది.

ఇప్పటి వరకు కరోనా బారినపడి 8,324 మంది కోలుకోగా…ఆసుపత్రుల్లో 23,651 మంది చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.

This post was last modified on April 30, 2020 12:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

1 hour ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

3 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

9 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

10 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

10 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

11 hours ago