Political News

పొట్లంలో భోజనం.. ఆరేడు కిలోమీటర్ల నడకతో బాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన బాల్యం, విద్యాభ్యాసం గురించి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గ్రామంలో పర్యటించిన సందర్భంగా గ్రామంలో బంగారు కుటుంబంగా ఎంపికైన ఓ కుటుంబం వద్దకు వెళ్లిన ఆయన ఆ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా గడిపారు. వారి ఇంటిలో టీ పెట్టుకుని మరీ వారితో కలిసి సేవించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగానే తన బాల్యం ఎలా గడిడించిందన్న విషయాన్ని వివరించారు. తన విద్యాభ్యాసం కోసం తాను ఎంత కష్టపడ్డానన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.

తిరుపతి సమీపంలోని నారావారిపల్లెలో చంద్రబాబు జన్మించిన సంగతి తెలిసిందే. నారావారిపల్లెకు సమీపంలోని చంద్రగిరిలో పాఠశాల విద్యను పూర్తి చేసిన చంద్రబాబు… ఆ తర్వాత తిరుపతిలో కళాశాల విద్యను పూర్తి చేశారు. ముప్పాళ్ల గ్రామ పరిస్థితులను వివరించిన సందర్భంగా తాను కూడా ఓ గ్రామంలో పుట్టిన వాడినేనని, ఈనాడు ఉన్న పరిస్థితులు నాడు గ్రామాల్లో ఉండేవి కావని ఆయన తెలిపారు. నాడు తాను విద్యాభ్యాసం కోసం నిత్యం ఆరేడు కిలో మీటర్లు నడిచి మరీ పాఠశాలకు వెళ్లేవాడినని ఆయన తెలిపారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనాన్ని క్యారియర్ లో కాకుండా ఆహారాన్ని ఓ పొట్లంతో చుట్టుకుని వెళ్లేవాడినని తెలిపారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆ పొట్లంను పడేసేవాళ్లమని తెలిపారు.

నాడు తమకు ఎదురైన దుర్భర పరిస్థితులు ఇప్పటి గ్రామాల ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ లేవని చంద్రబాబు తెలిపారు. అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు చక్కగా చదువుకుని ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని ఆయన సూచించారు. దుర్భర పరిస్థితుల్లో విద్యనభ్యసించిన కారణంగానే పరిస్థితులను ఎలా మెరుగు చేస్తే… ఇప్పటి పిల్లలకు బాగుంటుందన్న విషయంపై నాడు తనకు ఓ అవగాహన వచ్చిందని… దానికి అనుగుణంగానే పనిచేసుకుంటూ వెళ్లానని తెలిపారు. ఫలితంగా తెలుగు పిల్లలు ఉజ్వల భవిష్యత్తును అందుకుని ప్రపంచాన్ని ఏలుతున్నారని, ఈ విషయాన్ని తలచుకున్నప్పుడల్లా తనకు గర్వంగా ఉంటుందని తెలిపారు. ఏ దేశానికి వెళ్లినా… అక్కడ మన తెలుగు వారు, భారతీయులు ఉంటున్నారని… ఆయా దేశాల్లోని వారి కంటే మనోళ్ల తలసరి ఆదాయాలే అధికంగా ఉంటున్నాయని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.

ముప్పాళ్ల గ్రామంలో వెయ్యికి పైగా కుటుంబాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ కుటుంబాల్లో పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు 41 ఉన్నాయన్న చంద్రబాబు.. ఆ కుటుంబాలను ఇతర కుటుంబాల తరహాలోనే అభివృద్ధి చేసేందుకు ఐదుగురు మార్గదర్శులు ముందుకు వచ్చారన్నారు. బంగారు కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు మార్గదర్శులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. మార్గదర్శుల సహకారంలో బంగారు కుటుంబాలు పురోగతి బాట పట్టాలని ఆయన సూచించారు. ఫలితంగా గ్రామంలో పేదరికం అన్నదే లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు. ఇక సంతానం విషయంలోనూ ముప్పాళ్ల వాసులు జాగ్రత్త వహించాలని, పిల్లలు వద్దనుకునే ఇప్పటి నయా ట్రెండ్ ను పక్కనపెట్టాలని ఆయన సూచించారు. పిల్లలను కంటేనే ముప్పాళ్ల ఏళ్ల తరబడి ఉనికిలో ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు.

This post was last modified on April 5, 2025 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వందేళ్ల ఆస్కార్ ఎదురుచూవు – రాజమౌళి కొత్త టార్గెట్

ప్రపంచవ్యాప్తంగా మూవీ మేకర్స్ కలగా, జీవిత లక్ష్యంగా భావించే ఆస్కార్ అవార్డులు 2028తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ…

13 minutes ago

మలినేని మాస్ ఉత్తరాదికి నచ్చిందా

క్రాక్, వీరసింహారెడ్డి, డాన్ శీను లాంటి బ్లాక్ బస్టర్లతో కమర్షియల్ దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్న గోపిచంద్ మలినేని…

31 minutes ago

తెగిన ప్రతి టికెట్టు సిద్దూ పేరు మీదే

నిన్న విడుదలైన సిద్దు జొన్నలగడ్డ 'జాక్'కు ఆశించిన స్థాయిలో స్పందన లేదు. రివ్యూలు పెదవి విరిచేయగా పబ్లిక్ టాక్ సైతం…

2 hours ago

10 నెలల్లోనే 5 భేటీలు!.. ఇది కదా వృద్ధి అంటే!

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక మండలి (ఎస్ఐపీబీ) అనే సంస్థ ఒకటి ఉంటుందని.. అది క్రమం తప్పకుండా సమావేశం అవుతుందని, రాష్ట్రానికి…

2 hours ago

వింటేజ్ అజిత్ దర్శనమయ్యింది కానీ

నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీకి తమిళనాడులో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అజిత్ ని ఇంత ఊర మాస్…

3 hours ago

హీరో-డైరెక్టర్.. ఇద్దరికే రూ.300 కోట్లు?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ అయిన అట్లీ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు…

5 hours ago