కేవలం అయిదే రోజుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది. ఏప్రిల్ 10 రిలీజని వారాల కృత్రమే ప్రకటించినప్పటికీ ప్రమోషన్ల పరంగా మైత్రి ఆశించినంత వేగంగా వెళ్లలేకపోవడం ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. అయితే వీళ్ళను తప్పు పట్టేందుకు లేదు. ఎందుకంటే అజిత్ పబ్లిసిటీకి ఎప్పుడూ దూరమే. సినిమా బాగుంటే మనమేం చెప్పకపోయినా జనం థియేటర్లకు వస్తారనే ఫిలాసఫీ తనది. కానీ ఫ్యాన్స్ కు అలా నచ్చదు. తమ హీరో బయటికి రావాలి. ఈవెంట్లలో పాల్గొనాలి. హడావిడి చేయాలి. ఇంటర్వ్యూలు ఇస్తూ బోలెడు విశేషాలు పంచుకోవాలి. ఇవేవీ గుడ్ బ్యాగ్ అగ్లీ విషయంలో కొంచెం కూడా జరగడం లేదు.
నిన్న తమిళ వెర్షన్ ట్రైలర్ వచ్చింది. ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్నీ పొందుపరిచినట్టు దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ ఈ వీడియో ద్వారా చెప్పేశాడు. యాక్షన్, కామెడీ, ఫన్, ఎలివేషన్ అన్నీ పెట్టాడు. జివి ప్రకాష్ కుమార్ బీజీఎమ్ మీద కామెంట్స్ ఉన్నప్పటికీ మొత్తం సినిమా చూశాకే దీని గురించి కామెంట్ చేయొచ్చు. తమిళంలో ఈ మూవీకి బజ్ అక్కర్లేదు. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. రిలీజ్ కు ముందే ప్రీ నెగటివ్ టాక్ తెచ్చుకున్న విడాముయార్చి లాంటి డ్రై కంటెంట్ కే వంద కోట్లకు పైగా వచ్చినప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ ఎంత చేస్తుందో వేరే చెప్పాలా. కానీ అసలు సమస్య తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఉంది.
మన దగ్గర అజిత్ మార్కెట్ ఏమంత బాగాలేదు. టాలీవుడ్ లో ప్రేమలేఖ, గ్యాంబ్లర్ లాంటి కాసిన్ని హిట్లు తప్ప తనవి కమర్షియల్ గా ఆడిన దాఖలాలు తక్కువ. తెగింపు, వలిమై లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తెలుగులో సూపర్ ఫ్లాప్ అయ్యాయి. మైత్రికేమో గుడ్ బ్యాడ్ ఆగ్లీని తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసుకునే ప్లాన్ లో ఉంది. కానీ అజిత్ నుంచి సహకారం కష్టమే. ఈవెంట్లకు రావడం దేవుడెరుగు కనీసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా గొప్పే. విజయ్, నయనతారలు కూడా ఇంతేనన్న సంగతి తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ జాక్ తో పోటీ పడుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీకి ఇదే మైత్రి నిర్మించిన సన్నీ డియోల్ జాట్ కూడా కాంపిటీషన్ ఇస్తోంది.
This post was last modified on April 5, 2025 1:38 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…