Movie News

ప్రశాంత్ వర్మ ప్రపంచంలో ఛావా విలన్

స్టార్ క్యాస్టింగ్ లేకుండా హనుమాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం దాని సీక్వెల్ జై హనుమాన్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. కాంతార చాప్టర్ 1 పూర్తి చేసుకుని రిషబ్ శెట్టి ఇటు రాగానే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా తన పేరు మీద ప్రశాంత్ వర్మ సృష్టించిన సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఇతర దర్శకులతోనూ ప్యాన్ ఇండియా మూవీస్ చేయడం విదితమే. వాటిలో మొదటిది మహాకాళి. పూజ అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో రూపొందబోయే ఈ ఫాంటసీ డ్రామాకు ఆర్కెడి స్టూడియోస్ నిర్మాణ భాగస్వామ్యగా వ్యవహరిస్తోంది. తాజాగా ఒక కీలక అప్డేట్ అంచనాలు పెంచేలా ఉంది.

ఇటీవలి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఛావాలో ఔరంగజేబుగా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన అక్షయ్ ఖన్నా ఇప్పుడీ మహాకాళిలో భాగమవుతున్నాడు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇప్పుడంటే ఇలాంటి క్యారెక్టర్లకు వచ్చేశాడు కానీ వినోదా ఖన్నా వారసుడిగా ఒకప్పుడు తనకు బాలీవుడ్ లో మంచి సోలో హిట్స్ ఉన్నాయి. వాటిలో తాళ్ ముఖ్యమైంది. ఐశ్వర్య రాయ్ ప్రేమికుడిగా చాలా పేరు తెచ్చింది. జెపి దత్తా తీసిన రెండో మూవీ బోర్డర్ కూడా బ్లాక్ బస్టరే. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే చేశాడు కానీ సక్సెస్ రేట్ తగ్గిపోవడంతో ఫిజిక్ మీద దృష్టి వదిలేయడం అవకాశాలను తగ్గించింది.

ఇప్పుడీ మహాకాళి అక్షయ్ ఖన్నాకు టాలీవుడ్ తెరంగేట్రం. పాత్ర తాలూకు తీరుతెన్నులు ఇంకా బయటికి చెప్పలేదు కానీ కథ ప్రకారం బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో తనే తెగ నాయకుడిగా కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్. సెటిల్డ్ నటన ఇవ్వడంలో పేరున్న అక్షయ్ ఖన్నాను ప్రశాంత్ వర్మ, అపర్ణలు ఎలా వాడుకుంటారో చూడాలి. హనుమాన్ తో మొదలుపెట్టి వివిధ స్టోరీలను యునివర్స్ లో భాగం చేస్తున్న ప్రశాంత్ వర్మ ఇవన్నీ అయ్యాక అవెంజర్స్ రేంజ్ లో ఒక పెద్ద ప్యాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తాడట. మహాకాళి వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేసుకుంటోంది. సంక్రాంతికి అనుకున్నారు కానీ వేసవి సీజన్ కు వచ్చే ఛాన్స్ ఉంది. 

This post was last modified on April 5, 2025 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

29 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago