ఏపీ వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో సెంటు భూమి కూడా అత్యంత విలువైనదే. అలాంటి నగరంలో ఇప్పుడు 15.17 ఎకరాల భూమిపై పెద్ద వివాదమే నడుస్తోంది. ఈ భూమిని తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2003లో అప్పటి టీడీపీ సర్కారు రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం కేటాయించింది. స్టూడియో నిర్వాహకులుగా ఉన్న సురేశ్ ప్రొడక్షన్స్ కు నాడు టీడీపీ సర్కారు 34.44 ఎకరాల భూమిని కేటాయించింది. అక్కడ సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాల కోసం స్టూడియోను నిర్మించాలన్నది నాటి ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం మేరకు సురేశ్ ప్రొడక్షన్స్ అందులోని కొంత భాగంలో స్టూడియోను నిర్మించి..మిగిలిన స్థలాన్ని అలాగే ఖాళీగా ఉంచేసింది. ఈ ఖాళీగా ఉన్న భూములే ఇప్పుడు వివాదానికి కారణంగా నిలుస్తున్నాయి.
ఈ భూములకు సంబంధించి మొన్నటి ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరిగింది. స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థను బెదిరించి… ఖాళీగా ఉన్న భూములను కాజేసేందుకు యత్నిస్తున్నారన్న దిశగా జరిగిన ఈ చర్చలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన ఈ భూములను లే అవుట్లుగా ఎందుకు మారుస్తున్నారంటూ తొలుత సురేశ్ ప్రొడక్షన్స్ కు నోటీసులు జారీ చేయాలని తీర్మానించింది. ఈ నోటీసులకు సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందన్న దానిపై తదుపరి నిర్ణయం ఉంటుందని కూడా తెలిపింది. అంటే.. ఈ భూములను లే అవుట్లుగా వేయలేదని, ఆ భూములు ఇంకా తమ అధీనంలోనే ఉన్నాయని, స్టూడియోను విస్తరించే దిశగా ఆ భూములను వినియోగిస్తామని సురేశ్ ప్రొడక్షన్స్ సమాధానం ఇస్తే సరేసరి.
అలా కాకుండా ఇంకే రకమైన సమాధానం సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చినా కూడా తక్షణమే 15.17 ఎకరాల భూములను వెనక్కు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ నుంచి ఆదేశాలు అందుకున్న విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. సురేశ్ ప్రొడక్షన్స్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ నోటీసులు సురేశ్ ప్రొడక్షన్స్ కు చేరనున్నట్లుగా సమాచారం. సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి సమాధానం వచ్చేందుకు ఓ నిర్ణీత గడువును విధించి మరీ నోటీసులు జారీ చేయనున్నారు. ఆ నిర్దేశిత సమయంలోగా సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి ప్రభుత్వానికి సమాధానం రావాల్సి ఉంది. అలా కాకుండా గడువు ముగిసినా… గడువులోగానే ప్రభుత్వానికి అసంతృప్తికర సమాధానం వచ్చినా… మరుక్షణమే 15.17 ఎకరాల భూములు ప్రభుత్వానికి స్వాధీనం అయిపోతాయి. ఈ లెక్కన ఇప్పటికీ ఆ భూములు సురేశ్ ప్రొడక్షన్స్ ఆధీనంలో ఉన్నా… వాటిని కాపాడుకునేందుకు ఆ సంస్థ ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on April 5, 2025 1:34 pm
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…