Political News

విశాఖలో సురేశ్ ప్రొడక్షన్ష్ భూముల్లో ఏం జరుగుతోంది..?

ఏపీ వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో సెంటు భూమి కూడా అత్యంత విలువైనదే. అలాంటి నగరంలో ఇప్పుడు 15.17 ఎకరాల భూమిపై పెద్ద వివాదమే నడుస్తోంది. ఈ భూమిని తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2003లో అప్పటి టీడీపీ సర్కారు రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం కేటాయించింది. స్టూడియో నిర్వాహకులుగా ఉన్న సురేశ్ ప్రొడక్షన్స్ కు నాడు టీడీపీ సర్కారు 34.44 ఎకరాల భూమిని కేటాయించింది. అక్కడ సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాల కోసం స్టూడియోను నిర్మించాలన్నది నాటి ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం మేరకు సురేశ్ ప్రొడక్షన్స్ అందులోని కొంత భాగంలో స్టూడియోను నిర్మించి..మిగిలిన స్థలాన్ని అలాగే ఖాళీగా ఉంచేసింది. ఈ ఖాళీగా ఉన్న భూములే ఇప్పుడు వివాదానికి కారణంగా నిలుస్తున్నాయి.

ఈ భూములకు సంబంధించి మొన్నటి ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరిగింది. స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థను బెదిరించి… ఖాళీగా ఉన్న భూములను కాజేసేందుకు యత్నిస్తున్నారన్న దిశగా జరిగిన ఈ చర్చలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన ఈ భూములను లే అవుట్లుగా ఎందుకు మారుస్తున్నారంటూ తొలుత సురేశ్ ప్రొడక్షన్స్ కు నోటీసులు జారీ చేయాలని తీర్మానించింది. ఈ నోటీసులకు సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందన్న దానిపై తదుపరి నిర్ణయం ఉంటుందని కూడా తెలిపింది. అంటే.. ఈ భూములను లే అవుట్లుగా వేయలేదని, ఆ భూములు ఇంకా తమ అధీనంలోనే ఉన్నాయని, స్టూడియోను విస్తరించే దిశగా ఆ భూములను వినియోగిస్తామని సురేశ్ ప్రొడక్షన్స్ సమాధానం ఇస్తే సరేసరి.

అలా కాకుండా ఇంకే రకమైన సమాధానం సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చినా కూడా తక్షణమే 15.17 ఎకరాల భూములను వెనక్కు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ నుంచి ఆదేశాలు అందుకున్న విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. సురేశ్ ప్రొడక్షన్స్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ నోటీసులు సురేశ్ ప్రొడక్షన్స్ కు చేరనున్నట్లుగా సమాచారం. సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి సమాధానం వచ్చేందుకు ఓ నిర్ణీత గడువును విధించి మరీ నోటీసులు జారీ చేయనున్నారు. ఆ నిర్దేశిత సమయంలోగా సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి ప్రభుత్వానికి సమాధానం రావాల్సి ఉంది. అలా కాకుండా గడువు ముగిసినా… గడువులోగానే ప్రభుత్వానికి అసంతృప్తికర సమాధానం వచ్చినా… మరుక్షణమే 15.17 ఎకరాల భూములు ప్రభుత్వానికి స్వాధీనం అయిపోతాయి. ఈ లెక్కన ఇప్పటికీ ఆ భూములు సురేశ్ ప్రొడక్షన్స్ ఆధీనంలో ఉన్నా… వాటిని కాపాడుకునేందుకు ఆ సంస్థ ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Satya

Recent Posts

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

23 minutes ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

3 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

4 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

4 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

4 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

5 hours ago