Political News

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రహస్యాలు, చీకటి కోణాలు, బయటకు రాని మర్మాలు అంటూ ఏవీ ఇక ఉండబోవని చెప్పాలి. ఏం చేసినా ఎదుటి వారికి కించిత్ కూడా అనుమానం రాకుండా…అసలు జరిగిన కార్యం ఎలా జరిగిందో కూడా అవతలి వారికి తెలియకుండా పనులు చక్కబెట్టడంలో వంశీది అందె వేసిన చేయ్యేనన్న ప్రచారం ఉంది కదా. ఆ తరహా ప్రచారం ఇకపై ఉండబోదు. ఎందుకంటే…తెర ముందు వంశీ ఉంటే…తెర వెనుక ఉండి వంశీ చెప్పిన పనులన్నీ ఎంచక్కా చక్కబెట్టే ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగారావు అలియాస్ రంగాను పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు కదా. తాజాగా రంగాను మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023లో వైసీీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అన్నీ వంశీనేని నాడు విపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపించింది. అంతేకాకుండా తన టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత అధికార పక్షం వైపు వెళ్లి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యాలయంపైనే దాడి చేయిచారని వంశీపై భగ్గుమంది. ఈ దాడిపై నాడే కేసు నమోదు కాగా.. అందులో వంశీ పేరే లేదు. అయితే వంశీకి రైట్ హ్యాండ్ గా పరిగణిస్తున్న రంగా పేరును ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ నాడు కేసు నమోదు అయ్యింది. విచారణ అటకెక్కింది. అయితే టీడీపీ నేతృత్వం లోని కూటమి అదికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు బూజు దులిపిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేయడంతో పాటుగా వంశీని 71వ నిందితుడిగా చేర్చింది.

ఇక ఈ కేసును కొట్టేయిద్దామని ప్లాన్ వేసిన వంశీ… దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టై, జైలుకు చేరిన తర్వాత రంగా కూడా ఇటీవలే పోలీసులకు చిక్కిపోయారు. ఇటీవలే రంగాను అరెస్టు చేసిన పోలీసులు… అతడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు… మూడు రోజుల పాటు రంగాను విచారించేందుకు సీఐడీ అదికారులకు అనుమతి మంజూరు చేసింది. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రంగాను సీఐడీ అధికారులు విచారించనున్నారు.

రంగాను విచారించే కేసు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయినా… ఈ దాడికి వంశీ తన అనుచరులను ఎలా ఉసిగొల్పారు? అసలు దాడుల విషయంలో వంశీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు? ఏదైనా వ్యవహారాన్ని ఆయన ఇతరులకు అనుమానం రాకుండా ఎలా చక్కబెడతారు? వంశీ చేసిన నేరాలు ఏ కారణం చేత బయటకు రావు? వంశీ ఆర్జించిన సంపాదనను ఆయన ఎక్కడ దాస్తారు? ఇంత పెద్ద ఎత్తున అనుచరులను వంశీ ఎలా మేనేజ్ చేస్తారు? అసలు గన్నవరంలో ఆయన ప్రైవేట్ సైన్యంలో ఎంత మంది ఉన్నారు?..తదితర వివరాలను రాబట్టేందుకు సీఐడీ అదికారులు పక్కా ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ విచారణ ముగిసిన తర్వాత వంశీకి సంబంధించిన అన్ని వివరాలు ఇట్టే బయటకు వస్తాయన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.

Satya

Recent Posts

సందీప్ సక్సెస్… ఐశ్వర్య ఫెయిల్..!

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఆస‌క్తిక‌ర పోరు జ‌రుగుతోంది. నాగ‌బంధం, రావు బ‌హ‌దూర్ లాంటి ఆస‌క్తిక‌ర చిత్రాలు థియేట‌ర్ల‌లోకి దిగాయి.…

3 hours ago

అందాల శ్రీదేవికి మళ్ళీ ఆఫర్లు వస్తాయా?

తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి విజయ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీనియర్ నటి వెండితెరపై ఒకప్పుడు తనకంటూ…

5 hours ago

గ్లామర్ డోస్ పెంచుతున్న త్రిష

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అనే ఒక టాక్ ఎప్పటినుంచో ఉంది. మాగ్జిమం ఐదు…

6 hours ago

790 కోట్ల మోసం… 3 కోట్లు రాబ‌ట్టిన ఈడీ!

దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభ‌కోణం కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌.. చేసిన ప‌ని విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ కేసులో ప్ర‌ధాన…

7 hours ago

ఏజెంట్ నిర్మాతతో ఏకీభ‌వించిన అఖిల్

అక్కినేని అఖిల్‌ను పెద్ద‌ స్టార్‌ను చేసేస్తుంద‌ని అభిమానులు ఆశించిన సినిమా.. ఏజెంట్. నిర్మాత అనిల్ సుంక‌ర సైతం రిలీజ్‌కు ముందు…

9 hours ago

తమన్ సంగీతానికి తమనే పోటీ

తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా…

10 hours ago