గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రహస్యాలు, చీకటి కోణాలు, బయటకు రాని మర్మాలు అంటూ ఏవీ ఇక ఉండబోవని చెప్పాలి. ఏం చేసినా ఎదుటి వారికి కించిత్ కూడా అనుమానం రాకుండా…అసలు జరిగిన కార్యం ఎలా జరిగిందో కూడా అవతలి వారికి తెలియకుండా పనులు చక్కబెట్టడంలో వంశీది అందె వేసిన చేయ్యేనన్న ప్రచారం ఉంది కదా. ఆ తరహా ప్రచారం ఇకపై ఉండబోదు. ఎందుకంటే…తెర ముందు వంశీ ఉంటే…తెర వెనుక ఉండి వంశీ చెప్పిన పనులన్నీ ఎంచక్కా చక్కబెట్టే ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగారావు అలియాస్ రంగాను పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు కదా. తాజాగా రంగాను మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023లో వైసీీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అన్నీ వంశీనేని నాడు విపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపించింది. అంతేకాకుండా తన టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత అధికార పక్షం వైపు వెళ్లి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యాలయంపైనే దాడి చేయిచారని వంశీపై భగ్గుమంది. ఈ దాడిపై నాడే కేసు నమోదు కాగా.. అందులో వంశీ పేరే లేదు. అయితే వంశీకి రైట్ హ్యాండ్ గా పరిగణిస్తున్న రంగా పేరును ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ నాడు కేసు నమోదు అయ్యింది. విచారణ అటకెక్కింది. అయితే టీడీపీ నేతృత్వం లోని కూటమి అదికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు బూజు దులిపిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేయడంతో పాటుగా వంశీని 71వ నిందితుడిగా చేర్చింది.
ఇక ఈ కేసును కొట్టేయిద్దామని ప్లాన్ వేసిన వంశీ… దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టై, జైలుకు చేరిన తర్వాత రంగా కూడా ఇటీవలే పోలీసులకు చిక్కిపోయారు. ఇటీవలే రంగాను అరెస్టు చేసిన పోలీసులు… అతడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు… మూడు రోజుల పాటు రంగాను విచారించేందుకు సీఐడీ అదికారులకు అనుమతి మంజూరు చేసింది. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రంగాను సీఐడీ అధికారులు విచారించనున్నారు.
రంగాను విచారించే కేసు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయినా… ఈ దాడికి వంశీ తన అనుచరులను ఎలా ఉసిగొల్పారు? అసలు దాడుల విషయంలో వంశీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు? ఏదైనా వ్యవహారాన్ని ఆయన ఇతరులకు అనుమానం రాకుండా ఎలా చక్కబెడతారు? వంశీ చేసిన నేరాలు ఏ కారణం చేత బయటకు రావు? వంశీ ఆర్జించిన సంపాదనను ఆయన ఎక్కడ దాస్తారు? ఇంత పెద్ద ఎత్తున అనుచరులను వంశీ ఎలా మేనేజ్ చేస్తారు? అసలు గన్నవరంలో ఆయన ప్రైవేట్ సైన్యంలో ఎంత మంది ఉన్నారు?..తదితర వివరాలను రాబట్టేందుకు సీఐడీ అదికారులు పక్కా ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ విచారణ ముగిసిన తర్వాత వంశీకి సంబంధించిన అన్ని వివరాలు ఇట్టే బయటకు వస్తాయన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.
This post was last modified on April 1, 2025 5:30 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…