Political News

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రహస్యాలు, చీకటి కోణాలు, బయటకు రాని మర్మాలు అంటూ ఏవీ ఇక ఉండబోవని చెప్పాలి. ఏం చేసినా ఎదుటి వారికి కించిత్ కూడా అనుమానం రాకుండా…అసలు జరిగిన కార్యం ఎలా జరిగిందో కూడా అవతలి వారికి తెలియకుండా పనులు చక్కబెట్టడంలో వంశీది అందె వేసిన చేయ్యేనన్న ప్రచారం ఉంది కదా. ఆ తరహా ప్రచారం ఇకపై ఉండబోదు. ఎందుకంటే…తెర ముందు వంశీ ఉంటే…తెర వెనుక ఉండి వంశీ చెప్పిన పనులన్నీ ఎంచక్కా చక్కబెట్టే ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగారావు అలియాస్ రంగాను పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు కదా. తాజాగా రంగాను మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023లో వైసీీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అన్నీ వంశీనేని నాడు విపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపించింది. అంతేకాకుండా తన టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత అధికార పక్షం వైపు వెళ్లి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యాలయంపైనే దాడి చేయిచారని వంశీపై భగ్గుమంది. ఈ దాడిపై నాడే కేసు నమోదు కాగా.. అందులో వంశీ పేరే లేదు. అయితే వంశీకి రైట్ హ్యాండ్ గా పరిగణిస్తున్న రంగా పేరును ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ నాడు కేసు నమోదు అయ్యింది. విచారణ అటకెక్కింది. అయితే టీడీపీ నేతృత్వం లోని కూటమి అదికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు బూజు దులిపిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేయడంతో పాటుగా వంశీని 71వ నిందితుడిగా చేర్చింది.

ఇక ఈ కేసును కొట్టేయిద్దామని ప్లాన్ వేసిన వంశీ… దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టై, జైలుకు చేరిన తర్వాత రంగా కూడా ఇటీవలే పోలీసులకు చిక్కిపోయారు. ఇటీవలే రంగాను అరెస్టు చేసిన పోలీసులు… అతడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు… మూడు రోజుల పాటు రంగాను విచారించేందుకు సీఐడీ అదికారులకు అనుమతి మంజూరు చేసింది. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రంగాను సీఐడీ అధికారులు విచారించనున్నారు.

రంగాను విచారించే కేసు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయినా… ఈ దాడికి వంశీ తన అనుచరులను ఎలా ఉసిగొల్పారు? అసలు దాడుల విషయంలో వంశీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు? ఏదైనా వ్యవహారాన్ని ఆయన ఇతరులకు అనుమానం రాకుండా ఎలా చక్కబెడతారు? వంశీ చేసిన నేరాలు ఏ కారణం చేత బయటకు రావు? వంశీ ఆర్జించిన సంపాదనను ఆయన ఎక్కడ దాస్తారు? ఇంత పెద్ద ఎత్తున అనుచరులను వంశీ ఎలా మేనేజ్ చేస్తారు? అసలు గన్నవరంలో ఆయన ప్రైవేట్ సైన్యంలో ఎంత మంది ఉన్నారు?..తదితర వివరాలను రాబట్టేందుకు సీఐడీ అదికారులు పక్కా ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ విచారణ ముగిసిన తర్వాత వంశీకి సంబంధించిన అన్ని వివరాలు ఇట్టే బయటకు వస్తాయన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.

This post was last modified on April 1, 2025 5:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

28 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

36 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago