Political News

జ‌గ‌న్‌పై టీడీపీ కోరిక.. మోడీ తీరుస్తారా ..!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను, ఆయ‌న అధికారంలో ఉండ‌గా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నాయ‌కుల‌ను కేంద్ర ద‌ర్యాప్తు బృందాల‌తో విచారించాల‌న్న‌ది ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కారులో ముఖ్య పాత్ర పోషిస్తున్న టీడీపీకి మ‌న‌సు నిండా ఉన్న కోరిక‌. అయితే.. ఇది అనుకున్నంత ఈజీయేనా? ప్ర‌ధాని మ‌న‌వాడే అయినా.. ఈ కోరిక నెర‌వేరుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. దీనికి కార‌ణం.. ఆ ఊరుకు.. ఈఊరు ఎంత దూరమో.. ఈ ఊరుకు .. ఆ ఊరు కూడా అంతే దూరం అన్న‌ట్టుగా మోడీ-జ‌గ‌న్‌ల రాజ‌కీయం కొన‌సాగు తోంది!

విష‌యం ఏంటి?

ప్ర‌స్తుతం జ‌గ‌న్‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసులు 11 ఏళ్లు అయినా.. ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు . పైగా ఆయా కేసుల్లో బెయిల్‌పై ఉన్న జ‌గ‌న్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ జైలు ముఖం కూడా చూసింది లేదు. అంతేకాదు.. అక్ర‌మాస్తుల కేసులు.. ఎప్పుడు విచార‌ణ‌కు వ‌స్తాయో కూడా తెలీదు. జ‌డ్జిల మార్పులు, కోర్టుల మార్పుల‌తోనే ఈ కేసులు న‌డుస్తున్నాయి. మ‌రోవైపు.. సొంత బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య విష‌యంలోనూ అలానే జ‌రుగుతోంది. ఏడో సంవ‌త్స‌రం వ‌చ్చినా.. ఈ కేసు ఎక్క‌డిద‌క్క‌డే ఉండిపోయింది.

టీడీపీ ఆశ ఇదీ..

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై మ‌రో కీల‌క కేసు న‌మోదు చేయాల‌న్న‌ది స‌హ‌జంగానే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న టీడీపీకి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం మాదిరిగానే.. ఏపీ మ‌ద్యం కుంభ‌కోణం కేసును కేంద్రం ప‌రిశీలించాల‌ని కోరుకుంటోంది. ఇదే.. తాజాగా ఎంపీ లావు శ్రీకృష్ణ‌ దేవ‌రాయులు నోటి నుంచి వ‌చ్చిన మాట‌. ఇదేమంత వ్య‌క్తిగ‌త విష‌యం కాదు. పైగా ఎంపీ లావు ఆ రేంజ్‌లో జ‌గ‌న్‌పై కేసును క‌దిపే సీన్‌కూడా లేదు. ఇది అటు పార్టీలోనూ.. ఇటు రాష్ట్ర స‌ర్కారులోనూ.. కీల‌క‌మైన వ్య‌వ‌హారం.

సో.. చాలా వ్యూహాత్మ‌కంగానే ఎంపీ లావు పార్ల‌మెంటులో ప్ర‌స్తావించారు. మ‌రి ఇది సాధ్య‌మేనా? జ‌గ‌న్‌పై టీడీపీ కోరిక నెర‌వేరుతుందా? మ‌ద్యం కుంభ‌కోణంలో జ‌గ‌న్ పై ఈడీ, సీబీఐ ద‌ర్యాప్తు సాధ్య‌ప‌డేనా? అంటే.. కాక‌పోవ‌చ్చ‌నే చెప్పాలి. ఎందుకంటే.. డిల్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు-ఏపీ ఘ‌ట‌న‌కు మ‌ధ్య పోలిక లేదు. పైగా.. ఢిల్లీలో బీజేపీకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు, అధికార ప్ర‌యోజ‌నాలు రెండు ఉన్నాయి. ఏపీ విష‌యానికి వ‌స్తే.. కేవ‌లం పొత్తు పార్టీ మాత్ర‌మే. సో.. ఇక్క‌డ జ‌గ‌న్‌పై చ‌ర్య‌లు తీసుకుంటే.. వెంట‌నే ల‌బ్ధి పొందేది.. ఏ పార్టీ? అంటే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కాబ‌ట్టి.. మోడీ అంత సాహ‌సం చేస్తార‌ని కానీ.. జ‌గ‌న్‌పై చ‌ర్య‌లు తీసుకుంటార‌ని కానీ.. ఊహించేందుకు అవ‌కాశం లేద‌ని టీడీపీ అనుకూల మీడియానే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

2 minutes ago

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

14 minutes ago

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

46 minutes ago

రాందేవ్ బాబాకు ధీటుగా చంద్రబాబు

జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…

1 hour ago

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

2 hours ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

2 hours ago