ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ పరిస్థితి ఆశించిన దానికంటే పూర్తిగా భిన్నంగా మారిపోయింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కి నాయకత్వం వహించిన పంత్, ఈ సీజన్కి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు వెళుతూ భారీ డీల్ తో వార్తల్లోకి వచ్చాడు. ఏకంగా రూ.27 కోట్లతో అతను టోర్నీలోనే అత్యధిక రేటుతో కొనుగోలైన ఆటగాడిగా నిలిచాడు. దీంతో అతని పాత్రపై ఆశలు అమాంతం పెరిగాయి. అయితే మొదటి మ్యాచ్నే చూస్తే ఆ అంచనాలు పూర్తిగా తారుమారు అయినట్టే.
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో లక్నోకు గెలిచే అవకాశాలు మెండుగా ఉండగా… పంత్ మాత్రం ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ కావడం తీవ్ర నిరాశను మిగిల్చింది. టాప్ ఆర్డర్లో మిగతా ప్లేయర్స్ బాగానే ఆడినా.. పంత్ అతి త్వరగా వెనుదిరిగిన తర్వాత భారీ స్కోరు చేయడంలో కాస్త తడబడింది. ఒకవైపు నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లాంటి బ్యాటర్లు భారీ స్కోర్లు చేయగలుగుతుంటే, కెప్టెన్ స్థాయిలో పంత్ ఏకంగా 6 బంతులు మింగేసి వెళ్లిపోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది.
పంత్ డిజాస్టర్ ఇక్కడితో ఆగలేదు. ఢిల్లీ అలౌట్ అయ్యే పరిస్థితిలో ఉండగా… చివర్లో వచ్చిన మోహిత్ శర్మను స్టంప్ అవుట్ చేసే అవకాశాన్ని కూడా పంత్ వదిలేశాడు. ఒక దశలో విజయం సులభంగా లక్నో వైపు మళ్లినప్పటికీ, ఆ ఒక్క స్టంపింగ్ మిస్ అవడం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది. అషుతోష్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా, చివర్లో మోహిత్ను ఔట్ చేస్తే.. విజయం లక్నో ఖాతాలో పడేది. కానీ, పంత్ చేతిలోంచి జారిన ఆ ఛాన్స్ జట్టుకు ఘోర పరాభవంగా మారింది.
కెప్టెన్సీ, బ్యాటింగ్, వికెట్ కీపింగ్.. మూడు విభాగాల్లోనూ పంత్ మొదటి మ్యాచ్లో నిరుత్సాహపరిచిన ఫలితాన్ని లక్నో గ్రహించాల్సిందే. రూ.27 కోట్లు పెట్టి తీసుకున్న ఓ సీనియర్ కెప్టెన్ ఇలాంటి మ్యాచ్లో తేలిపోవడం, మ్యాచ్ మోమెంటమ్ను కోల్పోవడం వంటి అంశాలపై తీవ్ర విశ్లేషణ మొదలవుతోంది. ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క మ్యాచ్తోనే తీర్పు చెప్పలేమని అనుకున్నా… పంత్ తన విలువను ప్రూవ్ చేసుకోవాలంటే తర్వలోనే బౌన్స్ బ్యాక్ కావడం తప్పనిసరి.
This post was last modified on March 25, 2025 5:52 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…