ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ పరిస్థితి ఆశించిన దానికంటే పూర్తిగా భిన్నంగా మారిపోయింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కి నాయకత్వం వహించిన పంత్, ఈ సీజన్కి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు వెళుతూ భారీ డీల్ తో వార్తల్లోకి వచ్చాడు. ఏకంగా రూ.27 కోట్లతో అతను టోర్నీలోనే అత్యధిక రేటుతో కొనుగోలైన ఆటగాడిగా నిలిచాడు. దీంతో అతని పాత్రపై ఆశలు అమాంతం పెరిగాయి. అయితే మొదటి మ్యాచ్నే చూస్తే ఆ అంచనాలు పూర్తిగా తారుమారు అయినట్టే.
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో లక్నోకు గెలిచే అవకాశాలు మెండుగా ఉండగా… పంత్ మాత్రం ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ కావడం తీవ్ర నిరాశను మిగిల్చింది. టాప్ ఆర్డర్లో మిగతా ప్లేయర్స్ బాగానే ఆడినా.. పంత్ అతి త్వరగా వెనుదిరిగిన తర్వాత భారీ స్కోరు చేయడంలో కాస్త తడబడింది. ఒకవైపు నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లాంటి బ్యాటర్లు భారీ స్కోర్లు చేయగలుగుతుంటే, కెప్టెన్ స్థాయిలో పంత్ ఏకంగా 6 బంతులు మింగేసి వెళ్లిపోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది.
పంత్ డిజాస్టర్ ఇక్కడితో ఆగలేదు. ఢిల్లీ అలౌట్ అయ్యే పరిస్థితిలో ఉండగా… చివర్లో వచ్చిన మోహిత్ శర్మను స్టంప్ అవుట్ చేసే అవకాశాన్ని కూడా పంత్ వదిలేశాడు. ఒక దశలో విజయం సులభంగా లక్నో వైపు మళ్లినప్పటికీ, ఆ ఒక్క స్టంపింగ్ మిస్ అవడం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది. అషుతోష్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా, చివర్లో మోహిత్ను ఔట్ చేస్తే.. విజయం లక్నో ఖాతాలో పడేది. కానీ, పంత్ చేతిలోంచి జారిన ఆ ఛాన్స్ జట్టుకు ఘోర పరాభవంగా మారింది.
కెప్టెన్సీ, బ్యాటింగ్, వికెట్ కీపింగ్.. మూడు విభాగాల్లోనూ పంత్ మొదటి మ్యాచ్లో నిరుత్సాహపరిచిన ఫలితాన్ని లక్నో గ్రహించాల్సిందే. రూ.27 కోట్లు పెట్టి తీసుకున్న ఓ సీనియర్ కెప్టెన్ ఇలాంటి మ్యాచ్లో తేలిపోవడం, మ్యాచ్ మోమెంటమ్ను కోల్పోవడం వంటి అంశాలపై తీవ్ర విశ్లేషణ మొదలవుతోంది. ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క మ్యాచ్తోనే తీర్పు చెప్పలేమని అనుకున్నా… పంత్ తన విలువను ప్రూవ్ చేసుకోవాలంటే తర్వలోనే బౌన్స్ బ్యాక్ కావడం తప్పనిసరి.
This post was last modified on March 25, 2025 5:52 am
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…