సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వ సాధారణం. దీనికి ఎవరూ మినహాయింపుగా నిలవడం లేదు. కొందరు పోటీ వల్ల అక్కసుతో, మరికొందరు అదో రకమైన పైశాచిక ఆనందంతో ఇలా రకరకాల కారణాల వల్ల ఆన్ లైన్ ని ఒక చెత్తబుట్టగా మార్చేశారు. ఏదో ఒక రూపంలో అందరూ బాధితులే. ఒక డిజాస్టర్ వస్తే చిరంజీవిని సైతం లెక్క చేయని బ్యాచ్ ఇది. మంచు విష్ణు తన కుటుంబం మీద జరుగుతున్న నెట్ దాడికి మినీ యుద్ధమే చేయాల్సి వచ్చింది. స్టార్ హీరోలు పెద్దగా పట్టించుకోరు కానీ గ్రౌండ్ లెవెల్ లో అభిమానులు చేసుకునే ట్రోలింగ్ వార్ మహా దారుణంగా ఉంటుందనేది వాస్తవం.
దీని బారిన పడిన హీరోయిన్లు ఎందరో. పూజా హెగ్డే కూడా ఈ లిస్టులో ఉంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో దీని గురించి స్పందించింది. తనను ట్రోల్ చేస్తున్న పేజెస్ గురించి కనుక్కోమని తన టీమ్ కు చెబితే అప్పుడు షాకింగ్ విషయాలు కొన్ని తెలిశాయట. వెనుక నుండి కొందరు డబ్బులిచ్చి మరీ ట్రోలింగ్ చేయిస్తున్న సంగతి బయట పడింది. అంతే కాదు ఒకవేళ వాటిని ఆపాలంటే ఎంత మొత్తం ఖర్చవుతుందో ముందే చెప్పేస్తున్నారు. అంటే చేయడానికి ఒక రేటు, చేసింది ఆపేయడానికి ఒక రేటు. ఈ వ్యాపారమేదో బాగుంది కదూ. అలాని హీరో హీరోయిన్లు ఉత్తి పుణ్యానికి డబ్బులు ఇచ్చుకుంటూ పోలేరు కదా.
ఈ సమస్య పూజాతో మొదలైంది కాదు, ఇకపై ఆగేది కూడా కాదు. ట్విట్టర్, ఇన్స్ టాలో దొంగ ఐడిలతో చాటుగా చేసే ఇలాంటి ట్రోలింగ్ దందాలు వేలల్లో కాదు లక్షల్లో ఉంటున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ టైంలో ఇవి పతాక స్థాయికి చేరుకున్న సందర్భాలు ఎన్నో. దేవరకు అదే జరిగింది కానీ తట్టుకుని నిలబడి విజయం సాధించింది. పుష్ప 2కి ట్రై చేశారు కానీ జరిగింది చరిత్ర. కంటెంట్ బాలేకపోవడం వల్ల గేమ్ ఛేంజర్ దొరికిపోయింది కానీ లేదంటే రామ్ చరణ్ అంత ద్వేషానికి గురయ్యేవాడు కాదు. పరిశ్రమను వేధిస్తున్న పైరసీ లాగే ఈ ట్రోలింగ్ కూడా ఎవరూ కట్టడి చేయలేని పెను భూతంగా మారిపోతోంది.
This post was last modified on March 25, 2025 10:22 am
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…