Political News

అసెంబ్లీ దగ్గర జగదీష్ రెడ్డికి మార్షల్స్ షాక్

అసెంబ్లీలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్పీకర్ ను ఏమీ అనలేదని, ఎందుకు సస్పెండ్ చేయాలో చెప్పాలని జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు అసెంబ్లీకి వచ్చిన జగదీష్ రెడ్డిని చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. అసెంబ్లీకి రావద్దని, అనుమతి లేదని జగదీష్ రెడ్డికి సూచించారు.

అయితే, తనను అసెంబ్లీకి రావొద్దంటూ స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ, ఆ బులిటెన్ ను చీఫ్ మార్షల్ చూపించలేదు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బులిటెన్ ఇస్తే కోర్టుకు వెళ్తామన్న భయంతోనే బులిటెన్ ఇవ్వడం లేదని స్పీకర్ పై షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇప్పటికే 2 సార్లు స్పీకర్ గారిని కలిసి ఎందుకు సస్పెండ్ చేశారో బులిటెన్ ఇవ్వాలని కోరానని, అయినా ఇవ్వలేదని చెప్పారు. అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోందని, రాజ్యాంగ విలువలు లేకుండా రాజుల కాలంలో ఉన్నట్టు ఉందని ఆరోపించారు.

మరోవైపు, అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వడగండ్ల వానతో పంట నష్టం జరిగిందని విరిగిన మొక్కజొన్న కంకులు, రాలిపడిన మామిడికాయలు తెచ్చి బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపలకు, మీడియా పాయింట్ దగ్గరకు ఎలాంటి వస్తువులు తేవొద్దంటూ వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. మీడియా పాయింట్ వద్ద రైతులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.

This post was last modified on March 24, 2025 12:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

36 minutes ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

4 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

4 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

5 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

5 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

6 hours ago