అసెంబ్లీలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్పీకర్ ను ఏమీ అనలేదని, ఎందుకు సస్పెండ్ చేయాలో చెప్పాలని జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు అసెంబ్లీకి వచ్చిన జగదీష్ రెడ్డిని చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. అసెంబ్లీకి రావద్దని, అనుమతి లేదని జగదీష్ రెడ్డికి సూచించారు.
అయితే, తనను అసెంబ్లీకి రావొద్దంటూ స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ, ఆ బులిటెన్ ను చీఫ్ మార్షల్ చూపించలేదు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బులిటెన్ ఇస్తే కోర్టుకు వెళ్తామన్న భయంతోనే బులిటెన్ ఇవ్వడం లేదని స్పీకర్ పై షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇప్పటికే 2 సార్లు స్పీకర్ గారిని కలిసి ఎందుకు సస్పెండ్ చేశారో బులిటెన్ ఇవ్వాలని కోరానని, అయినా ఇవ్వలేదని చెప్పారు. అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోందని, రాజ్యాంగ విలువలు లేకుండా రాజుల కాలంలో ఉన్నట్టు ఉందని ఆరోపించారు.
మరోవైపు, అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వడగండ్ల వానతో పంట నష్టం జరిగిందని విరిగిన మొక్కజొన్న కంకులు, రాలిపడిన మామిడికాయలు తెచ్చి బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపలకు, మీడియా పాయింట్ దగ్గరకు ఎలాంటి వస్తువులు తేవొద్దంటూ వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. మీడియా పాయింట్ వద్ద రైతులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.
This post was last modified on March 24, 2025 12:34 pm
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…