అసెంబ్లీలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్పీకర్ ను ఏమీ అనలేదని, ఎందుకు సస్పెండ్ చేయాలో చెప్పాలని జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు అసెంబ్లీకి వచ్చిన జగదీష్ రెడ్డిని చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. అసెంబ్లీకి రావద్దని, అనుమతి లేదని జగదీష్ రెడ్డికి సూచించారు.
అయితే, తనను అసెంబ్లీకి రావొద్దంటూ స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ, ఆ బులిటెన్ ను చీఫ్ మార్షల్ చూపించలేదు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బులిటెన్ ఇస్తే కోర్టుకు వెళ్తామన్న భయంతోనే బులిటెన్ ఇవ్వడం లేదని స్పీకర్ పై షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇప్పటికే 2 సార్లు స్పీకర్ గారిని కలిసి ఎందుకు సస్పెండ్ చేశారో బులిటెన్ ఇవ్వాలని కోరానని, అయినా ఇవ్వలేదని చెప్పారు. అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోందని, రాజ్యాంగ విలువలు లేకుండా రాజుల కాలంలో ఉన్నట్టు ఉందని ఆరోపించారు.
మరోవైపు, అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వడగండ్ల వానతో పంట నష్టం జరిగిందని విరిగిన మొక్కజొన్న కంకులు, రాలిపడిన మామిడికాయలు తెచ్చి బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపలకు, మీడియా పాయింట్ దగ్గరకు ఎలాంటి వస్తువులు తేవొద్దంటూ వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. మీడియా పాయింట్ వద్ద రైతులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.
This post was last modified on March 24, 2025 12:34 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…