అసెంబ్లీలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్పీకర్ ను ఏమీ అనలేదని, ఎందుకు సస్పెండ్ చేయాలో చెప్పాలని జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు అసెంబ్లీకి వచ్చిన జగదీష్ రెడ్డిని చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. అసెంబ్లీకి రావద్దని, అనుమతి లేదని జగదీష్ రెడ్డికి సూచించారు.
అయితే, తనను అసెంబ్లీకి రావొద్దంటూ స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ, ఆ బులిటెన్ ను చీఫ్ మార్షల్ చూపించలేదు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బులిటెన్ ఇస్తే కోర్టుకు వెళ్తామన్న భయంతోనే బులిటెన్ ఇవ్వడం లేదని స్పీకర్ పై షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇప్పటికే 2 సార్లు స్పీకర్ గారిని కలిసి ఎందుకు సస్పెండ్ చేశారో బులిటెన్ ఇవ్వాలని కోరానని, అయినా ఇవ్వలేదని చెప్పారు. అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోందని, రాజ్యాంగ విలువలు లేకుండా రాజుల కాలంలో ఉన్నట్టు ఉందని ఆరోపించారు.
మరోవైపు, అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వడగండ్ల వానతో పంట నష్టం జరిగిందని విరిగిన మొక్కజొన్న కంకులు, రాలిపడిన మామిడికాయలు తెచ్చి బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపలకు, మీడియా పాయింట్ దగ్గరకు ఎలాంటి వస్తువులు తేవొద్దంటూ వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. మీడియా పాయింట్ వద్ద రైతులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…