Political News

స్వర్ణ దేవాలయంలో నారా లోకేశ్ ఫ్యామిలీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి సెలవు రోజు ఆదివారం ఎంచక్కా ఆధ్మాత్మీక పర్యటనకు వెళ్లారు. సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి ఉత్తర భారతం వెళ్లిన లోకేశ్… పంజాబ్ లోని సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అమృత్ సర్ లోని ఈ దేవాలయంలో భార్య, కుమారుడితో కలిసి ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా తన ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించిన వివరాలను లోకేశే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అమృత్ సర్ లోని హర్ మందిర్ సాహిబ్ ను దర్శించుకున్నానని తెలిపిన లోకేశ్… తనకు దక్కిన అరుదైన అవకాశంగా ఈ ఆలయ దర్శనాన్ని భావిస్తున్నానని పేర్కొన్నారు. శాంతి సౌభ్రాతృత్వాలను ప్రసాదించాలని కోరుకున్నానని తెలిపారు. స్వర్ణ దేవాలయం ప్రాశస్త్యం నిజంగా అద్భుతమని, ఆలయ దర్శనం ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భార్య, కుమారుడితో కలిసి పూజలు చేస్తున్న, ఆయలంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఫొటోలను ఆయన షేర్ చేశారు.

మహాకుంభ మేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు కుటుంబంతో కలిసి నారా లోకేశ్ ఇటీవలే ప్రయాగ్ రాజ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం తన కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని లోకేశ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో పాలుపంచుకున్నారు. తిరుమల టూర్ లో లోకేశ్ ఫ్యామిలీతో పాటు ఆయన తల్లితండ్రి కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం చడీచప్పుడు లేకుండానే లోకేశ్ తెల్లవారే సరికంతా అమృత్ సర్ లో ప్రత్యక్షమయ్యారు. లోకేశ్ వెల్లడించే దాకా ఆయన అమృత్ సర్ వెళ్లిన విషయమే ఎవరికీ తెలియదని చెప్పాలి.

This post was last modified on March 23, 2025 4:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

25 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago