Political News

స్వర్ణ దేవాలయంలో నారా లోకేశ్ ఫ్యామిలీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి సెలవు రోజు ఆదివారం ఎంచక్కా ఆధ్మాత్మీక పర్యటనకు వెళ్లారు. సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి ఉత్తర భారతం వెళ్లిన లోకేశ్… పంజాబ్ లోని సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అమృత్ సర్ లోని ఈ దేవాలయంలో భార్య, కుమారుడితో కలిసి ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా తన ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించిన వివరాలను లోకేశే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అమృత్ సర్ లోని హర్ మందిర్ సాహిబ్ ను దర్శించుకున్నానని తెలిపిన లోకేశ్… తనకు దక్కిన అరుదైన అవకాశంగా ఈ ఆలయ దర్శనాన్ని భావిస్తున్నానని పేర్కొన్నారు. శాంతి సౌభ్రాతృత్వాలను ప్రసాదించాలని కోరుకున్నానని తెలిపారు. స్వర్ణ దేవాలయం ప్రాశస్త్యం నిజంగా అద్భుతమని, ఆలయ దర్శనం ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భార్య, కుమారుడితో కలిసి పూజలు చేస్తున్న, ఆయలంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఫొటోలను ఆయన షేర్ చేశారు.

మహాకుంభ మేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు కుటుంబంతో కలిసి నారా లోకేశ్ ఇటీవలే ప్రయాగ్ రాజ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం తన కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని లోకేశ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో పాలుపంచుకున్నారు. తిరుమల టూర్ లో లోకేశ్ ఫ్యామిలీతో పాటు ఆయన తల్లితండ్రి కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం చడీచప్పుడు లేకుండానే లోకేశ్ తెల్లవారే సరికంతా అమృత్ సర్ లో ప్రత్యక్షమయ్యారు. లోకేశ్ వెల్లడించే దాకా ఆయన అమృత్ సర్ వెళ్లిన విషయమే ఎవరికీ తెలియదని చెప్పాలి.

Satya

Recent Posts

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

55 minutes ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

2 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

4 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

6 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

11 hours ago