Political News

స్వర్ణ దేవాలయంలో నారా లోకేశ్ ఫ్యామిలీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి సెలవు రోజు ఆదివారం ఎంచక్కా ఆధ్మాత్మీక పర్యటనకు వెళ్లారు. సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి ఉత్తర భారతం వెళ్లిన లోకేశ్… పంజాబ్ లోని సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అమృత్ సర్ లోని ఈ దేవాలయంలో భార్య, కుమారుడితో కలిసి ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా తన ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించిన వివరాలను లోకేశే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అమృత్ సర్ లోని హర్ మందిర్ సాహిబ్ ను దర్శించుకున్నానని తెలిపిన లోకేశ్… తనకు దక్కిన అరుదైన అవకాశంగా ఈ ఆలయ దర్శనాన్ని భావిస్తున్నానని పేర్కొన్నారు. శాంతి సౌభ్రాతృత్వాలను ప్రసాదించాలని కోరుకున్నానని తెలిపారు. స్వర్ణ దేవాలయం ప్రాశస్త్యం నిజంగా అద్భుతమని, ఆలయ దర్శనం ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భార్య, కుమారుడితో కలిసి పూజలు చేస్తున్న, ఆయలంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఫొటోలను ఆయన షేర్ చేశారు.

మహాకుంభ మేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు కుటుంబంతో కలిసి నారా లోకేశ్ ఇటీవలే ప్రయాగ్ రాజ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం తన కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని లోకేశ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో పాలుపంచుకున్నారు. తిరుమల టూర్ లో లోకేశ్ ఫ్యామిలీతో పాటు ఆయన తల్లితండ్రి కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం చడీచప్పుడు లేకుండానే లోకేశ్ తెల్లవారే సరికంతా అమృత్ సర్ లో ప్రత్యక్షమయ్యారు. లోకేశ్ వెల్లడించే దాకా ఆయన అమృత్ సర్ వెళ్లిన విషయమే ఎవరికీ తెలియదని చెప్పాలి.

This post was last modified on March 23, 2025 4:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

6 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

7 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

8 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

8 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago