Political News

‘జంపింగ్’లపై మల్లారెడ్డి మాటలు విన్నారా?

చామకూర మల్లారెడ్డి… నిత్యం వార్తల్లో ఉండే రాజకీయ నాయకుడు. పూలమ్మాను, పాలమ్మాను అంటూనే విద్యావేత్తగా మారిపోయిన మల్లారెడ్డి… ఆ తర్వాత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మల్కాజిగిరి ఎంపీగా వచ్చీరాగానే సత్తా చాటిన మల్లారెడ్డి… ఆ తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏకంగా తెలంగాణ మంత్రిగానూ ఆయన పదవి దక్కించుకున్నారు. ఇక ఎమ్మెల్యేగా మరోమారు గెలిచిన మల్లారెడ్డి… తాజాగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు నిజమేన్నట్లుగా శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డితో బేటీ అయ్యారు. ఈ భేటీపై ఊహాగానాలు మొదలు కాగానే.. వాటికి చెక్ పెట్టేవా మల్లారెడ్డి శనివారం తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.

72 ఏళ్ల వయసు వచ్చిందని.. ఈ వయసులో తానెందుకు పార్టీ మారతానని మల్లారెడ్డి ఓ లాజిక్ లెస్ వ్యాఖ్య చేశారు. పార్టీ మారాల్సిన అవసరం తనకేముందని అన్నారు. కవేలం ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల గురించి మాట్లాడేందుకే తాను సీఎంతో భేటీ అయ్యానని మల్లారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ లో తాను ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానని కూడా ఆయన అన్నారు. బీఆర్ఎస్ లో తమ కుటుంబం ఆశించిన మేర సీట్లు లబిస్తే… ఏకంగా పోటీ చేసేందుకు నలుగురు రెడీ గా ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా జమిలి ఎన్నికలు గనుక వస్తే… తాను ఎంపీగా పోటీ చేస్తానని కూడా మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తంగా బీఆర్ఎస్ ను వదలాల్సిన అవసరం తనకేమీ లేదన్న మల్లారెడ్డి… కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం కూడా తనకు లేదని తేల్చి పారేశారు.

సరిగ్గా రాష్ట్ర విభజన సమయంలోనే మల్లారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన సీమాంధ్రులు అత్యధికంగా ఉన్న మల్కాజిగిరీ పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాదించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మల్లారెడ్డి కూడా తన రూటును మార్చుకున్నారు. టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాదించారు. ఆ తర్వాత రెండంటే రెండు నెలల్లోనే ఆయన తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా మారిపోయారు. ఇక 2023లోనూ మేడ్చల్ నుంచే బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన వరుసగా రెండుసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన విపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.

This post was last modified on March 22, 2025 1:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

24 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

1 hour ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

1 hour ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago