జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార సరళి ఇతరులకు భిన్నంగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకున్నారంటే… పవన్ దానిపై ఏమంత పెద్దగా ఆలోచన చేయరు. అనుకున్న వెంటనే దానిని చేసేయడమే ఆయనకు తెలుసు. కౌలు రైతులకు ఆర్థిక సాయమైనా… అగ్ని ప్రమాదంలో సర్వ కోల్పోయిన జాలరులను ఆదుకోవడంలో అయినా… పవన్ ఇలా అనుకుని అలా రంగంలోకి దిగిపోయారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా పవన్ తీరులో ఈ తరహా వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. మన్యం జిల్లాలో ఓ మారుమూల పల్లెలో ఓ పాఠశాలను ఆయన పునర్మిస్తున్నారు. ఇందుకోసం ఆయన పూర్తిగా తన సొంత నిధులనే వెచ్చిస్తున్నారు.
అల్లూరి సీతారామారాజు మన్యం జిల్లా పరిధిలోని అనంతగిరి మండలం బల్లగరవ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఇటీవల వెళ్లిన పవన్… ఆ పనులను పరిశీలించిన తర్వాత తిరుగు ప్రయాణంలో బల్లగరవ గ్రామానికి ఓ కిలో మీటర్ దూరంలో ఉన్న చిన్న మజరా గ్రామంలో ఓ 43 మంది పిల్లలు చదువుతున్న పాఠశాలను చూశారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాఠశాల భవనంలోనే పిల్లలు చదువుతున్నారు. తాగు నీటి వసతి లేదు. మరుగుదొడ్లు ఆనవాళ్లే కనిపించలేదు. సైలెంట్ గా మొత్తాన్ని పరిశీలించి.. ఓ పెన్నూపేపరు తీసుకుని అంతా నోట్ చేసుకున్నారు. ఎవరితో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత అసలు పని ప్రారంభమైపోయింది.
కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న సదరు పాఠశాల భవనం కూలిపోయింది. దాని స్థానంలో దాని కంటే ఒకింత పెద్దగా, విశాలంగా పాఠశాల భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దాని పక్కనే బోరు వేశారు. ఆ బోరులో నిండా నీరు పడింది. పాఠశాల భవనం, దాని పరిసరాల చుట్టూ ఎంచక్కా ప్రహరీ గోడ కూడా కడుతున్నారు. ఆ ప్రాంగణంలోనే పిల్లలకు మరుగుదొడ్లు కూడా నిర్మాణం అవుతున్నాయి. ఈ పనులన్నీ కూడా సర్కారీ నిధులతో చేపట్టే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఓ ఆర్డర్ వేస్తే ఇట్టే పనులు జరిగిపోతాయి. అయితే ఆ తంతు అంతటినీ పక్కనపెట్టేసిన పవన్… ఆ పాఠశాల నిర్మాణానికి పూర్తిగా తన నిధులను వెచ్చిస్తున్నారు. మరి దాని పరిశీలన సందర్బంగా పనవ్ మనసులో ఎలాంటి భావన కలిగిందో తెలియదు గానీ… దానిని దత్తత తీసుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
This post was last modified on March 20, 2025 9:36 am
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…