జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో, టీమిండియా పాయింట్ల ఆధారంగా సులువుగా ముందడుగు వేయాలంటే కొన్ని సమీకరణాలు అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 26న జరిగే మ్యాచ్లు కీలకంగా మారనున్నాయి.
మొదటి సమీకరణం ఏంటంటే.. సౌత్ ఆఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్ల్లో వెస్టిండీస్ను, జింబాబ్వేను ఓడించాలి. ఇలా జరిగితే సౌత్ ఆఫ్రికా 6 పాయింట్లతో టేబుల్ టాప్లో ఉంటుంది. అప్పుడు భారత్ తన తదుపరి రెండు మ్యాచ్ల్లో (జింబాబ్వే, వెస్టిండీస్) విజయం సాధిస్తే, 4 పాయింట్లు వస్తాయి. విండీస్ 2 పాయింట్లతోనే ఆగిపోతుంది కాబట్టి, రన్ రేట్తో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్కు వెళ్లే అవకాశం ఉంటుంది.
అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఒకవేళ వెస్టిండీస్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే మాత్రం భారత్కు కష్టాలు మొదలవుతాయి. అప్పుడు భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్.. (జింబాబ్వేను ఓడిస్తే) ఈ మూడు జట్లు చెరో రెండు విజయాలతో 4 పాయింట్ల దగ్గర సమానంగా నిలిచే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో ఏ రెండు జట్లు సెమీస్ వెళ్లాలో నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఆ పరిస్థితి వస్తే ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.
అందుకే భారత్ తన వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే.. మొదట జింబాబ్వేపై ఘనవిజయం సాధించాలి. ఆ తర్వాత మార్చి 1న జరిగే మ్యాచ్లో వెస్టిండీస్ను భారీ రన్ రేట్ తేడాతో ఓడించాలి. ఇలా చేయడం వల్ల ఒకవేళ రన్ రేట్ లెక్కలోకి వచ్చినా పోటీలో ఉండే అవకాశం ఉంటుంది.
అంటే భారత్ గెలవడమే కాకుండా, సౌత్ ఆఫ్రికా తన జోరును కొనసాగించి విండీస్ను అడ్డుకోవాలని కోరుకోవాలి. టీమిండియా భవితవ్యం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రదర్శన మీద కూడా ఆధారపడి ఉంది. రెండు మ్యాచ్లు గెలుస్తూ, సఫారీలు విండీస్ను ఓడిస్తే భారత్ దారి సుగమం అవుతుంది. మరి ఈ వారం రోజుల్లో జరిగే ఈ సమీకరణాల్లో ఏది నిజమవుతుందో చూడాలి.
This post was last modified on February 24, 2026 2:27 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…