జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో, టీమిండియా పాయింట్ల ఆధారంగా సులువుగా ముందడుగు వేయాలంటే కొన్ని సమీకరణాలు అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 26న జరిగే మ్యాచ్లు కీలకంగా మారనున్నాయి.
మొదటి సమీకరణం ఏంటంటే.. సౌత్ ఆఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్ల్లో వెస్టిండీస్ను, జింబాబ్వేను ఓడించాలి. ఇలా జరిగితే సౌత్ ఆఫ్రికా 6 పాయింట్లతో టేబుల్ టాప్లో ఉంటుంది. అప్పుడు భారత్ తన తదుపరి రెండు మ్యాచ్ల్లో (జింబాబ్వే, వెస్టిండీస్) విజయం సాధిస్తే, 4 పాయింట్లు వస్తాయి. విండీస్ 2 పాయింట్లతోనే ఆగిపోతుంది కాబట్టి, రన్ రేట్తో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్కు వెళ్లే అవకాశం ఉంటుంది.
అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఒకవేళ వెస్టిండీస్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే మాత్రం భారత్కు కష్టాలు మొదలవుతాయి. అప్పుడు భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్.. (జింబాబ్వేను ఓడిస్తే) ఈ మూడు జట్లు చెరో రెండు విజయాలతో 4 పాయింట్ల దగ్గర సమానంగా నిలిచే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో ఏ రెండు జట్లు సెమీస్ వెళ్లాలో నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఆ పరిస్థితి వస్తే ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.
అందుకే భారత్ తన వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే.. మొదట జింబాబ్వేపై ఘనవిజయం సాధించాలి. ఆ తర్వాత మార్చి 1న జరిగే మ్యాచ్లో వెస్టిండీస్ను భారీ రన్ రేట్ తేడాతో ఓడించాలి. ఇలా చేయడం వల్ల ఒకవేళ రన్ రేట్ లెక్కలోకి వచ్చినా పోటీలో ఉండే అవకాశం ఉంటుంది.
అంటే భారత్ గెలవడమే కాకుండా, సౌత్ ఆఫ్రికా తన జోరును కొనసాగించి విండీస్ను అడ్డుకోవాలని కోరుకోవాలి. టీమిండియా భవితవ్యం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రదర్శన మీద కూడా ఆధారపడి ఉంది. రెండు మ్యాచ్లు గెలుస్తూ, సఫారీలు విండీస్ను ఓడిస్తే భారత్ దారి సుగమం అవుతుంది. మరి ఈ వారం రోజుల్లో జరిగే ఈ సమీకరణాల్లో ఏది నిజమవుతుందో చూడాలి.
This post was last modified on February 24, 2026 2:27 pm
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖలో గత రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు…
భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే…
నిన్న రిలీజైన కొత్త సినిమాలు ఏ దిశకు వెళ్తున్నాయో ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. పూర్తి క్లారిటీ సోమవారానికి…