Trends

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో, టీమిండియా పాయింట్ల ఆధారంగా సులువుగా ముందడుగు వేయాలంటే కొన్ని సమీకరణాలు అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 26న జరిగే మ్యాచ్‌లు కీలకంగా మారనున్నాయి.

మొదటి సమీకరణం ఏంటంటే.. సౌత్ ఆఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ను, జింబాబ్వేను ఓడించాలి. ఇలా జరిగితే సౌత్ ఆఫ్రికా 6 పాయింట్లతో టేబుల్ టాప్‌లో ఉంటుంది. అప్పుడు భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో (జింబాబ్వే, వెస్టిండీస్) విజయం సాధిస్తే, 4 పాయింట్లు వస్తాయి. విండీస్ 2 పాయింట్లతోనే ఆగిపోతుంది కాబట్టి, రన్ రేట్‌తో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఒకవేళ వెస్టిండీస్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే మాత్రం భారత్‌కు కష్టాలు మొదలవుతాయి. అప్పుడు భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్.. (జింబాబ్వేను ఓడిస్తే) ఈ మూడు జట్లు చెరో రెండు విజయాలతో 4 పాయింట్ల దగ్గర సమానంగా నిలిచే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో ఏ రెండు జట్లు సెమీస్ వెళ్లాలో నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఆ పరిస్థితి వస్తే ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.

అందుకే భారత్ తన వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే.. మొదట జింబాబ్వేపై ఘనవిజయం సాధించాలి. ఆ తర్వాత మార్చి 1న జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను భారీ రన్ రేట్ తేడాతో ఓడించాలి. ఇలా చేయడం వల్ల ఒకవేళ రన్ రేట్ లెక్కలోకి వచ్చినా పోటీలో ఉండే అవకాశం ఉంటుంది.

అంటే భారత్ గెలవడమే కాకుండా, సౌత్ ఆఫ్రికా తన జోరును కొనసాగించి విండీస్‌ను అడ్డుకోవాలని కోరుకోవాలి. టీమిండియా భవితవ్యం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రదర్శన మీద కూడా ఆధారపడి ఉంది. రెండు మ్యాచ్‌లు గెలుస్తూ, సఫారీలు విండీస్‌ను ఓడిస్తే భారత్ దారి సుగమం అవుతుంది. మరి ఈ వారం రోజుల్లో జరిగే ఈ సమీకరణాల్లో ఏది నిజమవుతుందో చూడాలి.

This post was last modified on February 24, 2026 2:27 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

15 minutes ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

3 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

3 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

4 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

6 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

10 hours ago