జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో, టీమిండియా పాయింట్ల ఆధారంగా సులువుగా ముందడుగు వేయాలంటే కొన్ని సమీకరణాలు అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 26న జరిగే మ్యాచ్లు కీలకంగా మారనున్నాయి.
మొదటి సమీకరణం ఏంటంటే.. సౌత్ ఆఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్ల్లో వెస్టిండీస్ను, జింబాబ్వేను ఓడించాలి. ఇలా జరిగితే సౌత్ ఆఫ్రికా 6 పాయింట్లతో టేబుల్ టాప్లో ఉంటుంది. అప్పుడు భారత్ తన తదుపరి రెండు మ్యాచ్ల్లో (జింబాబ్వే, వెస్టిండీస్) విజయం సాధిస్తే, 4 పాయింట్లు వస్తాయి. విండీస్ 2 పాయింట్లతోనే ఆగిపోతుంది కాబట్టి, రన్ రేట్తో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్కు వెళ్లే అవకాశం ఉంటుంది.
అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఒకవేళ వెస్టిండీస్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే మాత్రం భారత్కు కష్టాలు మొదలవుతాయి. అప్పుడు భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్.. (జింబాబ్వేను ఓడిస్తే) ఈ మూడు జట్లు చెరో రెండు విజయాలతో 4 పాయింట్ల దగ్గర సమానంగా నిలిచే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో ఏ రెండు జట్లు సెమీస్ వెళ్లాలో నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఆ పరిస్థితి వస్తే ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.
అందుకే భారత్ తన వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే.. మొదట జింబాబ్వేపై ఘనవిజయం సాధించాలి. ఆ తర్వాత మార్చి 1న జరిగే మ్యాచ్లో వెస్టిండీస్ను భారీ రన్ రేట్ తేడాతో ఓడించాలి. ఇలా చేయడం వల్ల ఒకవేళ రన్ రేట్ లెక్కలోకి వచ్చినా పోటీలో ఉండే అవకాశం ఉంటుంది.
అంటే భారత్ గెలవడమే కాకుండా, సౌత్ ఆఫ్రికా తన జోరును కొనసాగించి విండీస్ను అడ్డుకోవాలని కోరుకోవాలి. టీమిండియా భవితవ్యం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రదర్శన మీద కూడా ఆధారపడి ఉంది. రెండు మ్యాచ్లు గెలుస్తూ, సఫారీలు విండీస్ను ఓడిస్తే భారత్ దారి సుగమం అవుతుంది. మరి ఈ వారం రోజుల్లో జరిగే ఈ సమీకరణాల్లో ఏది నిజమవుతుందో చూడాలి.
This post was last modified on February 24, 2026 2:27 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…