దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు నుంచి కోరుకుంటున్నారు. 2010 ప్రాంతంలోనే సాధ్యం కావాల్సిన ఈ కాంబినేషన్ ఎట్టకేలకు రెండేళ్ల ముందు ముందుకు కదిలింది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై పాన్ వరల్డ్ లెవెల్లో భారీ అంచనాలున్నాయి.
మహేష్, రాజమౌళి చాలా ఆలస్యంగా కలిసినా.. ఈ ఆలస్యం కూడా మంచికే అనుకుంటున్నారు అభిమానులు. ఐతే రెండేళ్లుగా ఈ ఇద్దరూ మంచి అండర్స్టాండింగ్తో సాగిపోతున్నారు. అలాంటి ఇద్దరూ బీభత్సంగా కొట్టేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ కొంటె ఆలోచనతోనే ఏఐ సాయంతో తయారు చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజమౌళి ప్రెజెంట్ లుక్, మహేష్ ‘వారణాసి’ రుద్ర లుక్లో ఉండి.. ఒక కాఫీ షాప్ లాంటి ప్లేసులో ఒకరినొకరు చితగ్గొట్టేసుకుంటున్నారు ఈ వీడియోలో. ఒకరి దెబ్బలకు ఇంకొకరు ఎగిరి పడి కుర్చీలు, టేబుళ్లు విరిగిపోవడం.. చుట్టూ ఉన్న వాళ్లు చూసి అవాక్కవ్వడం.. ఇలా సాగింది వీడియో. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతికి చిక్కింది.
ఎక్స్లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆర్జీవీ.. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘సినిమా ఈజ్ డెడ్’ అని క్యాప్షన్ కూడా జోడించాడు. మామూలుగానే వర్మ ఏ వీడియో పంచుకున్నా వైరల్ అవుతుంది. అలాంటిది రాజమౌళి, మహేష్ బాబులు ఒకరినొకరు చితగ్గొట్టేసుకుంటున్నట్లుగా రూపొందించిన వీడియో కావడంతో ఇది మరింతగా వైరల్ అవుతోంది. ఈ పాటికే ఈ వీడియో రాజమౌళి, మహేష్ బాబుల దృష్టిలో పడి ఉన్నా.. రేప్పొద్దున ఈ ఇద్దరూ దాని మీద స్పందించినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on February 24, 2026 7:46 pm
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…