దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు నుంచి కోరుకుంటున్నారు. 2010 ప్రాంతంలోనే సాధ్యం కావాల్సిన ఈ కాంబినేషన్ ఎట్టకేలకు రెండేళ్ల ముందు ముందుకు కదిలింది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై పాన్ వరల్డ్ లెవెల్లో భారీ అంచనాలున్నాయి.
మహేష్, రాజమౌళి చాలా ఆలస్యంగా కలిసినా.. ఈ ఆలస్యం కూడా మంచికే అనుకుంటున్నారు అభిమానులు. ఐతే రెండేళ్లుగా ఈ ఇద్దరూ మంచి అండర్స్టాండింగ్తో సాగిపోతున్నారు. అలాంటి ఇద్దరూ బీభత్సంగా కొట్టేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ కొంటె ఆలోచనతోనే ఏఐ సాయంతో తయారు చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజమౌళి ప్రెజెంట్ లుక్, మహేష్ ‘వారణాసి’ రుద్ర లుక్లో ఉండి.. ఒక కాఫీ షాప్ లాంటి ప్లేసులో ఒకరినొకరు చితగ్గొట్టేసుకుంటున్నారు ఈ వీడియోలో. ఒకరి దెబ్బలకు ఇంకొకరు ఎగిరి పడి కుర్చీలు, టేబుళ్లు విరిగిపోవడం.. చుట్టూ ఉన్న వాళ్లు చూసి అవాక్కవ్వడం.. ఇలా సాగింది వీడియో. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతికి చిక్కింది.
ఎక్స్లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆర్జీవీ.. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘సినిమా ఈజ్ డెడ్’ అని క్యాప్షన్ కూడా జోడించాడు. మామూలుగానే వర్మ ఏ వీడియో పంచుకున్నా వైరల్ అవుతుంది. అలాంటిది రాజమౌళి, మహేష్ బాబులు ఒకరినొకరు చితగ్గొట్టేసుకుంటున్నట్లుగా రూపొందించిన వీడియో కావడంతో ఇది మరింతగా వైరల్ అవుతోంది. ఈ పాటికే ఈ వీడియో రాజమౌళి, మహేష్ బాబుల దృష్టిలో పడి ఉన్నా.. రేప్పొద్దున ఈ ఇద్దరూ దాని మీద స్పందించినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on February 24, 2026 7:46 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…