Political News

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టి తప్పు మీదంటే మీది అని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభలో ఆ అంశంపై మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

లడ్డూ తరహా అంశం ఇస్లాంలోగానీ, క్రిస్టియానిటీలోగాని జరిగి ఉంటే వేరేలా ఉండేదని పవన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ముస్లిం, క్రిస్టియన్ ఓటు బ్యాంకు పోతుందన్న భయం రాజకీయ నాయకుల్లో ఉందని, కానీ, హిందువులు ఎక్కడికి వెళ్లరన్న భావన ఉందని అన్నారు. హిందువులకు సంబంధించిన అంశం కాబట్టి సీరియస్ నెస్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

లడ్డూ విషయంలో హిందువులు తమను తామే నిందించుకోవాలని పవన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. మిగతా మతాలను చూసి హిందువులు నేర్చుకోవాలని, కులాల వారీగా హిందువులు విడిపోయారని అన్నారు. ఇక, గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదని జగన్ ను ఉద్దేశించి కూడా పవన్ మాట్లాడారు.

గత టీటీడీ బోర్డుదే తప్పని చెప్పానని, టీటీడీ బోర్డులోని వారిని జగన్ ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదని అన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందని సిట్ తేల్చిందని పవన్ వెల్లడించారు.

ఒక్క లీటర్ పాలు కూడా నెయ్యి తయారీకి వాడలేదని సిట్ తెలిపిందని అన్నారు. నెయ్యిలో నెయ్యే లేదని తేలిందని, రసాయనాల నుంచి నెయ్యి తీయవచ్చని చూపించారని మండిపడ్డారు. నెయ్యిలో కల్తీ లేదు, జంతువుల కొవ్వు లేదని అనడంతోనే సభలో ఇంత మంది మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు.

This post was last modified on February 24, 2026 6:32 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Pawan

Recent Posts

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

2 hours ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

8 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

8 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

10 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

11 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

12 hours ago