తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టి తప్పు మీదంటే మీది అని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభలో ఆ అంశంపై మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
లడ్డూ తరహా అంశం ఇస్లాంలోగానీ, క్రిస్టియానిటీలోగాని జరిగి ఉంటే వేరేలా ఉండేదని పవన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ముస్లిం, క్రిస్టియన్ ఓటు బ్యాంకు పోతుందన్న భయం రాజకీయ నాయకుల్లో ఉందని, కానీ, హిందువులు ఎక్కడికి వెళ్లరన్న భావన ఉందని అన్నారు. హిందువులకు సంబంధించిన అంశం కాబట్టి సీరియస్ నెస్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
లడ్డూ విషయంలో హిందువులు తమను తామే నిందించుకోవాలని పవన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. మిగతా మతాలను చూసి హిందువులు నేర్చుకోవాలని, కులాల వారీగా హిందువులు విడిపోయారని అన్నారు. ఇక, గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదని జగన్ ను ఉద్దేశించి కూడా పవన్ మాట్లాడారు.
గత టీటీడీ బోర్డుదే తప్పని చెప్పానని, టీటీడీ బోర్డులోని వారిని జగన్ ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదని అన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందని సిట్ తేల్చిందని పవన్ వెల్లడించారు.
ఒక్క లీటర్ పాలు కూడా నెయ్యి తయారీకి వాడలేదని సిట్ తెలిపిందని అన్నారు. నెయ్యిలో నెయ్యే లేదని తేలిందని, రసాయనాల నుంచి నెయ్యి తీయవచ్చని చూపించారని మండిపడ్డారు. నెయ్యిలో కల్తీ లేదు, జంతువుల కొవ్వు లేదని అనడంతోనే సభలో ఇంత మంది మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…