Political News

ఇదేం స్పీడండీ బాబూ!… ధ్యాంక్యూ నారా లోకేశ్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే.. అది క్షణాల్లో అమలు కావాల్సిందే. ఇదేదో… టీడీపీ అభిమానులో, లేదంటే లోకేశ్ అంటే అభిమానం ఉన్న వారో చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు. నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తున్న శ్రీ కాశినాయన ఆశ్రమ పూజారులు, ఆ మఠం భక్తులు చెబుతున్న మాట. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఏళ్ల తరబడి కాశినాయన ఆశ్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిత్యం వేలాది మంది భక్తులకు అన్నదానం జరుగుతూ ఉంటుంది. అయితే కావాలని కాదు గానీ… ఆశ్రమానికి చెందిన కొన్ని భవనాలు టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్నాయంటూ అటవీ శాఖ అధికారులు వాటిని కూల్చేశారు. అయితే విషయం తెలిసిన వెంటనే బేషరతుగా సారీ చెప్పిన లోకేశ్… తిరిగి ఆ భవనాలను తన సొంత నిధులతో నిర్మించి ఇస్తానని చెప్పారు.

మాట ఇచ్చిన మేరకే… లోకేశ్ తన బృందాన్ని తెల్లారేసరికల్లా ఆశ్రమం వద్ద దింపేశారు. ఏమాత్రం ఆలస్యం లేకుండానే కూలిన భవనాల స్థానంలో కొత్తగా భవన నిర్మాణాలను ప్రారంభించేలా చేశారు. సాంకేతికతను వినియోగించుకున్న లోకేశ్ బృందం ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే సదరు భవనాల నిర్మాణాలను పూర్తి చేసింది. అంతేకాకుండా ఆ వెంటనే సదరు భవనాలను కాశినాయన ఆశ్రమ నిర్వాహకులకు అప్పగించి… వినియోగించుకునేందుకు సర్వం సిద్ధంగా భవనాలు ఉన్నాయని చెప్పింది. లోకేశ్ బృందం నిర్మించిన ఆ భవనాలను చూసిన ఆశ్రమ నిర్వాహకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ… లోకేశ్ మార్కు స్పీడుకు ముచ్చటపడి.. భవనాలను సోమవారం నుంచే వినియోగించడం మొదలుపెట్టేశారు.

ఈ సందర్భంగా ఆశ్రమం వద్దకు వెళ్లే భక్తులకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన బృందం… సోమవారం ఉదయమే సదరు బస్సును ఆశ్రమానికి తీసుకెళ్లారు. కూలిపోయిన భవనాల స్థానంలో సర్వాంగ సుందరంగా, అన్నదానానికి వినియోగించుకునేందుకు మరింత సౌలభ్యంగా ఉన్న సదరు భవనాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే భవనాలను నిర్మించి ఇచ్చిన లోకేశ్ కు ధన్యవాదాలు తెలుపుతూ… థ్యాంక్యూ నారా లోకేశ్ అంటూ రాసి ఉన్న ప్లకార్డులు పట్టిన భక్తులు, ఆశ్రమ పూజారులు వాటిని ప్రదర్శించారు. మూడంటే మూడు రోజుల్లోనే సమస్యను పరిష్కరించడంతో పాటుగా కూలిన భవనాల స్థానంలోనే కొత్త భవనాలను చూసిన వారంతా నిజంగానే లోకేశ్ ను అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

This post was last modified on March 17, 2025 9:55 am

Share

Recent Posts

‘ధర్మస్థల నియోజకవర్గం’ – సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు…

6 minutes ago

ఎవ‌రా ‘ఉత్త‌రాంధ్ర నేత‌’.. వైసీపీలో హాట్ టాపిక్‌

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తాజాగా వైసీపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై చేసిన…

16 minutes ago

నేపాల్ వరదల్లో తెలుగువాళ్ళని కాపాడిన టీ

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టడని పెద్దలు చెప్పే మాట నిజమని మరోసారి రుజువయ్యింది. కైలాస మానస సరోవర యాత్ర కోసం…

3 hours ago

లైనప్ మార్చబోతున్న రవితేజ ?

ఇరుముడి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడం అభిమానులకే కాదు రవితేజకు కూడా ఎక్కడ లేని హుషారు తీసుకొచ్చింది. హిట్…

3 hours ago

నాని మార్కెట్ లక్ష్యాలు… ఓదెల మాస్ అస్త్రాలు

మొన్నటిదాకా హాయ్ నాన్న, జెర్సీ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా టార్గెట్ చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు పూర్తిగా…

4 hours ago

అలిగి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే దానం నాగేందర్

ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారు. డబుల్ బెడ్ రూం లక్కీ డ్రా కార్యక్రమం నుంచి మధ్యలోనే…

4 hours ago