విడుదలై నెలరోజులు దాటుతున్నా ఛావా పరుగులు ఆగడం లేదు. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతం వస్తే చాలు విక్కీ కౌశల్ మళ్ళీ పేట్రేగిపోతున్నాడు. దీని తర్వాత చెప్పుకోదగ్గ బాలీవుడ్ మూవీ రాకపోవడం వసూళ్ల పరంగా కలిసి వస్తోంది. ఇటీవలే రిలీజైన జాన్ అబ్రహం ది డిప్లమాట్ కు మంచి టాక్ వచ్చినా కూడా అది కలెక్షన్లుగా మారలేకపోతోంది. ఆలస్యంగా రిలీజైనప్పటికీ ఛావా తెలుగు వెర్షన్ పదిహేను కోట్లను దాటేయడం చిన్న విషయం కాదు. ఒకవేళ కోర్ట్ కనక దూకుడుగా లేకపోయి ఉంటే మరాఠా వీరుడు పాతిక కోట్లను టార్గెట్ చేసేవాడే. కానీ మిస్సయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
తాజాగా ఛావా మరో మెయిలు రాయి అందుకుంది. నెట్ కలెక్షన్ల పరంగా ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. యానిమల్ (553 కోట్లు), జవాన్ (543 కోట్లు) ని దాటేసి ఛావా 555 కోట్లను అందుకుంది. ఇంకా ఫైనల్ రన్ కాలేదు కాబట్టి మరో వంద కోట్లకు పైగా అదనంగా తొడవ్వొచ్చని ఒక అంచనా. గ్రాస్ పరంగా చూసుకుంటే ఛావా 741 కోట్లతో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓవర్సీస్ లోనూ 86 కోట్ల దాకా వసూలు చేయడం మరో రికార్డు. టాప్ 10లోకి ప్రవేశించిన ఛావా హీరో విక్కీ కౌశల్ కు తొలిసారి ఈ క్లబ్బులో చోటు సంపాదించి పెట్టింది. ఖాన్లు, కపూర్ల డామినేషన్ ని సవాల్ చేసే నెంబర్లు ఇచ్చింది.
ఇక ఛావా ముందున్న నెక్స్ట్ టార్గెట్ వెయ్యి కోట్ల గ్రాస్. అదేమీ అసాధ్యం కాదు కానీ అలాని సులభము కాదు. ఇప్పటికే నెమ్మదించిన రన్ ని తిరిగి కొనసాగించాలంటే జనాన్ని మళ్ళీ థియేటర్లకు వచ్చేలా చేయాలి. ఒక వారం రోజులు అయ్యాక ఓటిటి స్ట్రీమింగ్ దగ్గర్లో ఉన్నప్పుడు ఆఫర్లు ప్రకటించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. వన్ ప్లస్ వన్, వంద రూపాయలకు మల్టీప్లెక్స్ టికెట్ లాంటివి జనాన్ని బాగా ఆకర్షిస్తాయి. మరి ఛావా ప్రొడ్యూసర్లు అలాంటివి ఏమైనా చేస్తే పుంజుకునే అవకాశం కొట్టిపారేయలేం. ఛావా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ దాన్ని ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేయొచ్చట.
This post was last modified on March 17, 2025 10:31 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…