Political News

బాబు, జగన్ ల మధ్య తేడా ఇదే!

ఓ వైపేమో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే… విపక్షాలు సైతం తమ కార్యక్రమాలను ఘనంగా చేసుకుంటాయి. భారీ ఏర్పాట్లు చేసుకున్నా బాబు సర్కారు అంతగా పట్టించుకోదు. సరే… వారేదో సంబరాలు చేసుకుంటున్నారు కదా. వారి సంతోషాన్ని మనమెందుకు తగ్గించాలి? అన్నట్లుగా సాగుతుంది. అంటే.. అధికారంలో ఉన్నా గానీ చంద్రబాబు సహనంతో సాగుతారు.

అదే వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే… వైరి వర్గాలు సంబరాలే చేసుకోకూడదు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. ఆ సంబరాల్లో నిబంధనలు అతిక్రమించారంటూ ఉన్నపళంగా ఆంక్షల కత్తులను బయటకు తీసి.. ఆ సంబరాలను కాస్తా నిరసనలుగా మార్చేస్తుంది. అంటే… అధికారంలో ఉంటే జగన్ లో సహనం అన్నదే కనిపించదు. ఈ ఇద్దరి వైఖరులకు అద్దం పట్టేలా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అసలు విషయంలోకి వెళితే… నేడు జగన్ గుంటూరు జిల్లాలోని తెనాలికి వెళుతున్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి పెళ్లి సోమవారం జరుగుతోందట. ఈ వేడుకకు జగన్ హాజరవుతున్నారు. ఈ క్రమంలో తెనాలి పట్టణంతో పాటుగా తెనాలికి దారి తీసే మార్గం జగన్ ఫ్లెక్సీలు, పోస్టర్లతో నిండిపోయింది. అదేదో వైసీపీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లుగా రహదారి నిండా జగన్, వైసీపీ బ్యానర్లే కనిపిస్తున్నాయి.

సరే.. మొన్నటి ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కనంతగా జగన్ దిగజారగా… ఎంతైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత కదా అన్న భావనతో ఈ బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుపై అటు కూటమి సర్కారు, ఇటు అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు. సహనంతోనే సాగిపోతోందన్న మాట. ప్రస్తుతం తెనాలి ఎమ్మెల్యేగా జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

సరే… వైసీపీ అధికారంలో ఉండగా 2022లో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు కేంద్రంగా టీడీపీ మహానాడు వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఏటా మూడు రోజుల పాటు మహానాడు పేరిట పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2022లో ఒంగోలులో మహానాడును నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంతో పాటు నగర పరిసరాలన్నీ దాదాపుగా పసుపు మయం అయిపోయాయి.

అయితే నాడు అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు ఆంక్షల కత్తులను బయటకు తీసింది. నిబంధనల పేరిట మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగి చాలా ప్రాంతాల్లో టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించింది. ఈ పరిణామంపై నాడు టీడీపీ నిరసన వ్యక్తం చేసినా పెద్దగా పట్టించుకున్న దాఖలానే కనిపించలేదు. విపక్షంలో ఉన్న పార్టీలు ఆవిర్భావ వేడుకలు కూడా నిర్వహించుకోవడానికి వీల్లేదా అంటూ టీడీపీ నేతలు చేసిన వాదనలు అరణ్య రోదనగానే మిగిలిపోయాయి.

This post was last modified on March 17, 2025 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

20 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago