Political News

నాగబాబు తేనెతుట్టెను కదిపారే..

నిన్నటి జనసేన జయకేతనం మీటింగ్ సోషల్ మీడియాలో పెద్ద స్థాయి చర్చకే దారి తీసింది. ఇందులో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో భాగంగా అనేక అంశాల మీద మాట్లాడాడు. ఆయన చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో జరుగుతున్న పోరాటం మీద పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో పాటు మరి కొన్ని కామెంట్ల మీద విస్తృత చర్చ జరుగుతోంది.

ఇవన్నీ పక్కన పెడితే.. జనసేనకు మిత్రపక్షం అయిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు ఈ మీటింగ్‌లో ఒక కామెంట్ తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. ఐతే అది పవన్ చేసిన వ్యాఖ్య కాదు. ఆయన సోదరుడు, ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు కామెంట్ అది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి జనసైనికులు, ప్రజలు మాత్రమే కారణమని.. ఇంకెవ్వరూ విజయానికి క్రెడిట్ తీసుకోవడానికి వీల్లేదని నాగబాబు పేర్కొనడం తీవ్ర వివాదానికే దారి తీసింది.

కూటమి ప్రభుత్వం సాఫీగా సాగిపోతున్న సమయంలో తెలుగుదేశం, జనసేన మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అంటూ నాగబాబు మీద టీడీపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఎన్నో ఏళ్లుగా అక్కడ పనిచేసుకుంటున్న వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు ఆయన్ని వెంటబెట్టుకునే పవన్ ప్రచారానికి వెళ్లారు. తన గెలుపును వర్మ చేతుల్లో పెడుతున్నట్లు కూడా వ్యాఖ్యానించారు. వర్మే పవన్‌ను గెలిపించాడని చెప్పలేం కానీ.. ఆయన పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.

ఐతే పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఫస్ట్ లిస్ట్‌లోనే ఎమ్మెల్సీ ఇస్తామన్న చంద్రబాబు మాట నిలబెట్టుకోలేకపోయారు. అయినా సరే.. వర్మ నిరసన స్వరం వినిపించలేదు. బాబుకు ఉండే ఇబ్బందులు బాబుకు ఉంటాయంటూ కార్యకర్తలకు సర్దిచెప్పారు. వర్మకు పదవి ఇవ్వకపోవడంపై ఇప్పటికే ఆయన అనుచరులు, టీడీపీ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో నాగబాబు, సోము వీర్రాజు లాంటి వాళ్లకు ఎమ్మెల్సీ ఇవ్వడమూ వారికి నచ్చలేదు.

ఇలా అసంతృప్తిలో ఉన్న సమయంలో నాగబాబు చేసిన కామెంట్లు వారికి మరింత బాధ, కోపం తెప్పిస్తున్నాయి. వర్మ, తెలుగుదేశం కార్యకర్తలు పవన్ విజయం కోసం కష్టపడలేదా.. వారి కృషిని గుర్తించకపోగా.. ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడ్డం ఏంటి అంటూ నాగబాబు మీద నిన్న రాత్రి నుంచి టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున వ్యతిరేకతను చూపిస్తోంది. నాగబాబు లాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలను నియంత్రించుకోకుంటే టీడీపీ, జనసేన మధ్య చిచ్చు తప్పదనిహెచ్చరిస్తున్నారు.

This post was last modified on March 15, 2025 4:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

59 seconds ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

49 minutes ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

1 hour ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

2 hours ago

RC 16 – ఒకట్రెండు ఆటలు కాదు బాసూ

రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉంటుందనే టాక్ ఉంది…

2 hours ago

అంతా సిద్ధం!.. టెస్లా రావడమే ఆలస్యం!

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…

4 hours ago