Political News

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం ఒక్కరోజులోనే 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా రూ. 11,770 పెరిగి రూ. 1,78,850కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా ఊహకందని రీతిలో కిలోకు రూ. 25,000 పెరిగి, ప్రస్తుతం రూ. 4,25,000 మార్కును తాకింది. పెరుగుతున్న ఈ ధరలు చూస్తుంటే సామాన్యుడికి వెండి కూడా బంగారంలాగే అందనంత ఎత్తుకు చేరువయ్యేలా కనిపిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అమెరికా డాలర్ విలువ పడిపోవడం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అమెరికా అప్పులు పెరగడం, అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే బులియన్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా, గ్రీన్ టెక్నాలజీ డేటా సెంటర్ల వినియోగం పెరగడం వల్ల పారిశ్రామికంగా వెండికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2026 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొని వాణిజ్య వివాదాలు పరిష్కారమైతే తప్ప ఈ ధరలు తగ్గే అవకాశం లేదని స్పష్టమైంది. గత ఏడాది కాలంలో బంగారం ధరలు 100 శాతం పెరగ్గా, వెండి ధరలు ఏకంగా 272 శాతానికి పైగా పెరిగాయని నివేదిక వెల్లడించింది. ఈ స్థాయిలో వెండి ధరలు పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ తమ నిల్వలను పెంచుకోవడం కూడా మార్కెట్‌లో ధరల పెరుగుదలకు బలం చేకూర్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 5500 డాలర్లు దాటిన నేపథ్యంలో, దాని ప్రభావం భారతీయ మార్కెట్‌పై నేరుగా పడుతోంది. బులియన్ స్ట్రీట్‌లో సాగుతున్న ఈ ‘బుల్’ రన్ ఎప్పుడు ఆగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

This post was last modified on January 29, 2026 9:52 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

38 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago