సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన డిజాస్టర్లూ ఉన్నాయి. అందులో వరుడు అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే ఇది డిజాస్టర్ అని తేలిపోయింది. ఆ సినిమాకు అతి పెద్ద మైనస్ల్లో ఒకటి హీరోయిన్ భానుశ్రీ మెహతా విషయంలో గుణశేఖర్ ఆడిన గేమ్ అని చెప్పొచ్చు.
సినిమా మొదలైన దగ్గర్నుంచి హీరోయిన్ ముఖం చూపించకుండా ఊరించి ఊరించి.. రిలీజ్ ముంగిట ఆమెను పరిచయం చేయగా, ఆమె అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశచెందారు. సినిమాలో హీరోయిన్ పాత్ర, లుక్స్ మరింతగా నిరాశపరిచాయి. ఈ విషయంలో తాను చేసిన తప్పు ఏంటో.. సినిమా రిలీజవ్వగానే తెలిసిపోయిందని గుణశేఖర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
పెళ్లి మీద సినిమా, అందులో హీరో హీరోయిన్లు నేరుగా పెళ్లిపీటల మీదే ఒకరినొకరు చూసుకుంటారు అని చెప్పగానే వరుడు టీంలో అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారని.. ఇందుకు తగ్గట్లే ప్రేక్షకులకు కూడా హీరోయిన్ని నేరుగా సినిమాలో చూపిద్దామని తాను అనుకున్నానని గుణశేఖర్ తెలిపాడు. అందుకోసం హీరోయిన్ని దాచి పెడితే.. ఆ ప్రమోషనల్ ఐడియా బాగా వర్కవుట్ అయి ఆ అమ్మాయి విషయంలో తాను ఊహించని హైప్ వచ్చేసిందని గుణశేఖర్ తెలిపాడు.
ఆ హైప్ ఏ స్థాయికి వెళ్లిందో చెబుతూ.. కొందరు మినిస్టర్లు, వాళ్ల కుటుంబ సభ్యులు తనకు, తన భార్యకు కాల్ చేసి ఎవరా హీరోయిన్ అని అడిగేవారని.. ఆమె కమల్ హాసన్ కూతురా అని కూడా వాకబు చేశారని గుణశేఖర్ వెల్లడించాడు. చివరికి ఈ హైప్ సినిమాకు మైనస్ అయిందని.. ఆ అమ్మాయి జనాలకు ఆనలేదని గుణ చెప్పాడు.
భాను శ్రీ మెహతా మామూలుగా చూస్తే బాగానే ఉంటుందని.. కానీ ఈ హైప్ వల్ల ఆమె జనాల అంచనాలను అందుకోలేకపోయిందని.. ఆమే కాదు, ఏ హీరోయిన్ అయినా జనాలకు ఆనేది కాదని గుణశేఖర్ అభిప్రాయపడ్డాడు. ముందు అనుకున్న అయిదు రోజుల పెళ్లి కాన్సెప్ట్ మీదే సినిమా తీసి ఉంటే బాగుండేదని.. సెకండాఫ్లో యాక్షన్ పార్ట్ పెట్టడం కూడా వరుడు సినిమాకు మైనస్ అయిందని గుణ చెప్పాడు.
This post was last modified on January 29, 2026 9:52 pm
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…