Chevireddy Bhaskar Reddy
వైసీపీకి చెందిన కీలక నేతలకు వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, చోటామోటా నేతలు కూడా విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై ఎక్కడికక్కడ కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాలపై ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటుగా వారిలో కొందరిని అరెస్టు కూడా చేసింది. మరికొందరు కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిళ్లు తీసుకుని అరెస్టు నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నారు. ఇలాంటి వైసీపీ నేతల జాబితాలో ఇప్పుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇంచార్జీ చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంతు వచ్చింది.
బుధవారం వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకునే నిమిత్తం ఒంగోలులోని వైసీపీ కార్యాలయానికి చెవిరెడ్డి చేరుకోగా… సమాచారం అందుకున్న ఎర్రగొండపాలెం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎర్రగొండపాలెం వెళ్లిన సందర్భంగా అక్కడ వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా..అందులో చెవిరెడ్డి పాత్ర ఉందంటూ ఆయనపై పోలీసులు ఏకంగా 5 కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకున్న సందర్భంగానే చెవిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడం గమనార్హం.
వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకున్న తర్వాత తన వద్దకు వచ్చిన పోలీసులు ఇచ్చిన నోటీసులను చెవిరెడ్డి అందుకున్నారు. సంబంధిత పత్రాలపై అక్కడే సంతకం చేసిన చెవిరెడ్డి నోటీసులు తీసుకున్నారు. అదే సమయంలో ఈ కేసు విచారణకు ఎప్పుడో కాదు… ఈ రోజే హాజరు కావాలని పోలీసులు చెవిరెడ్డికి తెలిపారు. దీనికి సరేనంటూ చెవిరెడ్డి కూడా తలూపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి… పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. తనపై ఎన్నైనా కేసులు పెట్టుకోండి… తానేమీ భయపడేది లేదని ఆయన తెలిపారు. గతంలో జగన్ పక్షాన నిలబడినందుకు తనపై ఏకంగా 88 కేసులు నమోదు చేశారని ఆయన అన్నారు. కేసులతో వైసీపీని, తనను అడ్డుకోలేరని కూడా చెవిరెడ్డి తెలిపారు. కేసులకు, పోలీసుల విచారణకు తాను భయపడేది లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు.
This post was last modified on March 12, 2025 1:58 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…