Political News

సంబరాల వేళ చెవిరెడ్డికి షాక్

వైసీపీకి చెందిన కీలక నేతలకు వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, చోటామోటా నేతలు కూడా విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై ఎక్కడికక్కడ కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాలపై ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటుగా వారిలో కొందరిని అరెస్టు కూడా చేసింది. మరికొందరు కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిళ్లు తీసుకుని అరెస్టు నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నారు. ఇలాంటి వైసీపీ నేతల జాబితాలో ఇప్పుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇంచార్జీ చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంతు వచ్చింది.

బుధవారం వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకునే నిమిత్తం ఒంగోలులోని వైసీపీ కార్యాలయానికి చెవిరెడ్డి చేరుకోగా… సమాచారం అందుకున్న ఎర్రగొండపాలెం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎర్రగొండపాలెం వెళ్లిన సందర్భంగా అక్కడ వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా..అందులో చెవిరెడ్డి పాత్ర ఉందంటూ ఆయనపై పోలీసులు ఏకంగా 5 కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకున్న సందర్భంగానే చెవిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడం గమనార్హం.

వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకున్న తర్వాత తన వద్దకు వచ్చిన పోలీసులు ఇచ్చిన నోటీసులను చెవిరెడ్డి అందుకున్నారు. సంబంధిత పత్రాలపై అక్కడే సంతకం చేసిన చెవిరెడ్డి నోటీసులు తీసుకున్నారు. అదే సమయంలో ఈ కేసు విచారణకు ఎప్పుడో కాదు… ఈ రోజే హాజరు కావాలని పోలీసులు చెవిరెడ్డికి తెలిపారు. దీనికి సరేనంటూ చెవిరెడ్డి కూడా తలూపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి… పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. తనపై ఎన్నైనా కేసులు పెట్టుకోండి… తానేమీ భయపడేది లేదని ఆయన తెలిపారు. గతంలో జగన్ పక్షాన నిలబడినందుకు తనపై ఏకంగా 88 కేసులు నమోదు చేశారని ఆయన అన్నారు. కేసులతో వైసీపీని, తనను అడ్డుకోలేరని కూడా చెవిరెడ్డి తెలిపారు. కేసులకు, పోలీసుల విచారణకు తాను భయపడేది లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు.

This post was last modified on March 12, 2025 1:58 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chevireddy

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

37 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

44 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago