జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే దువ్వాడపై రెండు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే, పవన్ ను కించపరిచేలా మాట్లాడిన దువ్వాడపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, దువ్వాడపై కేసుల పరంపర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా దువ్వాడపై గుంటూరులో మరో కేసు నమోదైంది.
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ మాణిక్యాల రావు గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రతి నెలా 50 కోట్లు ఇస్తున్నారంటూ దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ప్రకారం దువ్వాడపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో దువ్వాడకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశముంది.
అంతకుముందు, దువ్వాడపై కృష్ణా జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి హరిరామ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు సింగలూరి శాంతిప్రసాద్ తదితరులు కలిసి బందరు డీఎస్పీ రాజాకు దువ్వాడపై ఫిర్యాదు చేశారు. గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు పోలీస్ స్టేషన్లలో కూడా దువ్వాడపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఇక, పవన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, దువ్వాడపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on March 6, 2025 11:42 am
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…
ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…