జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే దువ్వాడపై రెండు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే, పవన్ ను కించపరిచేలా మాట్లాడిన దువ్వాడపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, దువ్వాడపై కేసుల పరంపర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా దువ్వాడపై గుంటూరులో మరో కేసు నమోదైంది.
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ మాణిక్యాల రావు గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రతి నెలా 50 కోట్లు ఇస్తున్నారంటూ దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ప్రకారం దువ్వాడపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో దువ్వాడకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశముంది.
అంతకుముందు, దువ్వాడపై కృష్ణా జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి హరిరామ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు సింగలూరి శాంతిప్రసాద్ తదితరులు కలిసి బందరు డీఎస్పీ రాజాకు దువ్వాడపై ఫిర్యాదు చేశారు. గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు పోలీస్ స్టేషన్లలో కూడా దువ్వాడపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఇక, పవన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, దువ్వాడపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…