జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే దువ్వాడపై రెండు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే, పవన్ ను కించపరిచేలా మాట్లాడిన దువ్వాడపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, దువ్వాడపై కేసుల పరంపర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా దువ్వాడపై గుంటూరులో మరో కేసు నమోదైంది.
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ మాణిక్యాల రావు గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రతి నెలా 50 కోట్లు ఇస్తున్నారంటూ దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ప్రకారం దువ్వాడపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో దువ్వాడకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశముంది.
అంతకుముందు, దువ్వాడపై కృష్ణా జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి హరిరామ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు సింగలూరి శాంతిప్రసాద్ తదితరులు కలిసి బందరు డీఎస్పీ రాజాకు దువ్వాడపై ఫిర్యాదు చేశారు. గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు పోలీస్ స్టేషన్లలో కూడా దువ్వాడపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఇక, పవన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, దువ్వాడపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…