జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే దువ్వాడపై రెండు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే, పవన్ ను కించపరిచేలా మాట్లాడిన దువ్వాడపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, దువ్వాడపై కేసుల పరంపర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా దువ్వాడపై గుంటూరులో మరో కేసు నమోదైంది.
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ మాణిక్యాల రావు గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రతి నెలా 50 కోట్లు ఇస్తున్నారంటూ దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ప్రకారం దువ్వాడపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో దువ్వాడకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశముంది.
అంతకుముందు, దువ్వాడపై కృష్ణా జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి హరిరామ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు సింగలూరి శాంతిప్రసాద్ తదితరులు కలిసి బందరు డీఎస్పీ రాజాకు దువ్వాడపై ఫిర్యాదు చేశారు. గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు పోలీస్ స్టేషన్లలో కూడా దువ్వాడపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఇక, పవన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, దువ్వాడపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on March 6, 2025 11:42 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…